Amaravati: ఆపరేషన్ బుడమేరుకు రంగం సిద్ధం.. ఆక్రమణలను గుర్తించే పనిలో యంత్రాంగం
- ఆపరేషన్ బుడమేరుకు రంగం సిద్దం చేస్తోన్న ప్రభుత్వం
- బుడమేరు ఆక్రమణలను గుర్తించే పనిలో ఇరిగేషన్ యంత్రాంగం
- మంత్రి నిమ్మల సమీక్షలో బుడమేరు ఆక్రమణల గుర్తింపు.
విజయవాడ క్యాంప్ ఆఫీస్లో ఆపరేషన్ బుడమేరుపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి జలవనరుల శాఖ ఈఎన్సీ, ఎస్.ఇ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ, సర్వే అధికారులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. బెజవాడ దుఃఖ దాయనిగా పిలవబడుతున్న బుడమేరుకు శాశ్వత పరిష్కారానికి ప్రణాళికపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో బెజవాడ ముంపు రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆలోచన లక్ష్యంగా ప్రతిరోజు రివ్యూ సమీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. బుడమేరు ఆక్రమణలకు సంబంధించి విద్యాధరపురం నుంచి గుణదల వరకు వీఎంసీ పరిధిలో ఎక్కువ ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించామని మంత్రి రామానాయుడు చెప్పారు.
Read Also: CM Relief Fund: సీఎం రిలీఫ్ ఫండ్కు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఈ లిమిట్లో 202 ఎకరాలకు గాను 70 ఎకరాలు ఆక్రమణ పాలయింది.. ఆక్రమణ స్థలంలో 3051 ఇళ్ల నిర్మాణాలు జరిగాయని గుర్తించామని మంత్రి పేర్కొన్నారు. బుడమేరు విస్తీర్ణం ఎంతవరకు ఉంది.. ఎంతవరకు ఆక్రమణ జరిగిందో వాస్తవ నివేదికను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తున్నామని మంత్రి నిమ్మల చెప్పారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు వరకు పలు గ్రామాలు, నగరంలో పలు వార్డులు విస్తరించి ఉన్నాయన్నారు. చీమల వాగు, కేసరవల్లి, ఎనికెపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు సామర్థ్యం గట్లు పటిష్ట, లైనింగ్ విస్తరణ చేసేందుకు సమీక్ష చేసామని అన్నారు. అలాగే.. బుడమేరు ఓల్డ్ ఛానల్ ఇళ్ల, పట్టణ మధ్య నుంచి ప్రవహించడం వల్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి పాములు కాల్వ, ముస్తాబాద్ కెనాల్, ఎనికేపాడు వరకు ఉన్న కాలువకు ప్రత్యామ్నాయంగా విస్తరణతో వరద నీరు మళ్లింపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో అభిప్రాయాలతో వాస్తవ పరిస్థితిపై సమీక్ష చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
Read Also: Bihar: బీహార్లో ఐపీఎస్ల రాజీనామా .. ప్రశాంత్ కిషోర్ హస్తం ఉందా?
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో