Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Nimmala Slams Jagan From Hitler Rule To Freedom In 2024

Nimmala Rama Naidu: జగన్మోహన్ రెడ్డి పర్యటనపై మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు..

Published Date :August 1, 2025 , 5:11 pm
By RAMAKRISHNA KENCHE
Nimmala Rama Naidu: జగన్మోహన్ రెడ్డి పర్యటనపై మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పర్యటనలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒకటో తారీకు వస్తే పండగ వాతావరణం నెలకొంటుందని.. వైసీపీ పాలనలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేందుకు ఐదేళ్లు పట్టిందన్నారు. జగన్ పింఛన్లు పెంచుతామని ప్రజలను మోసం దగా చేశారని.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి విషమంగా ఉన్న పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేస్తున్నామని తెలిపారు. ఏడాది పాలనలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం చేస్తున్నామన్నారు. ఓటమి నుంచి పాటలు నేర్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి అదే విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టి 2047 కి రాష్ట్రాన్ని ప్రపంచంలోనే తెలుగుజాతిని అగ్రస్థానంలో ఉంచాలని కృషి చేస్తున్నారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేయాలని ఆలోచించడం దురదృష్టకరమన్నారు. గంజాయి బ్యాచ్లకు బ్లేడ్ బ్యాచ్లకు బెట్టింగ్ బ్యాచ్లకు పరామర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అవినీతిలో భాగస్వాములై, ప్రజలను లూటీ చేసి జైల్లో ఉన్న వ్యక్తులను జగన్ పరామర్శిస్తున్నారు.. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని, వాటి గురించి మాట్లాడే అర్హతయే జగన్ కు లేదని విమర్శించారు.

READ MORE: Srushti Case : కస్టడీ విచారణలో షాకింగ్ కామెంట్స్ చేసిన డాక్టర్ నమ్రత

Also Read

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్
  • Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
  • PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
  • Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
Add as a preferred
source on google

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు వచ్చేవారు కాదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. “ఒకవేళ బయటకు వస్తే ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్టులు చేసేవారు. ఐదేళ్లపాటు కక్షలు వేధింపులు పాలనను ఎవ్వరూ మర్చిపోలేదు. జగన్ కు ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు. ఐదేళ్లపాటు ఒక హిట్లర్ ముషారఫ్ వంటి వ్యక్తులు కూడా అసూయపడేలా పాలన చేశారు. ఐదేళ్ల జగన్ పాలన నుంచి ప్రజలు విముక్తి పొందారు. 1947లో బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం లభిస్తే 2024లో రాక్షస పాలన నుంచి విముక్తి పొంది ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. జగన్ దొంగ ఏడుపులను అబద్దాలను నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదు. అన్యాయం గా అరెస్టు చేస్తున్నారంటూ జగన్ మాట్లాడటం హాస్యాస్పదం. చట్టం తన పని తాను చేసుకోని వెళ్తుంది. తప్పు చేసిన వారే జైల్లో ఉన్నారని కక్ష సాధింపుగా ఎవరిని జైల్లో పెట్టలేదు. మిథున్ రెడ్డిని కూడా కూటమి అధికారంలోకి వచ్చాక జైల్లో పెట్టలేదని సంవత్సరం పాటు విచారణ దర్యాప్తు చేసి ఆధారాలు అన్నిటిలతోనే అరెస్టు చేశాం. అరెస్టు అవకుండా మిథున్ రెడ్డి న్యాయస్థానానికి వెళితే అవి కూడా తిరస్కరించాయి. ప్రజల సొమ్ములను లూటీ చేసారని ఆధారాలు ఉండబట్టే కోర్టులు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించాయి. ప్రైవేట్ చేతిలో ఉండే లెక్కల వ్యాపారాన్ని జగన్ తన చేతిలోకి తీసుకున్నారా లేదా చెప్పాలి. బ్రాందీ అమ్మకం సర్కార్ పేరు మీద జగన్ చేతిలో ఉందో లేదో చెప్పాలి. రోడ్డు పక్కన అమ్మే జామకాయలు బండి దగ్గర కూడా ఫోన్ పే ఉంటుందని, సర్కార్ నిర్వహించే బ్రాందీ షాపుల్లో ఎందుకు ఫోన్ పే పెట్టలేదు. ఐదేళ్లపాటు సర్కార్ పేరు చెప్పి విచ్చలవిడిగా ప్రజల సొమ్ము లూటీ చేశారు. వైసీపీ పాలనలో జగన్ వెనకేసిన కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెనక్కి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం పని చేస్తుంది.” అని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2024 Andhra Elections
  • Anaparthi Visit
  • Andhra Pradesh Politics
  • AP Financial Crisis
  • AP Welfare Schemes

తాజావార్తలు

  • PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!

  • Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్

  • Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్‌లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!

  • PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions