Ponnam Prabhakar: కులగణన రీ సర్వేకు తక్కువ స్పందన వచ్చింది..
- రెండో విడత కుల గణన తక్కువ స్పందన వచ్చింది- పొన్నం ప్రభాకర్
- సర్వే రిజెక్ట్ చేసిన వాళ్ళ కోసం అవకాశం ఇచ్చాం- పొన్నం
- బీజేపీకి కుల గణన మీద మాట్లాడే హక్కే లేదు- మంత్రి పొన్నం
- కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ జనాభా లెక్కలో లేనట్టే- పొన్నం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో 13 రోజుల పాటు కులగణన రీ సర్వే జరిగింది. ఈ సర్వేలో కూడా ఆశించిన సంఖ్యలో కుటుంబాలు తమ వివరాలు నమోదు చేసుకోలేదు. మొదటిసారి నిర్వహించిన కుల గణన సర్వేలో 3.56 లక్షల కుటుంబాలు వివరాలు నమోదుచేసుకోకుండా మిగిలిపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రీ సర్వే చేపట్టింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రెండో విడత కుల గణనకు తక్కువ స్పందన వచ్చిందని తెలిపారు. ఇది మమ్మల్ని తక్కువ చేసి చూపారు అనే వాళ్లకు సమాధానమని పేర్కొన్నారు. సర్వే రిజెక్ట్ చేసిన వాళ్ళ కోసం అవకాశం ఇచ్చామని మంత్రి చెప్పారు. బీసీ మేధావులు, సంఘాలు కోరిక మేరకు మళ్ళీ అవకాశం ఇచ్చామన్నారు. బీజేపీకి కుల గణన మీద మాట్లాడే హక్కే లేదు.. సుప్రీం కోర్టులో బీసీ కుల గణనకు వ్యతిరేకం అని అఫిడవిట్ ఇచ్చింది బీజేపీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
Read Also: Hit and Run Case: నార్సింగి పీఎస్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు..
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
మరోవైపు.. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లకు పోస్టులో దరఖాస్తు ఫారం పంపినా దరఖాస్తు చేసుకోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వాళ్ళు జనాభా లెక్కల్లో లేనట్టే.. సర్వేలో పాల్గొనని వాళ్లకు మాట్లాడే హక్కు లేదని దుయ్యబట్టారు. సాయంత్రం వరకు సర్వే పూర్తి వివరాలు వస్తాయన్నారు. కొందరు అధికారులు ఇండ్లలోకి రానివ్వలేదు.. వారిపై కుక్కలు కూడా వదిలారు.. వీడియోలు బయట పెడతామని పేర్కొన్నారు. బీజేపీ పొత్తున్న ఏపీలో కూడా మైనార్టీ రిజర్వేషన్ అమలులో ఉంది.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. త్వరలోనే 42 శాతం రిజర్వేషన్ చట్టం.. కేంద్రంలో బాధ్యత తీసుకుని బీజేపీ నేతలు సహకరించాలని తెలిపారు. 18 జిల్లాలో వంద శాతం సర్వే పూర్తి అయిందని.. సర్వేని తప్పు పట్టిన వాళ్ళు కూడా సర్వేలో పాల్గొనలేదని చెప్పారు. నమోదు చేసుకొని వారు జనాభా లెక్కల్లో లేరు.. వాళ్లకు అడిగే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Read Also: Home Minister Anitha: రెడ్బుక్ ప్రకారం మేము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్డుపై తిరగలేరు..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!