Peddireddy Ramachandra Reddy: పులుల సంఖ్య రెట్టింపు అయ్యింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్లో పులల సంఖ్య రెట్టింపు అయ్యిందని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో నిర్వహించిన గ్లోబల్ టైగర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పులుల సంరక్షణ కు బీజం పడింది.. అందుకే ప్రతీ ఏడాది జులై 29న గ్లోబల్ టైగర్స్ డే జరుపుకుంటున్నాం.. మన రాష్ట్రంలో పులుల సంరక్షణలో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. నల్లమల ఫారెస్ట్ నుండి శేషాచలం ఫారెస్ట్ వరకు టైగర్ రిజర్వ్ కు విస్తరించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాధనలు సిద్దం చేస్తున్నాం.. తద్వారా అటవీ సంరక్షణ సులువు అవుతుందన్నారు.. పులుల సంరక్షణకు మరింత పటిష్ట చర్యలు చేపడుతామని ప్రకటించారు.. గతంలో కేవలం పులుల కాలి ముద్రలనుబట్టి సంఖ్య లెక్కించే వాళ్ళు.. కానీ, ఇప్పుడు అధునాతనమైన సాంకేతికతతో అది మరింత సులువుగా మారిందని.. మన దగ్గర పులుల సంఖ్య రెట్టింపు అయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు. అధికారులు పులుల సంరక్షణ కు నిరంతరం కృషి చేస్తున్నారు.. వారందరినీ అభినంధిస్తున్నట్టు వెల్లడించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Read Also: TS Govt: మైనార్టీలకు రూ.లక్ష సాయం.. ఆగస్టు 14 వరకు ధరఖాస్తుల స్వీకరణ
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
కాగా, అంతరించిపోతున్న పెద్ద పులల గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జులై 29న గ్లోబల్ టైగర్ డేని జరుపుకుంటున్న విషయం విదితమే.. 13 టైగర్ శ్రేణి దేశాలు కలిసి 2010లో ఈ దినోత్సవాన్ని స్థాపించారు. అప్పటి నుంచి క్రమంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. గ్లోబల్ టైగర్ డేలో ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు, సెలబ్రిటీలు, ప్రభుత్వ అధికారులు, కుటుంబాలు, స్నేహితులు మరియు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రచారానికి మద్దతుగా నిలుస్తున్నారు.. పులులను రెట్టింపు చేయడం అనే లక్ష్యంతో గ్లోబల్ టైగర్ డేని విస్తృతంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!