Ponnam Prabhakar: కులగణన రీ సర్వేకు తక్కువ స్పందన వచ్చింది..
- రెండో విడత కుల గణన తక్కువ స్పందన వచ్చింది- పొన్నం ప్రభాకర్
- సర్వే రిజెక్ట్ చేసిన వాళ్ళ కోసం అవకాశం ఇచ్చాం- పొన్నం
- బీజేపీకి కుల గణన మీద మాట్లాడే హక్కే లేదు- మంత్రి పొన్నం
- కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ జనాభా లెక్కలో లేనట్టే- పొన్నం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో 13 రోజుల పాటు కులగణన రీ సర్వే జరిగింది. ఈ సర్వేలో కూడా ఆశించిన సంఖ్యలో కుటుంబాలు తమ వివరాలు నమోదు చేసుకోలేదు. మొదటిసారి నిర్వహించిన కుల గణన సర్వేలో 3.56 లక్షల కుటుంబాలు వివరాలు నమోదుచేసుకోకుండా మిగిలిపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రీ సర్వే చేపట్టింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రెండో విడత కుల గణనకు తక్కువ స్పందన వచ్చిందని తెలిపారు. ఇది మమ్మల్ని తక్కువ చేసి చూపారు అనే వాళ్లకు సమాధానమని పేర్కొన్నారు. సర్వే రిజెక్ట్ చేసిన వాళ్ళ కోసం అవకాశం ఇచ్చామని మంత్రి చెప్పారు. బీసీ మేధావులు, సంఘాలు కోరిక మేరకు మళ్ళీ అవకాశం ఇచ్చామన్నారు. బీజేపీకి కుల గణన మీద మాట్లాడే హక్కే లేదు.. సుప్రీం కోర్టులో బీసీ కుల గణనకు వ్యతిరేకం అని అఫిడవిట్ ఇచ్చింది బీజేపీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
Read Also: Hit and Run Case: నార్సింగి పీఎస్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు..
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
మరోవైపు.. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లకు పోస్టులో దరఖాస్తు ఫారం పంపినా దరఖాస్తు చేసుకోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వాళ్ళు జనాభా లెక్కల్లో లేనట్టే.. సర్వేలో పాల్గొనని వాళ్లకు మాట్లాడే హక్కు లేదని దుయ్యబట్టారు. సాయంత్రం వరకు సర్వే పూర్తి వివరాలు వస్తాయన్నారు. కొందరు అధికారులు ఇండ్లలోకి రానివ్వలేదు.. వారిపై కుక్కలు కూడా వదిలారు.. వీడియోలు బయట పెడతామని పేర్కొన్నారు. బీజేపీ పొత్తున్న ఏపీలో కూడా మైనార్టీ రిజర్వేషన్ అమలులో ఉంది.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. త్వరలోనే 42 శాతం రిజర్వేషన్ చట్టం.. కేంద్రంలో బాధ్యత తీసుకుని బీజేపీ నేతలు సహకరించాలని తెలిపారు. 18 జిల్లాలో వంద శాతం సర్వే పూర్తి అయిందని.. సర్వేని తప్పు పట్టిన వాళ్ళు కూడా సర్వేలో పాల్గొనలేదని చెప్పారు. నమోదు చేసుకొని వారు జనాభా లెక్కల్లో లేరు.. వాళ్లకు అడిగే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Read Also: Home Minister Anitha: రెడ్బుక్ ప్రకారం మేము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్డుపై తిరగలేరు..
తాజావార్తలు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!