Violence against Hindus: పాకిస్తాన్లో కన్నా బంగ్లాదేశ్లోనే హిందువులపై ఎక్కువ దాడులు..
- బంగ్లాదేశ్, పాకిస్తాన్లో హిందువులపై దాడులపై రిపోర్ట్..
- రాజ్యసభలో వ్రాతపూర్వక సమాచారం ఇచ్చిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Violence against Hindus: 2024లో బంగ్లాదేశ్లో హిందువులపై 2200 హింసాత్మక దాడులు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దాడులు ఎక్కువ అయినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇదే సమయలో పాకిస్తాన్లో హిందువులపై 112 దాడులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.
రాజ్యసభకు మంత్రిత్వ శాఖ డేటాను సమర్పించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయమై బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండు దేశాలకు లేఖలు రాసింది. వారి దేశాల్లో హిందువుల భద్రతను నిర్దారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. “ప్రభుత్వం ఈ సంఘటనలను తీవ్రంగా పరిగణించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో తన ఆందోళనలను పంచుకుంది. హిందువులు, ఇతర మైనారిటీల భద్రత మరియు సంక్షేమాన్ని నిర్ధారించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని భారతదేశం అంచనా” అని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
Also Read
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
Read Also: Priyanka Gandhi: ప్రియాంకకు 1984తో కూడిన బ్యాగ్ను గిఫ్ట్గా ఇచ్చిన బీజేపీ.. తీసుకుని ఏం చేశారంటే..!
‘‘భారత ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా మైనారిటీ వర్గాలపై హింసను లేవనెత్తుతుంది మరియు మత అసహనం, మతపరమైన హింస, మైనారిటీ వర్గాలపై దాడులను నిరోధించడానికి, వారి భద్రత, భద్రత, శ్రేయస్సు కోసం చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. పాకిస్తాన్లోని మైనారిటీల దుస్థితిని సముచితమైన అంతర్జాతీయ ఫోరమ్లో భారత్ హైలైట్ చేస్తూనే ఉంది’’ అని తెలిపింది.
డేటా ప్రకారం.. బంగ్లాదేశ్లో 2022లో హిందువులపై 47 హింసాత్మక దాడులు నమోదవ్వగా, 2023లో 302, 2024లో 2200 దాడులు జరిగాయి. పాకిస్తాన్లో 2022లో 241, 2023లో 103, 2024లో 112 కేసులు నమోదయ్యాయి. మైనారిటీ, మానవ హక్కుల సంస్థల డేటాను ఉటంకిస్తూ, రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..