Violence against Hindus: పాకిస్తాన్లో కన్నా బంగ్లాదేశ్లోనే హిందువులపై ఎక్కువ దాడులు..
- బంగ్లాదేశ్, పాకిస్తాన్లో హిందువులపై దాడులపై రిపోర్ట్..
- రాజ్యసభలో వ్రాతపూర్వక సమాచారం ఇచ్చిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Violence against Hindus: 2024లో బంగ్లాదేశ్లో హిందువులపై 2200 హింసాత్మక దాడులు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దాడులు ఎక్కువ అయినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇదే సమయలో పాకిస్తాన్లో హిందువులపై 112 దాడులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.
రాజ్యసభకు మంత్రిత్వ శాఖ డేటాను సమర్పించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయమై బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండు దేశాలకు లేఖలు రాసింది. వారి దేశాల్లో హిందువుల భద్రతను నిర్దారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. “ప్రభుత్వం ఈ సంఘటనలను తీవ్రంగా పరిగణించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో తన ఆందోళనలను పంచుకుంది. హిందువులు, ఇతర మైనారిటీల భద్రత మరియు సంక్షేమాన్ని నిర్ధారించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని భారతదేశం అంచనా” అని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Priyanka Gandhi: ప్రియాంకకు 1984తో కూడిన బ్యాగ్ను గిఫ్ట్గా ఇచ్చిన బీజేపీ.. తీసుకుని ఏం చేశారంటే..!
‘‘భారత ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా మైనారిటీ వర్గాలపై హింసను లేవనెత్తుతుంది మరియు మత అసహనం, మతపరమైన హింస, మైనారిటీ వర్గాలపై దాడులను నిరోధించడానికి, వారి భద్రత, భద్రత, శ్రేయస్సు కోసం చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. పాకిస్తాన్లోని మైనారిటీల దుస్థితిని సముచితమైన అంతర్జాతీయ ఫోరమ్లో భారత్ హైలైట్ చేస్తూనే ఉంది’’ అని తెలిపింది.
డేటా ప్రకారం.. బంగ్లాదేశ్లో 2022లో హిందువులపై 47 హింసాత్మక దాడులు నమోదవ్వగా, 2023లో 302, 2024లో 2200 దాడులు జరిగాయి. పాకిస్తాన్లో 2022లో 241, 2023లో 103, 2024లో 112 కేసులు నమోదయ్యాయి. మైనారిటీ, మానవ హక్కుల సంస్థల డేటాను ఉటంకిస్తూ, రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!