Sridhar Babu: ప్రజలకు క్వాలిటేటివ్ లైఫ్ అందించాలని ప్రభుత్వ ఉద్దేశ్యం..
- విదేశీ పర్యటనలో రూ.లక్షా 79 వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం- శ్రీధర్ బాబు
- వాణిజ్యం, వ్యాపారాలకు అనువైన ప్రాంతంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం
- ప్రజలకు ఉపయోగపడేలా విధానాల్లో మార్పులు తీసుకొచ్చాం- శ్రీధర్ బాబు
- తెలంగాణ, హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ ఉంది- శ్రీధర్ బాబు
- పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమం పెట్టుకున్నాం- శ్రీధర్ బాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దావోస్లో తెలంగాణకు పెట్టుబడుల వివరాలను సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రభుత్వ విధానాలపై ఒక నమ్మకం.. ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై నమ్మకంతో వ్యాపారులు ముందుకు వచ్చారని శ్రీధర్ బాబు తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం, దూరదృష్టి కలిగిన ప్రభుత్వం కావాలని వ్యాపార సంస్థలు కోరుకుంటాయి.. గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంపై 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఒక మెరుగైన వాణిజ్యం, వ్యాపారం స్టేట్గా ఎదగాలని ముఖ్యమంత్రి ఆలోచన అని మంత్రి పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు.. అంటే 1లక్షా 79 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం చేసుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
Read Also: Sam Pitroda: ‘‘అక్రమ బంగ్లాదేశీయుల్ని భారత్లోకి రానివ్వండి’’.. రాహుల్ గాంధీ సన్నిహితుడి వ్యాఖ్యలు..
Also Read
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
పాలసీ విధానాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్పులు తీసుకు వచ్చాం.. తెలంగాణకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఉందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. ఎవరెన్ని విమర్శలు చేసినా వాటిని సద్విమర్శలుగా తీసుకున్నామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమం పెట్టుకున్నాం.. సింగపూర్కు చెందిన ఇద్దరు మంత్రులను కలిశాం.. మూసీ ప్రక్షాళన, నిరుద్యోగుల నైపుణ్యం పెంచే అంశాల పై ముఖ్యమంత్రి సింగపూర్ మంత్రులతో చర్చించారని అన్నారు. సింగపూర్ మంత్రులు కూడా తమ సహకారం అందిస్తామన్నారని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సింగపూర్ రివర్ చిన్నదే కానీ… నదిని ప్రక్షాళన చేస్తే అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారని తెలిసిందని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Tata Nexon CNG Dark Edition: టాటా కొత్త సీఎన్జీ కారు విడుదల.. రేటు, రేంజ్ ఎంతంటే?
ప్రజలకు క్వాలిటేటివ్ లైఫ్ అందించాలని ప్రభుత్వ ఉద్దేశ్యం అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నిరుద్యోగుల్లో నైపుణ్యం పెంపొందించాలని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసామని అన్నారు. నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించి ఐటీఈఎస్ వారితో ఎంవోయూ చేసుకున్నామని తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచి యంగ్ ఇండియా యూనివర్సిటీ టీచర్లకు కరికులం విషయంలో ట్రైనింగ్ ఇస్తారని పేర్కొన్నారు. మరోవైపు.. స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ అంశాలు చర్చించామని చెప్పారు. తమకు సింగపూర్ సంస్థలతో చేసిన చర్చలు గొప్ప సంతృప్తి కలిగిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
-
DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
-
Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
-
Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
-
Harry Brook: వరల్డ్ నంబర్వన్ భారత్పై రెండు సిరీస్లు గెలిచా.. నేను ఫుల్ హ్యాపీ.. మా విజయ రహస్యం అదే!
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!