KTR: ములుగు ప్రజలు గత ఎన్నికల్లో చేసిన తప్పు చేయవద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి తరుఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏటూరునాగారం రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగులో వంద శాతం గెలుస్తామన్నారు. గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే అభివృద్ది ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అని కేటీఆర్ అన్నారు.
ములుగులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేక పోయినా.. జిల్లాను చేసిన ఘనత కేసిఆర్ ది అని తెలిపారు.
Kaleru Venkatesh: ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తుంది
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ఇన్స్టాగ్రామ్ ఎమ్మెల్యేను కాదు.. ఇక్కడే ఉండి మీకు సేవ చేసే ఎమ్మెల్యేను గెలిపించండని అక్కడి ప్రజలను మంత్రి కేటీఆర్ కోరారు. కరెంట్ గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలకు సిగ్గులేదని దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి ఎన్నికల కమీషన్ కు ఉత్తరం రాయడం వల్లే రైతు బందు ఆగిందని మంత్రి తెలిపారు. రైతుల నోటికాడి బుక్క దూరం చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ఇలాంటి.. కాంగ్రెస్ దరిద్రాన్ని మళ్ళీ నెత్తిన పెట్టుకుందామా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మార్పు కావాలి కాబట్టే.. మీ దిక్కు మాలిన కాంగ్రెస్ కు విముక్తి చెప్పి తెలంగాణా తెచ్చుకున్నామని అన్నారు. కాంగ్రెస్ కొత్త పార్టీ కాదు.. చెత్త పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం ఎన్ని కథలైనా చెపుతారు నమ్మొద్దు.. ములుగు ప్రజలు గత ఎన్నికల్లో చేసిన తప్పు చేయవద్దని కేటీఆర్ తెలిపారు. నాగ జ్యోతిని గెలిపిస్తేనే ములుగును అభివృద్ధి చేస్తాం.. లేకపోతే తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏమీ చేయమని కేటిఆర్ కరాఖండిగా చెప్పారు.
Minister Dharmana Prasada Rao: పేదరికంతో ఉండి దరఖాస్తు చేస్తే సంక్షేమం అందిస్తాం..
మరోవైపు.. ములుగు ప్రాంత అభివృద్ధి సీఎంతోనే సాధ్యం అయ్యిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కళ్ళముందే బూతద్దంలా ములుగు అభివృద్ధి కనిపిస్తుందని తెలిపారు. 100 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఇదిలా ఉంటే.. ఏటూరునాగారంలో బస్ డిపో, మోడల్ కాలనీలు, బిల్ట్ కర్మాగారాన్ని తెరిపిస్తామన్నారు. అంతేకాకుండా.. శివవసత్తులకు గౌరవవేతనం ఇస్తామని తెలిపారు. పేదలకు ఇల్లు, కొండాయి బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు సౌభాగ్య లక్ష్మీ కింద నెలకు 3 వేలు ఇస్తామని చెప్పారు. కార్డులు, పింఛన్లు ఇస్తాము.. అన్నపూర్ణ ద్వారా సన్న బియ్యం ఇస్తాం.. రూ.400 లకే గ్యాస్ ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!