టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురంధేశ్వరిపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నెక్ట్స్ కేసుపై చెప్పకండి అని చెప్పారు. స్కామ్ ల ద్వారా స్కీమ్స్ లను వాడుకున్న ఘనత చంద్రబాబుది.. రెయిన్ గన్ లతో ఎక్కడైనా కరువు జయించగలమా..రెయిన్ గన్ తో వేలాది ఎకరాలు పండించగలమా.. రెయిన్ గన్ విషయంలో కూడా చంద్రబాబుపై కేసులు పడతాయి.. జైలుకు పోతాడు అని ఆమె పేర్కొన్నారు. రైతు ద్రోహి చంద్రబాబు.. కోట్లాది రూపాయిలు జగన్ ప్రజలకు ఇస్తున్నాడు అని మంత్రి రోజా తెలిపారు.
Read Also: TDP: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీరుని కలిసిన లోకేష్ నేతృత్వంలోని టీడీపీ బృందం..
సీఎం జగన్ కేసులపై కక్ష సాధింపులో భాగంగా సుప్రీంకోర్టుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి లేఖ రాశారు అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. పురంధేశ్వరి అమె పని అమె చూసుకుంటే చాలు.. జగన్ కేసుల గురించి లేఖలు రాయల్సిన అవసరం లేదు అని మంత్రి చెప్పారు. జగన్ తన కేసులను విచారించాలని పిటీషన్ పెట్టుకున్న దమ్మున్న నాయకుడు జగన్.. పురంధేశ్వరికి ఒక నియోజకవర్గం లేదు.. ఆమెను చూసి ఓటు వేసే వాళ్ళు ఎవరు అంటూ మంత్రి రోజా సెటైర్ వేసింది.
ఎన్టీఆర్ బతికున్నప్పుడు ఒక రోజు అయినా అన్నం పెట్టి.. నీళ్ళు ఇచ్చావా పురంధేశ్వరి అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు. పురందరేశ్వరి ఒక జగత్ కిలాడీ.. బావ కళ్లులో ఆనందం కోసం లేఖలు రాస్తోంది.. పురంధేశ్వరి లాంటి నీతి మాలినా, జగత్ కిలాడి లాంటి కూతురు ఎవరికి పుట్టకూడదని కోరుకుంటున్నాను.. పురంధేశ్వరి లాంటి కూతురు పుట్టిందని ఎన్టీఆర్ కుమిలి కుమిలి ఎడుస్తుంటారు అంటూ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేసింది.