KTR: కాంగ్రెస్- బీజేపీ పార్టీలు ఏం చేశారని ఓట్లు అడుగుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖిల్లా వరంగల్ లో తూర్పు నియోజకవర్గ సంక్షేమ సభలో మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ.. ఒకే రోజు 15 వేల మందికి సంక్షేమ పథకాలు మంజూరు పత్రాలు అందజేసిన ఘనత సీఎం కేసీఆర్ ది అని పేర్కొన్నారు. కేసీఆర్ అంటేనే సంక్షేమం.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కేసిఆర్ ను చూసి కాంగ్రెస్ బిజేపి నాయకులు వ్యవహరిస్తున్నారు.. ఎవరో వచ్చి ఏదేదో చేస్తామంటే ఆగం కాకండీ అని ఆయన చెప్పారు. తొందరలోనే శుభ వార్త వింటారు.. ఎవరెవరికి ఏం చేయాలో కేసీఆర్ ఆలోచిస్తున్నారు.. ఇప్పటి వరకు చేసింది కేసిఆరే.. మళ్ళీ వచ్చేది కేసీఆరే.. ఏం చేయాలన్నా కేసిఆరే చేస్తారు అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Read Also: The Great Indian Suicide Review: ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ రివ్యూ
Also Read
- PM SVANidhi Scheme: కేంద్రం గుడ్న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
- AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
- నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
- Indian Cricketers: ధావన్ నుంచి బుమ్రా వరకు.. భర్త కంటే భార్యే పెద్ద.. భారత క్రికెట్లో ఈ స్టార్ జంటల ప్రేమకథలు తెలుసా?
ఎన్నికలు రాగానే పొలిటికల్ టూరిస్టులు వస్తారు అంటూ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేవలం ఓట్లు కోసం ఎన్నికలప్పుడు వచ్చే నాయకులను నమ్మకండి.. మేము 9 ఏళ్ళలో ఏం చేశామో చెబుతూ ఓట్లు అడుగుతున్నాం.. వాళ్ళు ఏం చేశారని ఓట్లు అడుగుతారో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. పదేళ్ళలో ఏది అడిగినా ఇచ్చింది కేసిఆరే.. ఆయనకు అండగా ఉంటామని చెప్పండి.. బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి అని మంత్రి కోరారు. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే.. ఏం చేయాలన్నా కేసిఆరే చేస్తారు అని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్-బీజేపీ నాయకులు చెప్పే మాటలు నమ్మితే మీరు ఆగమవుతారు అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.
Read Also: Amit Shah: నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం.. వామపక్ష తీవ్రవాదంపై హోంమంత్రి సమీక్ష
సీఎం కేసిఆర్ అంటేనే సంక్షేమం.. పేదవాళ్ల కళ్ళలో సంతోషం చూడడమే బీఆర్ ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి కేటీఆర్ అన్నారు. కుల రహిత, వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా ఎదగాలనే ఆకాంక్ష. సీఎం కేసీఆర్ ది.. ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నారు.. వాళ్లకు 55 ఏళ్లు అధికారం ఇచ్చారు.. గత ప్రభుత్వాలు కరెంటు, తాగు, సాగు నీరు ఇవ్వలేదు.. త్వరలోనే శుభవార్త వింటారు.. ఓట్ల కోసం గగిరెద్దుల్లా వస్తున్న వారిని నమ్ముదామా?.. మీకు ఎల్లవేళలా అండగా ఉండే నాయకుడు ఎమ్మెల్యే నరేందర్ ను గెలిపించుకోండి.. ఎలక్షన్ రాగానే పొలిటికల్ టూరిస్టులు వస్తారు అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
PM SVANidhi Scheme: కేంద్రం గుడ్న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
-
Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్కు ముందే లాభాలు
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
ట్రెండింగ్
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?