Mizoram Electons: రేపు మిజోరం ఎలక్షన్స్.. 174 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 114 మంది కోటీశ్వరులే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు మిజోరంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ అధికారంలోని ఎంఎన్ఎఫ్, ప్రతిపక్షంలోని జెడ్పీఎం, కాంగ్రెస్ల మధ్య పోటీ ఉన్నది. అయితే, రెండు స్థానిక పార్టీల మధ్యే అసలైన పోటీ ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అక్కడ పోటీ చేసే 174 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 114 మంది (66 శాతం) కోటీశ్వరులేనని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిపోర్ట్ పేర్కొంది. 2018 ఎన్నికల్లో 209 మంది అభ్యర్థుల్లో 116 మంది (56 శాతం) కోటీశ్వరులు ఉన్నట్లు తెలిపింది.
PM MODI: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి ప్రధాని మోడీ ఫోన్.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై చర్చలు
Also Read
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
అధికార మిజో నేషనల్ ఫ్రంట్ నుండి 40 మంది అభ్యర్థులలో 36 (90%), కాంగ్రెస్ నుండి 40 మంది అభ్యర్థులలో 33 (83%), జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ నుండి 40 మంది అభ్యర్థులలో 29 (73%) ఉన్నారు. బిజెపి నుండి 23 మంది అభ్యర్థులలో 9 మంది (39%), ఆప్ నుండి 4 మంది అభ్యర్థులలో 1 (25%), 27 మంది స్వతంత్ర అభ్యర్థులలో 6 (22%) మంది రూ. 1 కోటి కంటే ఎక్కువ విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. బిజెపికి చెందిన జెబి రువల్చింగా, లాంగ్ట్లై వెస్ట్ రూ. 90 కోట్లకు పైగా ఆస్తులతో అత్యంత సంపన్న అభ్యర్థులుగా ఉన్నారు.
MLC Kavitha: బీసీ కుల గణన వివరాలు బయటపెట్టే దమ్ము కాంగ్రెస్- బీజేపీలకు ఉందా..?
55 కోట్లకు పైగా ఆస్తులతో సెర్చిప్ (షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడిన సీటు) నుండి కాంగ్రెస్కు చెందిన ఆర్ వన్లాల్ట్లుంగా పోటీ చేస్తున్నారు. అధికారంలో ఉన్న జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ నుండి చంపై నార్త్ (షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడిన స్థానం) నుండి పోటీ చేస్తున్న హెచ్ గింజలాలా ఆస్తులు రూ. 36 కోట్లకు పైగా ఉన్నాయి. ZPM నుండి తుయిచాంగ్ రూ. 35 కోట్లకు పైగా ఆస్తులతో ఉన్నారు. రిజర్వ్డ్ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. MNF పార్టీ నుంచి రాబర్ట్ రొమావియా రాయ్ట్, హచెక్ (రిజర్వ్ చేయబడిన స్థానం) నుండి పోటీ చేస్తున్నారు. వీరు రూ. 23 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. సెర్చిప్ స్థానం (ST) నుండి స్వతంత్ర అభ్యర్థి రామ్లున్-ఎడెనా అత్యంత పేదవాడిగా ఉన్నాడు. అతనికి రూ. 1,500 విలువైన చరాస్తులు మాత్రమే ఉన్నాయి.
Anasuya: ఆ కుర్ర హీరో లైన్ వేస్తున్నాడనుకొని.. రంగమత్త అవైడ్ చేసిందట
40 మంది అభ్యర్థుల్లో అధికార ఎంఎన్ఎఫ్కు 36 మంది కోటీశ్వరులు ఉన్నారని నివేదిక పేర్కొంది. కాంగ్రెస్లో 33 మంది కోటీశ్వరులు ఉండగా, జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్కు 29 మంది ఉన్నారని నివేదిక పేర్కొంది. అత్యంత సంపన్న అభ్యర్థుల జాబితాలో జేబీ రువల్చింగా అగ్రస్థానంలో ఉన్న బీజేపీకి తొమ్మిది మంది కోటీశ్వరులు ఉన్నారని సమాచారం.
తాజావార్తలు
-
Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
-
Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
-
Ponguleti Srinivas Reddy : హరీష్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
-
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!