KTR: రేవంత్ రెడ్డి, బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: రేవంత్ రెడ్డి, బండి సంజయ్లకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్లో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉద్యోగాల జాతరకు పాతరేయాలన్న విపక్షాల కుట్రలు సాగనివ్వబోమని మంత్రి పేర్కొన్నారు. ఒక్క దురదృష్టకర సంఘటనను బూచిగా చూపి మొత్తం నియామకాల ప్రక్రియను ఆపేయాలన్నదే బీజేపీ, కాంగ్రెస్ కుతంత్రమని ఆరోపించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేరు.. ప్రభుత్వం వేరు అన్న ఇంగిత జ్ఞానం లేని అజ్ఞానులంటూ మండిపడ్డారు. వెకిలి మకిలి ఆరోపణలతో బట్టగాల్చి మీదేసే చిల్లర ప్రయత్నాలను సహించేది లేదన్నారు. మతిలేని మాటలు మాట్లాడుతున్న పిచ్చి నేతల రాజకీయ ఉచ్చులో యువత చిక్కుకోవద్దన్నారు. ఉద్యోగాల ప్రిపరేషన్ను కొనసాగించాలని యువతకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Read Also: Parliament Impasse: లోక్ సభ స్పీకర్తో ప్రధాని మోదీ భేటీ.. రాహుల్ అంశంపై చర్చ?
Also Read
- 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
- Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేయగా.. రేపటి సిట్ విచారణకు సంజయ్ హాజరు కావడంలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. తనకు సిట్ నోటీసులు అందలేదని స్పష్టం చేసిన బండి సంజయ్.. సిట్పై నమ్మకం లేదన్నారు. సిట్టింగ్ జడ్జితో ఈ కేసు విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల వల్ల ప్రస్తుతం ఢిల్లీలోనే బండి సంజయ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపటి విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పేపర్ లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్ పీఏపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. తన దగ్గర ఉన్న ఆధారాలు సిట్ అధికారులకు సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. విచారణ అనంతరం మాట్లాడిన రేవంత్రెడ్డి.. ప్రతిపక్షాలను ప్రభుత్వం విచారణల పేరుతో భయపెడుతోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతునొక్కుతోందని విమర్శించారు.
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..