Minister Seediri Appalaraju: విశాఖ రాజధానే మా ఆకాంక్ష.. మళ్లీ జగన్ వస్తేనే అది సాధ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seediri Appalaraju: విశాఖ రాజధానిగా కావాలన్నదే మా ఆకాంక్ష.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నారు.. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ వస్తేనే విశాఖను రాజధానిగా చేసుకోగలం అన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రథసప్తమి రోజు అరసవల్లి వచ్చి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం మాకు అలవాటుగా పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలోనీ దుష్టచతుష్టయాన్ని ఎదుర్కొనే శక్తిని జగన్మోహన్ రెడ్డికి సూర్య భగవానుడు ప్రసాదించాలని తద్వారా ప్రజలకీ మంచి జరగాలని కోరుకున్నానని తెలిపారు. సూర్యనారాయణ స్వామి ప్రజలందరి జీవితాలలో వెలుగును తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు.
మరోవైపు.. నారా లోకేష్ కి అవగాహన లేదు అని ఫైర్ అయ్యారు అప్పలరాజు.. మా పలాస వచ్చి కోటి డబ్బే లక్షల టీచర్ పోస్టులు తామే వేశామన్నారు.. కానీ, అంతమంది విద్యార్థులే లేరు… అతని మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి అంటూ సెటైర్లు వేశారు. కుటుంబాన్ని, సచివాలయాన్ని, జిల్లాను,రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకొని అభివృద్ధి, సంక్షేమం చేస్తున్న నాయకుడు వైఎస్ జగన్ అని ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ను.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ దూషించడం.. దురదృష్టకరo అన్నారు. మీకు మంచి జరిగింది అనిపిస్తే జగన్ ని గెలిపించండని ప్రజలకు కోరుతున్నాను అంటూ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు అని చెబుతున్న లోకేష్.. మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబుని ఆ ప్రశ్న అడగాలి అని సూచించారు. ఇక, సీఎం జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నారు.. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ వస్తేనే విశాఖను రాజధానిగా చేసుకోగలం.. యువత అది గ్రహించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఇక, హైదరాబాద్ రాజధానిపై వైవీ సుబ్బా రెడ్డి చేసిన వ్యాఖ్యలలో ఎలాంటి కాంట్రవర్సీ లేదన్నారు అప్పలరాజు.. విశాఖ రాజధానిగా కావాలన్నదే మా ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఉద్దానంపై అవగాహన లేని మనిషి గౌతు శిరీష అని ఫైర్ అయ్యారు.. అక్కడ పిల్లలకి ఏం కావాలో ఆమెకు అవగాహన ఉందా? అని నిలదీశారు. నల్లబొడ్లకొండను గ్రౌండ్ కోసం, లే అవుట్ సైట్ కోసం ఇటీవల రీసర్వ్ చేయటం జరిగిందని వివరించారు.. గౌతు శిరీష నాన్నగారు అనేకసార్లు ఎమ్మెల్యేగా చేసి విపరీతమైన ఆస్తులు కూడ పెట్టారు అని ఆరోపించారు మంత్రి సీదిరి అప్పలరాజు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!