Thummala Nageswara Rao: వరివేస్తే ఉరి అన్నది మీరు కాదా? కేసీఆర్ పై మంత్రి తుమ్మల ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరివేస్తే ఉరి అన్నది మీరు కాదా.. అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్, కేసీఆర్ ను ప్రశ్నించారు. సన్నాల సాగు చేయాలని తర్వాత రైతుల నడ్డి విరిచింది మీరు కాదా? అని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. “రైతుబంధును మధ్యమధ్యలో ఆపింది మీరు కాదా? పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ కూడా విడుదల చేయకుండా బకాయిలు పెడ్తే, ఇప్పుడు మేము వాటిని సరిచేస్తూ, సరఫరా చేయిస్తుంటే సన్నాయి నొక్కులు నొక్కుతున్నది మీరు కాదా? పంటల భీమా ఎత్తేసి గత ఐదు సంవత్సరాలలో రైతుల నోట్లో మట్టి కొట్టింది మీరు. రైతుబంధు పేరిట అన్ని పథకాలకు తిలోదకాలు ఇచ్చింది మీరు. బీఆర్ఎస్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు నిధులు విడుదల చేయకుండా, కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా చేసి, రైతుల ఉసురు పోసుకున్నది. 2014 రుణమాఫీ నాలుగు విడుతలుగా, 2015 రుణమాఫీ సగం చేసి చేతులు దులుపుకున్నది. మీ పథకాలు అంత బాగుంటే, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు మిమ్మల్ని ఎందుకు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు.” అని మంత్రి ఉద్ఘాటించారు.
READ MORE: Bandi Sanjay: కేసీఆర్ తో కొట్లాడింది బీజేపీ.. ప్రజలు మాత్రం కాంగ్రెస్ కు ఓటేశారు
Also Read
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
వడ్లలో 10-12 కేజీల తరుగుతీసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని మంత్రి తుమ్మల అన్నారు. ” రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కూడా పెరిగిన కరెంట్ వినియోగంకు తగ్గట్లు విద్యుత్తునుకొని పంటలను కాపాడింది మేము. ఎక్కువ పీ.పీ.సీ సెంటర్లను తెరిచి కొనుగోళ్లను ముందుగానే ఆరంభించింది మేము. రాష్ట్రమును ఆర్థికంగా దివాళాతీయించినా, రైతుబంధును పూర్తిస్థాయిలో అమలుపరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. మా ప్రభుత్వం పోయినసారి కంటే 4 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ సేకరించింది. పంటలభీమా పథకాన్ని తీసుకొస్తున్నాం. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు మొరగటం మానేసి వాళ్ళ స్థాయికి తగ్గట్టు ప్రవర్తిస్తే మంచిది. బీఆర్ఎస్ నాయకులు మొరుగుతున్నారు అంటే అవి రైతులకు వక్రీకరించడం వాళ్ళ నీత్గి మాలిన రాజకీయాలు కు నిదర్శనం. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు మాటలను వక్రీకరించి వాళ్ళ స్థాయిని దిగజార్చుకోకండి” అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
-
Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
-
Peddi : ‘పెద్ది’ బాలీవుడ్ పరిస్థితి ఏంటి.. ఓపెనింగ్ లేకుంటే చరణ్ పాన్ ఇండియా కెరీర్ కష్టమే?
-
BCCI Meeting: సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీపై కీలక నిర్ణయం?.. బీసీసీఐ సమావేశంలో హాట్ టాపిక్!
-
Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్షిప్పై షాకింగ్ ట్విస్ట్..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..