KTR: కాంగ్రెస్- బీజేపీ పార్టీలు ఏం చేశారని ఓట్లు అడుగుతారు..
ఖిల్లా వరంగల్ లో తూర్పు నియోజకవర్గ సంక్షేమ సభలో మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ.. ఒకే రోజు 15 వేల మందికి సంక్షేమ పథకాలు మంజూరు పత్రాలు అందజేసిన ఘనత సీఎం కేసీఆర్ ది అని పేర్కొన్నారు. కేసీఆర్ అంటేనే సంక్షేమం.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కేసిఆర్ ను చూసి కాంగ్రెస్ బిజేపి నాయకులు వ్యవహరిస్తున్నారు.. ఎవరో వచ్చి ఏదేదో చేస్తామంటే ఆగం కాకండీ అని ఆయన చెప్పారు. తొందరలోనే శుభ వార్త వింటారు.. ఎవరెవరికి ఏం చేయాలో కేసీఆర్ ఆలోచిస్తున్నారు.. ఇప్పటి వరకు చేసింది కేసిఆరే.. మళ్ళీ వచ్చేది కేసీఆరే.. ఏం చేయాలన్నా కేసిఆరే చేస్తారు అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Read Also: The Great Indian Suicide Review: ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ రివ్యూ
Also Read
- SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
ఎన్నికలు రాగానే పొలిటికల్ టూరిస్టులు వస్తారు అంటూ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేవలం ఓట్లు కోసం ఎన్నికలప్పుడు వచ్చే నాయకులను నమ్మకండి.. మేము 9 ఏళ్ళలో ఏం చేశామో చెబుతూ ఓట్లు అడుగుతున్నాం.. వాళ్ళు ఏం చేశారని ఓట్లు అడుగుతారో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. పదేళ్ళలో ఏది అడిగినా ఇచ్చింది కేసిఆరే.. ఆయనకు అండగా ఉంటామని చెప్పండి.. బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి అని మంత్రి కోరారు. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే.. ఏం చేయాలన్నా కేసిఆరే చేస్తారు అని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్-బీజేపీ నాయకులు చెప్పే మాటలు నమ్మితే మీరు ఆగమవుతారు అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.
Read Also: Amit Shah: నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం.. వామపక్ష తీవ్రవాదంపై హోంమంత్రి సమీక్ష
సీఎం కేసిఆర్ అంటేనే సంక్షేమం.. పేదవాళ్ల కళ్ళలో సంతోషం చూడడమే బీఆర్ ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి కేటీఆర్ అన్నారు. కుల రహిత, వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా ఎదగాలనే ఆకాంక్ష. సీఎం కేసీఆర్ ది.. ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నారు.. వాళ్లకు 55 ఏళ్లు అధికారం ఇచ్చారు.. గత ప్రభుత్వాలు కరెంటు, తాగు, సాగు నీరు ఇవ్వలేదు.. త్వరలోనే శుభవార్త వింటారు.. ఓట్ల కోసం గగిరెద్దుల్లా వస్తున్న వారిని నమ్ముదామా?.. మీకు ఎల్లవేళలా అండగా ఉండే నాయకుడు ఎమ్మెల్యే నరేందర్ ను గెలిపించుకోండి.. ఎలక్షన్ రాగానే పొలిటికల్ టూరిస్టులు వస్తారు అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
-
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!