Kollu Ravindra: ఇసుక కొరత లేకుండా చూస్తాం.. బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే కఠిన చర్యలు
- ఉచిత ఇసుక విధానం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు- కొల్లు రవీంద్ర
- ఇసుక కొరత లేకుండా చూస్తాం..
- బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే కఠిన చర్యలు- మంత్రి కొల్లు రవీంద్ర.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. తిరిగి ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఫ్రీగా ఇసుక అందించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం.. కలెక్టర్ల అధ్యక్షతన లోడింగ్, రవాణ ఛార్జీల నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత ఇసుక విధానం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్నారు. ఉచిత ఇసుక విధానం అమలుకు విధి విధానాలు రూపొందించుకుంటున్నామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
Jharkhand: ముఖ్యమంత్రి పదవికి చంపయ్ సోరెన్ రాజీనామా
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
గత ఐదేళ్ల కాలంలో ఇసుక దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులైన పేదల కడుపు కొట్టిందని.. నిర్మాణాలు నిరంతరాయంగా జరగాలనేది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఉచిత ఇసుక విధానం అమలు అవుతూందని.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సుమారు కొన్ని నెలల పాటు ఇసుక అందకుండా చేసిందన్నారు. గత ప్రభుత్వ ఇసుక విధానం వల్ల కొన్ని కోట్ల మంది నష్టపోయారు.. రోడ్డున పడ్డారని తెలిపారు.
Shalini : ఆస్పత్రిలో హీరో అజిత్ భార్య.. ఏమైందంటే..?
రాష్ట్రంలో ఇసుక కొరత అనేదే లేకుండా చూస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఇసుకను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతామన్నారు. ఇసుకను బ్లాక్ మార్కెట్ చేయాలని ఎవరైనా భావిస్తే.. తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం అనధికారికంగా కొన్ని స్టాక్ పాయింట్లు పెట్టింది.. వాటిని కంట్రోల్లోకి తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఇసుకను ఆదాయంగా మలుచుకున్న గత ప్రభుత్వ విధానానికి తాము వ్యతిరేకమని తెలిపారు. ఇసుక మాఫియాలో ఎవరు నిందితులుగా ఉన్నారో.. వారందరి పేర్లు వెలికి తీస్తాం.. అన్ని చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!