CM Chandrababu Warning: భూకబ్జాలపై సీఎం సీరియస్.. తాట తీస్తా..!
- భూకబ్జాలకు పాల్పడితే తాట తీస్తాం అని హెచ్చరించిన సీఎం..
- కృష్ణా జిల్లా ఈడుపుగల్లులో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు..
- జనవరి 9వ తేదీ వరకూ రెవెన్యూ సదస్సులు..
- రెవెన్యూ సదస్సుల ద్వారా మీ ఆస్తి మీకిచ్చే బాధ్యత మాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Warning: భూకబ్జాలకు పాల్పడితే తాట తీస్తాం అని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులో రెవెన్యూ సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు.. రైతుల నుంచి వినతులు స్వీకరించారు.. రెవెన్యూ సదస్సులో రెవెన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్, సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్, స్ధానిక ఎంఎల్ఏలు.. నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అత్యంత విధ్వంసం జరిగింది గత ప్రభుత్వంపై 1,51,467 అర్జీలు మా దగ్గరకు వచ్చాయి… అందులో 78,854 దరఖాస్తులు ROR కోసం వచ్చాయి.. 8267 భూకబ్జాకు సంబంధించి వచ్చాయని వివరించారు.. ప్రజల జీవితాలు అంధకారంలోకి పంపే స్ధితిలోకి వచ్చారు దుర్మార్గులు అని మండిపడ్డారు.. మీ భూమి మీకు ఇప్పించాలనే బాధ్యత తీసుకున్నా.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి గత సీఎం గుమాస్తాలతో మీ భూమిపైన పెత్తనం చేశారు.. హైదరాబాదు లో ఉండే భూములలో అవకతవకలు ఉండచ్చు.. ఏపీ భూములలో అలాంటి అవకతవకలు లేవని స్పష్టం చేశారు..
Read Also: Priyanka Gandhi: ప్రియాంకకు 1984తో కూడిన బ్యాగ్ను గిఫ్ట్గా ఇచ్చిన బీజేపీ.. తీసుకుని ఏం చేశారంటే..!
Also Read
- Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
- Kodali Nani: రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. ఆయన టీడీపీయే..!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
ఆ రాళ్ళ పైన ఫోటో తీయడానికి 12 కోట్లు ఖర్చయిందన్నారు సీఎం చంద్రబాబు.. సమస్యలకు పరిష్కారం చాలా పెద్ద పని.. సమస్యలు సృష్టించడం తేలిక అన్నారు.. జనవరి 9వ తేదీ వరకూ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి.. రెవెన్యూ సదస్సుల ద్వారా మీ ఆస్తి మీకిచ్చే బాధ్యత మాది అని మాట ఇచ్చారు.. 2024 ల్యాండ్ గ్రాబింగ్ చట్టం.. ద్వారా కబ్జాలు ఎలాంటివైనా కఠిన చర్యలుంటాయన్న ఆయన.. కబ్జా అని భూమి దగ్గరకి వెళ్తే జైలు కనిపించాలని పేర్కొన్నారు.. 6698 గ్రామాల్లో రీ సర్వే పై 2,79,149 మంది ఫిర్యాదు చేశారు.. ప్రతీ ఒక్క సమస్య మానవతా దృక్పధంతో పరిష్కరిస్తాం.. 176 ఇంటి స్ధలాలు 82-86లో ఇచ్చినవి 22ఏలో పెట్టి ఇబ్బంది పెట్టారు గత ప్రభుత్వం లో… ఆ 176 మందికి బే షరతుగా పట్టాలు ఇస్తాను అన్నారు.. ఐదు మంది కుటుంబ సమస్యతో మా దగ్గరకి వచ్చారు… వారి సమస్యను కలెక్టర్ తీరుస్తారని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!