Violence against Hindus: పాకిస్తాన్లో కన్నా బంగ్లాదేశ్లోనే హిందువులపై ఎక్కువ దాడులు..
- బంగ్లాదేశ్, పాకిస్తాన్లో హిందువులపై దాడులపై రిపోర్ట్..
- రాజ్యసభలో వ్రాతపూర్వక సమాచారం ఇచ్చిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Violence against Hindus: 2024లో బంగ్లాదేశ్లో హిందువులపై 2200 హింసాత్మక దాడులు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దాడులు ఎక్కువ అయినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇదే సమయలో పాకిస్తాన్లో హిందువులపై 112 దాడులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.
రాజ్యసభకు మంత్రిత్వ శాఖ డేటాను సమర్పించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయమై బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండు దేశాలకు లేఖలు రాసింది. వారి దేశాల్లో హిందువుల భద్రతను నిర్దారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. “ప్రభుత్వం ఈ సంఘటనలను తీవ్రంగా పరిగణించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో తన ఆందోళనలను పంచుకుంది. హిందువులు, ఇతర మైనారిటీల భద్రత మరియు సంక్షేమాన్ని నిర్ధారించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని భారతదేశం అంచనా” అని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
Also Read
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
- Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
- UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
Read Also: Priyanka Gandhi: ప్రియాంకకు 1984తో కూడిన బ్యాగ్ను గిఫ్ట్గా ఇచ్చిన బీజేపీ.. తీసుకుని ఏం చేశారంటే..!
‘‘భారత ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా మైనారిటీ వర్గాలపై హింసను లేవనెత్తుతుంది మరియు మత అసహనం, మతపరమైన హింస, మైనారిటీ వర్గాలపై దాడులను నిరోధించడానికి, వారి భద్రత, భద్రత, శ్రేయస్సు కోసం చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. పాకిస్తాన్లోని మైనారిటీల దుస్థితిని సముచితమైన అంతర్జాతీయ ఫోరమ్లో భారత్ హైలైట్ చేస్తూనే ఉంది’’ అని తెలిపింది.
డేటా ప్రకారం.. బంగ్లాదేశ్లో 2022లో హిందువులపై 47 హింసాత్మక దాడులు నమోదవ్వగా, 2023లో 302, 2024లో 2200 దాడులు జరిగాయి. పాకిస్తాన్లో 2022లో 241, 2023లో 103, 2024లో 112 కేసులు నమోదయ్యాయి. మైనారిటీ, మానవ హక్కుల సంస్థల డేటాను ఉటంకిస్తూ, రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
తాజావార్తలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!