Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Minister Kolusu Parthasarathy Press Meet About Ap Cabinet Decisions

AP Cabinet Decisions: నెలాఖరు నుంచి శ్వేత పత్రాల విడుదల.. వాటిపైనే దృష్టి..

Published Date :June 24, 2024 , 4:00 pm
By Sudhakar Ravula
  • కీలక నిర్ణయాలు తీసుకున్న తొలి కేబినెట్‌ సమావేశం
  • మూడున్నర గంటలపాటు సాగిన కేబినెట్
  • ఈ నెలాఖరు నుంచి వరుసగా ఏడు శ్వేత పత్రాలను విడుదల
  • పోలవరం.. అమరావతి.. విద్యుత్.. పర్యావరణం.. శాంతి భద్రతలు.. మద్యం.. శాండ్ అండ్ మైన్ వంటి వాటిపై శ్వేత పత్రాలు..
AP Cabinet Decisions: నెలాఖరు నుంచి శ్వేత పత్రాల విడుదల.. వాటిపైనే దృష్టి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Cabinet Decisions: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మూడున్నర గంటలపాటు సాగిన సమావేశంలో.. జరిగిన సుదీర్ఘ చర్చ, తీసుకున్న నిర్ణయాలపై మీడియాకు వివరాలు వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి.. ప్రజలరు భరోసా కల్పించే ప్రభుత్వం వచ్చింది.. మెగా డీఎస్సీ నిర్వహణపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం.. ఉపాధ్యాయుల నియామకాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కానీ, మేం టీచర్ల నియామకానికి హై ప్రయార్టీ ఇచ్చాం.. 16,347 పోస్టులతో భర్తీ చేశాం. ఆరు నెలకొకసారి నిర్వహించే టెట్ పరీక్షలను గత ప్రభుత్వం నిర్వహించ లేదు. దీని వల్ల నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది. నాణ్యత కలిగిన విద్యని అందించేలా ఎన్ఈపీని స్టడీ చేయమన్నారని తెలిపారు.

Read Also: Farmer Hulchul: కలెక్టరేట్ పైకెక్కి పురుగుల మందు తాగి రైతు హల్‌చల్

Also Read

  • Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
  • IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
  • Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
  • Donald Trump: ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్‌‌ను టార్గెట్ చేసిన ట్రంప్..!

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది అని తెలిపారు పార్థసారథి.. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ పేరు చెబితేనే భూ యజమానులు తమపై పిడుగుపాటు పడ్డట్టు ఫీలయ్యారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి.. గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలున్నాయి. అలాంటి భయంకరమైన చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. పెన్షన్లు పంపిణీపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. 65.30 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. సచివాలయ సిబ్బందే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేపడతారు.. బకాయిలతో సహా రూ.7 వేల పెన్షన్ ఇస్తామన్నారు.. ఈ పెన్షన్ పెంపు వల్ల నెలకు రూ. 810 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది.. ఏడాదికి రూ. 33,709 కోట్లు పెన్షన్ల నిమిత్తం పంపిణీ చేయబోతున్నాం అని పేర్కొన్నారు పార్థసారథి.

Read Also: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. వారికి 6 నెలల సెలవులు

తమ ప్రభుత్వంలో స్కిల్ సెన్సస్ చేపడతాం అన్నారు మంత్రి పార్థసారథి.. అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నాం. పౌష్టికాహారాన్ని పేదలకు రూ. 5కే అందిస్తున్నాం. మొత్తంగా 203 అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసేసింది. వీటిల్లో 183 క్యాంటీన్లను త్వరలో ప్రారంభించబోతున్నాం.. మిగిలిన 20 క్యాంటీన్లను తర్వాత ప్రారంభిస్తాం అని వెల్లడించారు. ఇక, హెల్త్ యూనివర్శిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెడుతూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం అన్నారు. దమ్మాలపాటి శ్రీనివాసును ఏజీగా కేబినెట్ ఆమోదం తెలిపింది.. గంజాయి నివారణకు ఐదుగురు సభ్యులతో కేబినెట్ సబ్ కమిటీ వేసింది. పంచాయతీ, మున్సిపాల్టీల్లో పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించాలని కేబినెట్ ఆదేశించిందన్నారు.. మరోవైపు.. ఈ నెలాఖరు నుంచి వరుసగా ఏడు శ్వేత పత్రాలను విడుదల చేయబోతున్నాం. పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం, శాంతి భద్రతలు, మద్యం, శాండ్ అండ్ మైన్ వంటి వాటిపై ఈ శ్వేత పత్రాలు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap Cabinet
  • AP Cabinet Decisions
  • cm chandrababu
  • Deputy CM Pawan Kalyan

తాజావార్తలు

  • Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..

  • Easy Laundry Tricks: కాలర్ మొండి మరకలను సింపుల్‌గా వదిలించే సూపర్ టిప్స్!

  • IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!

  • LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..

  • Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions