Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Minister Ponguleti Srinivas Reddy Made Key Comments On The Dharani Portal

Ponguleti Srinivasa Reddy: కాపలా కుక్కలు.. వేట కుక్కలుగా మారి భూ దోపిడి చేశాయి

Published Date :December 20, 2024 , 6:44 pm
By Rajesh Veeramalla
  • గ‌త ప్రభుత్వ పెద్దలు వేట‌కుక్కలుగా మారి అందిన‌కాడికి దోచుకున్నారు- మంత్రి పొంగులేటి
  • కాప‌లా కుక్కలు వేట కుక్కలుగా మారి రాష్ట్రంలో భూదోపిడీ చేశాయి- పొంగులేటి
  • ఈ దోపిడి పై ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తాం- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • అందరికీ మేలు చేసే విధంగా భూ భారతి చట్టం- మంత్రి పొంగులేటి.
Ponguleti Srinivasa Reddy: కాపలా కుక్కలు.. వేట కుక్కలుగా మారి భూ దోపిడి చేశాయి
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు రాష్ట్రానికి కాప‌లా కుక్కలా ఉంటాన‌న్న గ‌త ప్రభుత్వ పెద్దలు వేట‌కుక్కలుగా మారి అందిన‌కాడికి దోచుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాప‌లా కుక్కలు వేట కుక్కలుగా మారి రాష్ట్రంలో భూదోపిడీ చేశాయని.. ఈ దోపిడి పై ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తామని తెలిపారు. “స‌మాజంలో అట్టడుగు వ‌ర్గాలు మొద‌లుకొని భూ య‌జమానుల‌కు మేలు చేసే విధంగా విస్తృత స్ధాయిలో ప్రజాభిప్రాయ సేక‌ర‌ణ‌తో రూపొందించిన 2024 భూ భార‌తి చ‌ట్టం అక్షరాలా భూ య‌జ‌మానుల‌కు చుట్టం.” అని మంత్రి అన్నారు. ఇటు రాష్ట్రంలో.. అటు దేశంలో 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకువ‌చ్చిన రెవెన్యూ చ‌ట్టాలు, సంస్కర‌ణ‌లు రైతాంగానికే కాకుండా యావ‌త్తు ప్రజానీకానికి ఎంతో మేలు చేశాయ‌ని చెప్పడానికి గ‌ర్వప‌డుతున్నానని మంత్రి పొంగులేటి తెలిపారు.

Read Also: Violence against Hindus: పాకిస్తాన్‌లో కన్నా బంగ్లాదేశ్‌లోనే హిందువులపై ఎక్కువ దాడులు..

దేశ రైతు చ‌రిత్రను స‌రికొత్త సంస్కర‌ణ‌ల‌తో లిఖించిన ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలి. అదృష్టవ‌శాత్తూ ఈ సంస్కర‌ణ‌ల త్రయం తెలంగాణ బిడ్డలే కావ‌డం మ‌రో విశేషం. భూక‌మ‌తాల ప‌రిమితి చ‌ట్టం తెచ్చిన నాటి ముఖ్యమంత్రి, తెలుగు ప్రధాని పీవీ న‌ర‌సింహారావు, కౌలు రైతుల‌కు మేలు చేసే విధంగా ర‌క్షిత కౌలుదారి చ‌ట్టం తీసుకువ‌చ్చిన నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామ‌కృష్ణారావు.. అదేవిధంగా జాగీర్ల ర‌ద్దులో కీలకంగా వ్యవ‌హ‌రించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంక‌ట రంగారెడ్డి తమకు దిశానిర్దేశ‌కులు అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఇప్పుడు వారి అడుగుజాడ‌ల్లో ప్రజోప‌యోగ‌మైన ఈ నూత‌న రెవెన్యూ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చామని తెలిపారు. మ‌న రాష్ట్రానికి సంబంధించి ఒక్కసారి గత చరిత్రను పరిశీలిస్తే భూమి కోసం, భుక్తి కోసం.. వేలాది పీడిత రైతులు, కూలీలు పాల్గొన్న తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం అని అన్నారు.

Read Also: CM Chandrababu Warning: భూకబ్జాలపై సీఎం సీరియస్‌.. తాట తీస్తా..!

రెండు పిల్లుల రొట్టెక‌థ ఈ ధ‌ర‌ణి:
మ‌నం చిన్నప్పుడు చ‌దువుకున్న రెండు పిల్లులు రొట్టె క‌థలాగే ఈ ధ‌ర‌ణి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రొట్టె పంచుకోవ‌డం కోసం ఆ రెండు పిల్లులు గొడ‌వ ప‌డ‌డం.. ఓ కోతి వచ్చి ఆ గొడ‌వ తీరుస్తాన‌ని చెప్పడం, ఆ రొట్టెను 2 ముక్కలు చేస్తూ ఒక‌టి ఎక్కువైందని ఒక‌సారి, రెండ‌వ ముక్క ఎక్కువైంద‌ని మ‌రోసారి రొట్టెను పూర్తిగా కోతి తినేయ‌డం మ‌న‌కు తెలిసిన క‌థ. ఆ కోతిలాగే గ‌త ప్రభుత్వంలో కొంత‌మంది పెద్దలు ప్రవ‌ర్తించి భూముల‌ను దోచుకున్నారని తెలిపారు. ధ‌ర‌ణిలో తన భూమి తాను చూసుకొనే వీల్లేదు.. ఆనాడు అంతా ర‌హ‌స్యమే. ఇందిర‌మ్మ ప్రభుత్వంలో దొర‌లు, సామాన్యుల‌కు ఒక‌టే విధానం. భూ భారతిలో అంతా పార‌ద‌ర్శక‌మేనని మంత్రి పొంగులేటి అన్నారు. త‌ప్పు ఒక‌రిది.. శిక్ష మ‌రొక‌రిది అన్నట్లుగా అనాలోచితంగా రాత్రికి రాత్రే గ‌డీల‌ మ‌ధ్య చ‌ట్టం చేసి త‌ప్పుచేసింది ఆ దొర‌వారుజ. కానీ శిక్ష అనుభ‌విస్తుంది మాత్రం అమాయ‌క పేద‌ రైతులు అని మంత్రి తెలిపారు. ఈ రాష్ట్రంలో ఏ మండ‌లానికి వెళ్లినా.. ఏ గ్రామానికి వెళ్లినా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా మ‌నిషి అనే వాడు ఉన్న ప్రతిచోట ధ‌ర‌ణి తెచ్చిన స‌మ‌స్యలున్నాయని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • Dharani Portal
  • key comments
  • Minister Ponguleti Srinivas Reddy
  • telugu news

తాజావార్తలు

  • India-Iran History: ఒకే దేవతలను పూజించిన విశ్వాసాలు..4000ఏళ్ల ఇండియా-ఇరాన్‌ చరిత్ర..!

  • UBS : పవన్‌కు పోలీస్ క్యారెక్టర్ సెంటిమెంట్ వర్కవుటవుతుందా?

  • Bollywood : పదేళ్లుగా బ్లాక్ బస్టర్ చూడని యంగ్ హీరో.. పిలిచి అవకాశాలిస్తున్న బడా సంస్థ

  • Renault Duster 2026: రెనాల్ట్ డస్టర్ లాంచింగ్ ఈ రోజే.. ఫీచర్లు, డెలివరీ వివరాలు ఇవే..

  • Harish Rao: హ్యామ్ రోడ్ల పేరిట భారీ కుంభకోణం.. ఆనాడు వద్దన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మాత్రం!

ట్రెండింగ్‌

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions