SLBC Incident: క్షేమంగా తిరిగి తీసుకురావడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాం..
- రెస్క్యూ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారు- ఉత్తమ్
- టన్నెల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకురావడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాం
- దేశంలో అత్యంత నిపుణులైన 10 ఏజెన్సీలు ఈ రెస్క్యూలో పనిచేస్తున్నాయి
- ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు- ఉత్తమ్
- ప్రమాదం జరిగిన వెంటనే వేగంగా స్పందించాం- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం చోటు చేసుకుని మూడు రోజులు గడుస్తుంది. టన్నెల్లో గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీపై ఇంకా క్లారిటీ లేదు. రెస్క్యూ టీమ్స్ పలుమార్లు టన్నెల్లోకి వెళ్లి ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తిరిగి వచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రెస్క్యూ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా తిరిగి తీసుకురావడానికి సర్వ శక్తులా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో అత్యంత నిపుణులైన 10 ఏజెన్సీలు ఈ రెస్క్యూలో పనిచేస్తున్నాయి.. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, జియాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ అన్నీ కలిసి పనిచేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
Read Also: Belly Fat: బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే ఈ ‘టీ’లు తాగాల్సిందే!
Also Read
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
- YS Jagan: అందుకే "మావిగన్" ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
- Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
- Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.. ప్రమాదం జరిగిన వెంటనే వేగంగా స్పందించామని మంత్రి పేర్కొ్న్నారు. ఇలాంటి ప్రమాదాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ చేసే అనుభవం ఉన్న వాళ్ళను కూడా ఆహ్వానిస్తున్నాం.. మేము ఇంత చేస్తుంటే.. కొందరు చిల్లర రాజకీయం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. కాళేశ్వరంలో ఏడుగురు చనిపోతే మేము మాట్లాడలేదు.. శ్రీశైలం పవర్ ప్లాంట్ లో కూడా ఎనిమిది మంది చనిపోతే కూడా ఏనాడు మాట్లాడలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన ప్రమాదం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
Read Also: MLC Elections 2025: మేం మూడు స్థానాల్లో గెలుస్తున్నాం: కిషన్ రెడ్డి
దేశంలోనే గొప్ప ప్రాజెక్టు ఇది.. 45 కి.మీలలో 30 కి.మీ పూర్తి అయ్యిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు మినిమం సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాయి.. ప్రాజెక్ట్ పూర్తి ఐతే నల్గొండ జిల్లాలో లక్షల ఎకరాలకు నీరు అందుతుంది.. ఫ్లోరైడ్ బాధ తొలుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు ప్రాజెక్ట్ పనులు నిలిపివేశారని మంత్రి ఆరోపించారు. మరోవైపు.. టన్నెల్లో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడటానికి సర్వ శక్తులా కృషి చేస్తున్నాం.. ప్రమాదం జరిగిన స్థలంలో నీరు లీక్ అవుతోంది.. నీటి ఉధృతి కూడా పెరిగిందని రెస్క్యూ టీమ్స్ చెప్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
-
Nepal VS India Explained: భారత్-నేపాల్ మధ్య మళ్లీ మంటలు.. ఈ రాజకీయ భూకంపానికి కారణం ఏంటి?
-
YS Jagan: అందుకే “మావిగన్” ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
-
Buchi Babu: ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ పెద్ది కాదు: బుచ్చిబాబు
-
Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!