Kollu Ravindra: ఇసుక కొరత లేకుండా చూస్తాం.. బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే కఠిన చర్యలు
- ఉచిత ఇసుక విధానం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు- కొల్లు రవీంద్ర
- ఇసుక కొరత లేకుండా చూస్తాం..
- బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే కఠిన చర్యలు- మంత్రి కొల్లు రవీంద్ర.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. తిరిగి ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఫ్రీగా ఇసుక అందించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం.. కలెక్టర్ల అధ్యక్షతన లోడింగ్, రవాణ ఛార్జీల నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత ఇసుక విధానం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్నారు. ఉచిత ఇసుక విధానం అమలుకు విధి విధానాలు రూపొందించుకుంటున్నామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
Jharkhand: ముఖ్యమంత్రి పదవికి చంపయ్ సోరెన్ రాజీనామా
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
గత ఐదేళ్ల కాలంలో ఇసుక దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులైన పేదల కడుపు కొట్టిందని.. నిర్మాణాలు నిరంతరాయంగా జరగాలనేది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఉచిత ఇసుక విధానం అమలు అవుతూందని.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సుమారు కొన్ని నెలల పాటు ఇసుక అందకుండా చేసిందన్నారు. గత ప్రభుత్వ ఇసుక విధానం వల్ల కొన్ని కోట్ల మంది నష్టపోయారు.. రోడ్డున పడ్డారని తెలిపారు.
Shalini : ఆస్పత్రిలో హీరో అజిత్ భార్య.. ఏమైందంటే..?
రాష్ట్రంలో ఇసుక కొరత అనేదే లేకుండా చూస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఇసుకను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతామన్నారు. ఇసుకను బ్లాక్ మార్కెట్ చేయాలని ఎవరైనా భావిస్తే.. తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం అనధికారికంగా కొన్ని స్టాక్ పాయింట్లు పెట్టింది.. వాటిని కంట్రోల్లోకి తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఇసుకను ఆదాయంగా మలుచుకున్న గత ప్రభుత్వ విధానానికి తాము వ్యతిరేకమని తెలిపారు. ఇసుక మాఫియాలో ఎవరు నిందితులుగా ఉన్నారో.. వారందరి పేర్లు వెలికి తీస్తాం.. అన్ని చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!