RK Roja: బాలకృష్ణకు సినిమాల్లో మాత్రమేనా.. అసెంబ్లీలో చేతకాదా?
RK Roja: టీడీపీ నేతలు సభకు చర్చకోసం కాదు.. రచ్చ కోసం వచ్చారని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. టీడీపీ నేత బాలకృష్ణపై విమర్శనాస్త్రాలు సంధించారు. మీ బావ తుప్పు కాదు.. నిప్పు అని ఒప్పుకోవడానికి మనసు రావడం లేదా అంటూ ఎద్దేవా చేశారు. బాలకృష్ణకు చంద్రబాబు సీటు మీద మనసు లాగినట్లుంది.. అందుకే చంద్రబాబు కుర్చీ ఎక్కి విజిల్స్ వేసి పిచ్చి పిచ్చి వేషాలేశాడని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. బాలకృష్ణ అసెంబ్లీలో తొడగొట్టడం కాదు.. మీకు చేతనైతే హైకోర్టుకు పోయి జడ్జి ముందు తొడకొట్టండి అంటూ రోజా అన్నారు. యువతను చంద్రబాబు మోసం చేశాడని ప్రజలు, యువత గమనించారన్నారు. ప్రజల డబ్బు దోచుకున్న చంద్రబాబు జైలుకి పోతే…జగనన్న ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. గజదొంగ చంద్రబాబు సాష్టాంగపడి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇక్కడ దోచుకుని పక్కరాష్ట్రంలో ప్యాలెస్లు కట్టిన చంద్రబాబు ఏపీ ప్రజల కాళ్లు మొక్కి క్షమాపణ కోరాలని ఆమె అన్నారు.
Also Read: Minister Chelluboina Venu: ఈరోజు సభలో ప్రతిపక్షం తీరు సభా చరిత్రలో దుర్దినం
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
టీడీపీ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చి ఎందుకు పారిపోయారని.. చంద్రబాబు స్కామ్ చేశాడని, దోచుకున్నాడని టీడీపీ నేతలకు కూడా తెలుసని ఆమె పేర్కొన్నారు. టీడీపీ నేతలకు కూడా స్కిల్ స్కామ్లో వాటా ఉందా.. బాలకృష్ణ ఎందుకు మాట్లాడటం లేదని రోజా ప్రశ్నించారు. బాలకృష్ణకు సినిమాల్లో మాత్రమే డైలాగ్ చెప్పడం వచ్చా.. అసెంబ్లీలో మాట్లాడటం చేతకాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ముందుండి పార్టీని నడిపిస్తానని చెప్పిన బాలయ్య ఎందుకు పారిపోయాడంటూ ప్రశ్నించారు. మా దగ్గర ఆధారాలు లేవని చెబుతున్న మీరు ఎందుకు చర్చ నుంచి పారిపోయారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఈ స్కామ్కు పథకం వేశాడని ఆమె ఆరోపించారు. జీవోలో లేనప్పుడు ఒప్పందాలపై ఎలా సంతకాలు చేశారని మంత్రి రోజా అడిగారు.
Also Read: Chandrababu: సీఐడీ కస్టడీకి చంద్రబాబు
బాలకృష్ణ, టీడీపీ నేతలకు ఇదే నా ఛాలెంజ్ అంటూ మంత్రి రోజా సవాల్ విసిరారు. సోమవారం వస్తారో… మంగళవారం వస్తారో..బుధవారం వస్తారో మీ ఇష్టమని, స్కిల్ స్కామ్ మొదలు చంద్రబాబు అన్ని స్కాముల పైనా చర్చిద్దామంటూ మంత్రి రోజా ఛాలెంజ్ విసిరారు. బాలకృష్ణ సినిమాల్లో రాసిచ్చిన డైలాగులు చెప్పడం కాదు.. అసెంబ్లీకి వచ్చి మా బావ తప్పు చేయలేదు..ఈడీ ఎంక్వైరీ వేయండి అని అడగాలన్నారు. ఢిల్లీకి వెళ్లి బహిరంగ చర్చకు రమ్మని లోకేష్ సవాల్ విసురుతున్నాడని.. లోకేష్ నీకెలాగూ సభకు వచ్చే సీన్ లేదని ఆమె వ్యాఖ్యానించారు. బాలకృష్ణను సభకు పంపించు.. తాము చర్చకు సిద్ధమని లోకేష్కు సవాల్ విసిరారు. టీడీపీ నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైందన్నారు మంత్రి రోజా. వ్యవస్థలను దోచుకున్న చంద్రబాబు ఎన్నికల ముందు ఇలా దొరికిపోయానేంటో అనే భయంలో ఉన్నారని ఆమె వెల్లడించారు. టీడీపీ నేతలు ప్రజల సమస్యలను తీర్చే బదులు ప్రజలకు సమస్యగా మారారని ఆమె విమర్శించారు. టీడీపీ పాపాలు పండాయని.. ఇకపై మా నాయకుడి గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ మాట్లాడితే సహించేది లేదని మంత్రి రోజా తెలిపారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!