Ponguleti Srinivasa Reddy: కాపలా కుక్కలు.. వేట కుక్కలుగా మారి భూ దోపిడి చేశాయి
- గత ప్రభుత్వ పెద్దలు వేటకుక్కలుగా మారి అందినకాడికి దోచుకున్నారు- మంత్రి పొంగులేటి
- కాపలా కుక్కలు వేట కుక్కలుగా మారి రాష్ట్రంలో భూదోపిడీ చేశాయి- పొంగులేటి
- ఈ దోపిడి పై ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తాం- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- అందరికీ మేలు చేసే విధంగా భూ భారతి చట్టం- మంత్రి పొంగులేటి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్న గత ప్రభుత్వ పెద్దలు వేటకుక్కలుగా మారి అందినకాడికి దోచుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాపలా కుక్కలు వేట కుక్కలుగా మారి రాష్ట్రంలో భూదోపిడీ చేశాయని.. ఈ దోపిడి పై ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తామని తెలిపారు. “సమాజంలో అట్టడుగు వర్గాలు మొదలుకొని భూ యజమానులకు మేలు చేసే విధంగా విస్తృత స్ధాయిలో ప్రజాభిప్రాయ సేకరణతో రూపొందించిన 2024 భూ భారతి చట్టం అక్షరాలా భూ యజమానులకు చుట్టం.” అని మంత్రి అన్నారు. ఇటు రాష్ట్రంలో.. అటు దేశంలో 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకువచ్చిన రెవెన్యూ చట్టాలు, సంస్కరణలు రైతాంగానికే కాకుండా యావత్తు ప్రజానీకానికి ఎంతో మేలు చేశాయని చెప్పడానికి గర్వపడుతున్నానని మంత్రి పొంగులేటి తెలిపారు.
Read Also: Violence against Hindus: పాకిస్తాన్లో కన్నా బంగ్లాదేశ్లోనే హిందువులపై ఎక్కువ దాడులు..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
దేశ రైతు చరిత్రను సరికొత్త సంస్కరణలతో లిఖించిన ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలి. అదృష్టవశాత్తూ ఈ సంస్కరణల త్రయం తెలంగాణ బిడ్డలే కావడం మరో విశేషం. భూకమతాల పరిమితి చట్టం తెచ్చిన నాటి ముఖ్యమంత్రి, తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు, కౌలు రైతులకు మేలు చేసే విధంగా రక్షిత కౌలుదారి చట్టం తీసుకువచ్చిన నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు.. అదేవిధంగా జాగీర్ల రద్దులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి తమకు దిశానిర్దేశకులు అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఇప్పుడు వారి అడుగుజాడల్లో ప్రజోపయోగమైన ఈ నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. మన రాష్ట్రానికి సంబంధించి ఒక్కసారి గత చరిత్రను పరిశీలిస్తే భూమి కోసం, భుక్తి కోసం.. వేలాది పీడిత రైతులు, కూలీలు పాల్గొన్న తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం అని అన్నారు.
Read Also: CM Chandrababu Warning: భూకబ్జాలపై సీఎం సీరియస్.. తాట తీస్తా..!
రెండు పిల్లుల రొట్టెకథ ఈ ధరణి:
మనం చిన్నప్పుడు చదువుకున్న రెండు పిల్లులు రొట్టె కథలాగే ఈ ధరణి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రొట్టె పంచుకోవడం కోసం ఆ రెండు పిల్లులు గొడవ పడడం.. ఓ కోతి వచ్చి ఆ గొడవ తీరుస్తానని చెప్పడం, ఆ రొట్టెను 2 ముక్కలు చేస్తూ ఒకటి ఎక్కువైందని ఒకసారి, రెండవ ముక్క ఎక్కువైందని మరోసారి రొట్టెను పూర్తిగా కోతి తినేయడం మనకు తెలిసిన కథ. ఆ కోతిలాగే గత ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు ప్రవర్తించి భూములను దోచుకున్నారని తెలిపారు. ధరణిలో తన భూమి తాను చూసుకొనే వీల్లేదు.. ఆనాడు అంతా రహస్యమే. ఇందిరమ్మ ప్రభుత్వంలో దొరలు, సామాన్యులకు ఒకటే విధానం. భూ భారతిలో అంతా పారదర్శకమేనని మంత్రి పొంగులేటి అన్నారు. తప్పు ఒకరిది.. శిక్ష మరొకరిది అన్నట్లుగా అనాలోచితంగా రాత్రికి రాత్రే గడీల మధ్య చట్టం చేసి తప్పుచేసింది ఆ దొరవారుజ. కానీ శిక్ష అనుభవిస్తుంది మాత్రం అమాయక పేద రైతులు అని మంత్రి తెలిపారు. ఈ రాష్ట్రంలో ఏ మండలానికి వెళ్లినా.. ఏ గ్రామానికి వెళ్లినా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా మనిషి అనే వాడు ఉన్న ప్రతిచోట ధరణి తెచ్చిన సమస్యలున్నాయని అన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!