MLC Elections 2025: మేం మూడు స్థానాల్లో గెలుస్తున్నాం: కిషన్ రెడ్డి
- మూడు స్థానాల్లో గెలుస్తున్నాం
- కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు
- తెలంగాణ అభివృద్ధికి బీజేపీకి ఓటు వేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అభివృద్ధికి బీజేపీకి ఓటు వేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము మూడు స్థానాల్లో గెలుస్తున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటను తెలంగాణ ప్రజలు వినాలని, అయన పనితీరు ఆధారంగానే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం మాపై విమర్శలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడినట్టు.. ఇప్పుడు మాట్లాడితే ఓట్లు పడతాయని సీఎం అనుకుంటున్నాడని విమర్శించారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని కిషన్ రెడ్డి చెప్పారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీకి పాలసీ ఉంటే.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గానీ, ఆ పార్టీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయడం లేదు. రేవంత్ రెడ్డి మాటను తెలంగాణ ప్రజలు వినాలి, అయన పనితీరు ఆధారంగానే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. దొంగనే.. దొంగ దొంగ అన్నట్టు ఉంది రేవంత్ వ్యవహారం. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మాపై విమర్శలు చేస్తున్నారు. చేతనైతే సీఎంగా పని చెయ్యి.. అనవసరంగా బురద చల్లకు. రీజనల్ రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్.. మధ్యలో నివేంది రేవంత్. అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడితే ఓట్లు పడతాయి అని అనుకుంటున్నాడు’ అని అన్నారు.
Also Read
- US Citizenship Fee Hike: ఎన్నారైలకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న అమెరికా సిటిజన్షిప్ ఫీజులు?
- ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎం జైల్లో పెడతా అన్నాడు.. ఒక్క మంత్రి మీద, కేసీఆర్ కుటుంబం మీద చర్య తీసుకోలేదు. నీచ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు రేవంత్. నేనే పెద్ద హీరో అన్నట్టు రేవంత్ మాట్లాడుతున్నారు. బీసీలకు న్యాయం జరగాలి అని, బీసీ రిజర్వేషన్లను పెంచాలి. కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం సంతొషంగా లేదు.. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది. తెలంగాణ అభివృద్ధికి బీజేపీకి ఓటు వేయాలి. మేము పోరాటం చేశాము కాబట్టే మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నాం, మూడు స్థానాల్లో గెలుస్తున్నాం’ అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Skoda Peak EV: స్కోడా కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV ‘పీక్’ ఆవిష్కరణ.. 647KM రేంజ్తో అదిరిపోయే ఫీచర్లు
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
George Krish : ‘జార్జ్ క్రిష్’ షూటింగ్కు కౌంట్డౌన్.. హీరోయిన్పై సస్పెన్స్ వీడిందా?
-
Rule Change 1st July: జూలై 1 నుంచి మీ జేబుపై ప్రభావం.. మారుతున్న 7 ముఖ్యమైన నిబంధనలు ఇవే..!
-
US Citizenship Fee Hike: ఎన్నారైలకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న అమెరికా సిటిజన్షిప్ ఫీజులు?
ట్రెండింగ్
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!