Thummala Nageswara Rao: వరివేస్తే ఉరి అన్నది మీరు కాదా? కేసీఆర్ పై మంత్రి తుమ్మల ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరివేస్తే ఉరి అన్నది మీరు కాదా.. అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్, కేసీఆర్ ను ప్రశ్నించారు. సన్నాల సాగు చేయాలని తర్వాత రైతుల నడ్డి విరిచింది మీరు కాదా? అని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. “రైతుబంధును మధ్యమధ్యలో ఆపింది మీరు కాదా? పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ కూడా విడుదల చేయకుండా బకాయిలు పెడ్తే, ఇప్పుడు మేము వాటిని సరిచేస్తూ, సరఫరా చేయిస్తుంటే సన్నాయి నొక్కులు నొక్కుతున్నది మీరు కాదా? పంటల భీమా ఎత్తేసి గత ఐదు సంవత్సరాలలో రైతుల నోట్లో మట్టి కొట్టింది మీరు. రైతుబంధు పేరిట అన్ని పథకాలకు తిలోదకాలు ఇచ్చింది మీరు. బీఆర్ఎస్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు నిధులు విడుదల చేయకుండా, కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా చేసి, రైతుల ఉసురు పోసుకున్నది. 2014 రుణమాఫీ నాలుగు విడుతలుగా, 2015 రుణమాఫీ సగం చేసి చేతులు దులుపుకున్నది. మీ పథకాలు అంత బాగుంటే, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు మిమ్మల్ని ఎందుకు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు.” అని మంత్రి ఉద్ఘాటించారు.
READ MORE: Bandi Sanjay: కేసీఆర్ తో కొట్లాడింది బీజేపీ.. ప్రజలు మాత్రం కాంగ్రెస్ కు ఓటేశారు
Also Read
- MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
- Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
వడ్లలో 10-12 కేజీల తరుగుతీసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని మంత్రి తుమ్మల అన్నారు. ” రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కూడా పెరిగిన కరెంట్ వినియోగంకు తగ్గట్లు విద్యుత్తునుకొని పంటలను కాపాడింది మేము. ఎక్కువ పీ.పీ.సీ సెంటర్లను తెరిచి కొనుగోళ్లను ముందుగానే ఆరంభించింది మేము. రాష్ట్రమును ఆర్థికంగా దివాళాతీయించినా, రైతుబంధును పూర్తిస్థాయిలో అమలుపరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. మా ప్రభుత్వం పోయినసారి కంటే 4 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ సేకరించింది. పంటలభీమా పథకాన్ని తీసుకొస్తున్నాం. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు మొరగటం మానేసి వాళ్ళ స్థాయికి తగ్గట్టు ప్రవర్తిస్తే మంచిది. బీఆర్ఎస్ నాయకులు మొరుగుతున్నారు అంటే అవి రైతులకు వక్రీకరించడం వాళ్ళ నీత్గి మాలిన రాజకీయాలు కు నిదర్శనం. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు మాటలను వక్రీకరించి వాళ్ళ స్థాయిని దిగజార్చుకోకండి” అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
-
MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
-
Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
-
Hardik Pandya-Fan: ఒడిశా టు బెంగళూరు.. హార్దిక్ కోసం 1800 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అభిమాని!
-
CM Chandrababu: ‘మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు’.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..