Minister KTR : 9 ఏళ్ళు అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లా తీసుకెళ్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ జిల్లా కాజీపేటలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9 ఏళ్ళు అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లా తీసుకెళ్తున్నామన్నారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ బీజేపీ నాయకులు సంక్రాంతి కి గంగిరెద్దుల మాదిరిగా వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కల్లబోల్లి మాటలు చెప్పే పార్టీలను నమ్మి మోసపోకుండా వినయ్ భాస్కర్ ను 70 వేల మెజార్టీతో గెలిపించాలన్నారు. అంతేకాకుండా.. ‘దుర్మార్గుడు చిల్లరగాడు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు పదోతరగతి పేపర్ లీక్ చేశాడు. దిక్కుమాలిన బిజేపి నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశంతో పేపర్ లీక్ చేశాడు. పోలీసులు పట్టుకుని జైల్ కు పంపితే బెయిల్ పై బయటకు వేస్తే దండలువేసి శాలువాలు కప్పి సన్మానించిన నీచమైన పార్టీ బీజేపీ. ఇంకా కుట్రలు జరుగుతాయి… మతం పేరిట చిచ్చు పెడుతారు. చైతన్యానికి మారుపేరుగా నిలిచే ఓరుగల్లు ప్రజలు ఆలోచించాలి.
Also Read : Populated Cities: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా గల టాప్-10 నగరాలు
Also Read
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అమలు చేయలేని సిగ్గుమాలిన దరిద్రపు పార్టీ బీజేపీ. తెలంగాణ ను ఏదో ఉద్దరించినట్లు నిరుద్యోగ సభలు పెడుతున్నారు. 640 కోట్లతో గ్రేటర్ వరంగల్ లో మంచినీటి సౌకర్యం కల్పించాం. 1100 కోట్లతో హెల్త్ సిటీని నిర్మిస్తున్నాం. బీజేపీకి నియ్యతి ఉంటే వరంగల్ కు ఏం చేశారో చెప్పాలి. మోడీ దోస్త్ కు దోచిపెట్టాలి.. దోస్త్ ఇచ్చే కమీషన్ తో దందాలు చేయాలే. మతం పేరిట మంటలు పెట్టుడే తప్ప ఒక్క మంచిపని చేసిందా బీజేపీ. నిరుద్యోగ యువత ఆలోచించాలి… మోడీ ప్రకటించిన ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి. వరంగల్ అంటే వారసత్వ సంపదే కాదు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఐటికి సంబంధించిన 8 నుంచి పది కంపెనీలు వరంగల్ కు వచ్చాయి. ముంబాయి కి పూణేలా… హైదరాబాద్ కు వరంగల్ మారుతుంది. తెలంగాణ కు వరంగల్ మణిహారం గా మారబోతుంది. తెలంగాణ లో పేదల ప్రభుత్వం ఉంది. అన్ని రాష్ట్రాలకు సీఎం ఉంటారు… కానీ మనకు రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం ఉన్నారు.’ అని ఆయన మంత్రి కేటీఆర్ అన్నారు.
Also Read : SK21: ఎన్నా .. తలైవా.. ఏమన్నా కాంబినేషనా
తాజావార్తలు
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!