Mulugu District: కానిస్టేబుల్ వివాహేతర సంబంధాన్ని బయటపెట్టిన యువకుడి దారుణ హత్య..
- వీడిన యువకుడి మిస్సింగ్ మిస్టరీ
- ఈ నెల 15వ తేదీన రాత్రి 7 గంటలకు మిస్సింగ్
- హనుమకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
- కేసును ఛేదించిన ఏసీపీ దేవేందర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువకుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన చిడేమ్ సాయి అనే యువకుడు ఈ నెల 15వ తేదీన రాత్రి 7 గంటలకు మిస్సింగ్ అయినట్లు 16న స్టేషన్లో కేసు నమోదైంది. అదృశ్యమైన ప్రాంతం హనుమకొండ పోలీస్ స్టేషన్లో సాయి కుటుంబ సభ్యులు 18వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సంచలన విషయం వెల్లడైంది. గతంలో వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ వివాహేతర బంధాన్ని సాయి బయటపెట్టినట్లు తేలింది. నేరం రుజువు కావడంతో కానిస్టేబుల్ను అధికారులు సస్పెండ్ చేశారు.
READ MORE: Off The Record: విజయ సాయిరెడ్డి వైసీపీ ముద్ర తొలగించుకోవాలనుకుంటున్నారా..?
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
దీంతో ఎలాగైనా సాయిని చంపేయాలని శ్రీనివాస్ పగతో రగిలిపోయాడు. కొన్ని నెలలుగా సాయిని చంపడానికి రెక్కీ నిర్వహించాడు. తన వల్ల కాకపోవడంతో సుపారీ గ్యాంగ్ తో సాయిని హత్య చేసేందుకు స్కెచ్ వేశాడు. అనుకున్నట్టుగానే సుపారీ గ్యాంగ్ చేతికి సాయి చిక్కాడు. హనుమకొండ నయీంనగర్ ప్రాంతంలో సాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. మారమధ్యంలో అతన్ని సుపారీ గ్యాంగ్ చంపేసింది. హుజూరాబాద్ మండల పరిధిలోని హుస్నాబాద్ ప్రాంతంలో ఓ బావిలో సాయి మృతదేహాన్ని పారేశారు. ఈ కేసులో పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు హత్యకు గురైన సాయి సెల్ ఫోనును ఆంధ్రప్రదేశ్కి వెళ్లే ట్రైన్లో పారేశాడు.
READ MORE: Shine Tom Chacko : షైన్ టామ్ చాకోకు భారీ ఊరట..
సాయి మొబైల్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో చూపించడంతో సతమతమైన పోలీసులు ఈ ఘటనను విచారించారు. విచారణలో భాగంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణ కొనసాగుతుండగా సాయి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై ఉదయం నుంచి రాత్రి వరకు హన్మకొండ సబ్ డివిజన్ ఏసీపీ దేవేందర్ రెడ్డి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టి కేసును ఛేదించారు. ప్రస్తుతం సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్కు తరలించారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..