Steel Flyover: అందుబాటులోకి రానున్న స్టీల్ ఫ్లైఓవర్.. నాయిని పేరు పెట్టిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Steel Flyover: హైదరాబాద్ ప్రజా రవాణాలో మరో మైలురాయి చేరబోతోంది. ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ఈ నెల 19వ తేదీన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వంతెన ప్రారంభం కానున్నది. 2.63 కిలోమీటర్ల పొడవైన ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని SRDPలో భాగంగా GHMC చేపట్టింది. దీనికైన ఖర్చు 450 కోట్లు. ఈ స్టీల్ బ్రిడ్జికి దివంగత బీఆర్ఎస్ నేత, మాజీ హోంమత్రి నాయిని నరసింహారెడ్డి పేరు పెట్టారు. ముషీరాబాద్లో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి, వీఎస్టీ కార్మిక సంఘం నాయకుడిగా నాయిని చేసిన సేవలను స్మరించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
బ్రిడ్జి విశేషాలకు వస్తే.. దక్షిణ భారత దేశంలోనే రహదారిపై నిర్మించిన మొదటి పొడవైన ఉక్కు వంతెన ఇదే. జీహెచ్ఎంసీ చరిత్రలో కూడా భూసేకరణ లేకుండా నిర్మించిన బ్రిడ్జి ఇది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. హైదరాబాద్లో మెట్రో పైనుంచి వెళ్లిన వంతెన కూడా ఇదే మొదటిది. నాలుగు లేన్లతో సాగే ఈ వంతెన పొడవు 2.62 కిలోమీటర్లు. దీనికోసం 12 వేల 316 మెట్రికల్ టన్నుల ఉక్కుని వాడారు. మొత్తం 81 పిల్లర్లు.. 426 ఉక్కు దూలాలతో నిర్మించారు. కాంక్రీటుతో పోలిస్తే ఇది వందేళ్లకు పైగా మన్నుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు.
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
ఇక, ఈ వంతెన అందుబాటులోకి వస్తే.. వీఎస్టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరాపార్క్ క్రాస్రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ రూట్లో జనావాసాలతో పాటు వాణిజ్య సంస్థలు, కోచింగ్ సెంటర్లు, హాస్టల్స్, కాలేజీలు ఎక్కువ ఉన్న విషయం విదితమే.. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణంతో వాహనదారుల కష్టాలు తొలగిపోనున్నాయి.. మరోవైపు.. వంతెన ప్రారంభోత్సవంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.. ఆర్టీసీ ఎక్స్రోడ్, అశోక్నగర్, వీఎస్టీ జంక్షన్లో దశాబ్దాల తరబడిగా ఉన్న ట్రాఫిక్ రద్దీ సమస్యను పరిష్కరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.. తెలంగాణ తొలి హోంమంత్రిగా పని చేసిన స్వర్గీయ నాయిని నర్సింహారెడ్డి పేరును పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని కూడా తన ట్వీట్లో పేర్కొన్నారు కేటీఆర్.
Happy to be resolving the decades old longstanding problem of traffic congestion at RTC X Roads, Ashok Nagar and VST junctions
Will be inaugurating a new Flyover/Steel Bridge on 19th August. Built at a cost of ₹450 Crore this 2.63 KM long steel bridge was built by GHMC under… pic.twitter.com/UkDOOSvXS1
— KTR (@KTRBRS) August 17, 2023
తాజావార్తలు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..