Minister Nara Lokesh: పారదర్శకంగా, పకడ్బందీగా మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేయండి..
- పారదర్శకంగా..పకడ్బందీగా మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేయండి
- ఈనెల 11న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం
- ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దండి
- మండలానికో ఇంటర్ కళాశాల ఏర్పాటు
- పాఠశాల..ఇంటర్మీడియట్ విద్య అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: పారదర్శకంగా, పకడ్బందీగా మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేయాలని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈనెల 11న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం చేయనున్నారు. ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దాలన్నారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. మెగా డీఎస్సీ నిర్వహణ విధివిధానాలపై సమావేశంలో చర్చించారు. సాధ్యమైనంత ఎక్కువమంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలన్నదే లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు ఈనెల 11వ తేదీన నిర్వహించే కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించారు.
Read Also: Nara Brahmani: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన నారా బ్రాహ్మణి
Also Read
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- 30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుపర్చే చర్యల్లో భాగంగా తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ డిసెంబర్ మొదటివారంలో మెగా పేటీఎం నిర్వహించాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు పూర్తిచేయాలన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు అపార్ ఐడీ కార్యక్రమం ఇప్పటివరకు 57.48శాతం పూర్తి అయిందన్నారు. సాధ్యమైనంత త్వరగా అపార్ ఐడీ ప్రక్రియ పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ రిపోర్టు కార్డులు అందజేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ ర్యాంకింగ్స్ పై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. అటెండెన్స్ మెరుగుదలకు చర్య తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలుండాలన్నారు. రాష్ట్రం మొత్తాన్ని నాలుగు జోన్లుగా విభజించి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో మెనూలో మార్పులు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఏడాదికల్లా మండలానికో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పాస్ పర్సంటేజి మెరుగుదలపై దృష్టి సారించాలన్నారు. అవసరమైతే వెనుకబడిన విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు నిర్వహించాలన్నారు. ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాలను ఏఐ ద్వారా ఎవాల్యుయేషన్ చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి తెలిపారు.
Read Also: Andhra Pradesh: దేవాలయాల్లో అర్చకులకు కనీస వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృష్టి పెట్టాలన్నారు. ఇంటర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలు చేపట్టాలన్నారు. రిమోట్ ప్రాంతాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటుచేసే వారికి త్వరితగతిన అనుమతులు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఐఐటీ, మెడిసిన్ వంటి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫోటోలను దినపత్రికల్లో ప్రచురించేలా కసరత్తు చేయాలన్నారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడం వల్ల 15వేల వరకు అడ్మిషన్లు పెరిగాయన్నారు. వచ్చే ఏడాది 2 లక్షల వరకు అడ్మిషన్లు పెరిగేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. విద్యార్థుల హాజరుపై సమీక్ష, ప్రోగెస్ కార్డులను అందిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఉత్తమ అధ్యాపకులతో విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులకు శిక్షణ ఇప్పించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ బుక్స్ తో పాటు ప్రశ్నాపత్రంలోనూ మార్పులు జరగాలన్నారు.
తాజావార్తలు
-
Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
-
Ram Charan : RC17 పై ‘పెద్ది’ ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
-
Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
-
Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
-
Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!