Navy Radar Station: దామగుండంలో నేవీ రాడార్ ఏర్పాటుపై నిరసనలు.. మంత్రి రియాక్షన్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా దామగండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ ఏర్పాటు వల్ల అడవులు, గాలి, భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని కొందరు ఆరోపణలు చేస్తున్నారు.. దీనిపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే నేవీ రాడార్ కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు. చివరిగా సంతకం పెట్టాల్సి ఉండగా మాకు బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వాలని కేసీఆర్ ఆ ఫైల్ ను ఆపారు.. ఇది కేంద్రానికి సంబంధించినది.. దాని భద్రతకు సంబంధించిన అంశం.. ఇప్పుడు అక్కడ చాలా చెట్లు నరికేశారు.. గడ్డి ఉన్న చోటే నిర్మాణాలు జరుగుతున్నాయి.. తమిళనాడులో 30 సంవత్సరాల నుంచి అక్కడ నేవీ రాడార్ ను కేంద్ర ప్రభుత్వం నడిపిస్తుంది.. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు అని ఆమె తెలిపారు. పరిగి కేంద్రీయ విద్యాలయాలు, నేవీ స్కూల్స్ వస్తాయి.. తెలంగాణ ప్రైడ్, ఈ ఫైల్ మా చేతుల నుంచి వెళ్ళింది కాదు.. అన్నీ బీఆర్ఎస్ పార్టీ నుంచే చేశారు అని మంత్రి కొండా సురేఖ తెలిపారు.
Read Also: Kerala Court: కేరళ కోర్టు సంచలన తీర్పు.. బీజేపీ నేత హత్య కేసులో 15 మందికి ఉరిశిక్ష!
Also Read
- Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
- Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
బీఆర్ఎస్ నేతలు చాలా మోసం చేశారు అని మంత్రి కొండా సురేఖ తెలిపారు. పర్సెంటెజ్ కోసం ఇతరులకు భూములు లీజుకు ఇచ్చారు..44 జీవో ఇచ్చి 2010 సెప్టెంబర్ లో తూర్పు నావికా దళం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది.. ఉద్యమం వల్ల ఏమి జరగలేదు.. వాళ్ళు చేస్తోంది టైమ్ పాస్ కోసమే.. ప్రజలకు ఉపయోగపడే అంశాల్లో రాజకీయాలు చేయొద్దు అని ఆమె కోరారు. తెలంగాణకు మంచి పేరు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి ముప్పు ఉండదు.. ఈ నేవీ ప్రాజెక్టు వల్ల చీమకు కూడా హానీ కలుగదు అని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.
Read Also: Kalki: పాన్ వరల్డ్ సినిమా నుంచి టీజర్… త్వరలో
బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల్లో అహంకారం కనిపిస్తుంది అని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజలు ఛీ కొట్టినా ఇంకా బుద్ధి రాలేదు.. కవిత పూలే విగ్రహం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు.. బీసీలపై అంత ప్రేమ ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ను తొలగించి బీసీకి ఆ పదవి ఇవ్వాలన్నారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను.. ఉందుకంటే, నేను వైఎస్సార్సీపీలో లేను కాబట్టి కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం చేస్తాను.. ఏపీ ఎన్నికల షెడ్యూల్ రాగానే తప్పకుండా ప్రచారంకు వెళ్తాను అని ఆమె పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?