Komatireddy Venkat Reddy: ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ
- దురాజ్ పల్లిలో జరుగుతున్న లింగమంతుల జాతరలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుంది.
- ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ.
- వాళ్లకు మా గురించి మాట్లాడే అర్హత లేదంటూ వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy: సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలో జరుగుతున్న లింగమంతుల జాతరలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం సెక్యూలర్ విధానాన్ని పాటిస్తుందని, అన్ని మతాలను గౌరవిస్తుందని పేర్కొన్నారు. మాది సెక్యూలర్ ప్రభుత్వమని, మాకు అన్ని పండుగలు సమానమేనని అన్నారు. ప్రజలందరికీ సమాన న్యాయం అందించడమే మా ధ్యేయం అని తెలిపారు.
Read Also: CM Revanth Reddy: ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం రేవంత్ రెడ్డి
Also Read
బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఆయన, ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ.. వాళ్లకు మా గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. అలాగే, తెలంగాణలో కాంగ్రెస్ పాలన మరింత బలోపేతం అవుతుందని, వచ్చే 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే బీసీనీ సీఎం చేస్తామని చెప్పిన బీజేపీ, ఓ బీసీ నేత పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా అతన్ని పక్కన పెట్టిందని చెప్పుకొచ్చారు. వాళ్ల నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలు, ఇప్పుడు వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి రాకతో దురాజ్ పల్లి లింగమంతుల జాతర వైభవంగా సాగుతోంది.
తాజావార్తలు
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!