Karumuri Nageswara Rao: చంద్రబాబుని అరెస్ట్ చేస్తారు.. భయంతోనే జనంలోకి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao: అవినీతపరుడైన చంద్రబాబుని అరెస్ట్ చేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి పేరుతో దోచుకున్నదంతా బయట పడుతుందనే భయంతోనే చంద్రబాబు జనంలో తిరుగుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. అకాల వర్షాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తూ.. రైతులతో మాట్లాడుతోన్న చంద్రబాబుపై మండిపడ్డ ఆయన.. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు చంద్రబాబు రైతుల విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా వైసీపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుటుందని స్పష్టం చేశారు.. రైతురుణ మాఫీ చేస్తాం అని అధికారంలోకి వచ్చాక 85 వేల కోట్లు నుంచి 18వేల కోట్లకు కుదించారంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. కానీ, చివరికి అది కూడా ఇవ్వకుండా వదిలేశారని విమర్శించారు..
Read Also: Somu Veerraju: ధాన్యం కొనుగోళ్లల్లో అక్రమాలు..! శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
Also Read
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
అమరావతి అవినీతిపై స్టే ఎత్తేయడం, స్కిల్ డెవలప్మెంట్ అవినీతి కేసుల్లో ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతో ఇప్పుడు చంద్రబాబు జనంలో తిరుగుతున్నారు.. అవినీతపరుడైన చంద్రబాబుని అరెస్ట్ చేస్తారంటూ జోస్యం చెప్పారు కారుమూరి.. అమరావతి పేరుతో దోచుకున్నదంతా బయట పడుతుందనే భయంతో జనంలో తిరుగుతున్నారన్న ఆయన.. మరోవైపు.. రైతుల పేరుతో ఇన్సూరెన్స్ కంపెనీలకు కోట్లు దోచి పెట్టారని ఆరోపించారు. కాగా, చంద్రబాబు హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, అవినీతిపై వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై హైకోర్టు స్టే విధించడంతో.. సుప్రీంకోర్టుకు వెళ్లింది ఏపీ సర్కార్.. అయితే, హైకోర్టు స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసిన విషయం విదితమే. దీంతో.. ఏపీ సర్కార్ వేసిన సిట్ యథావిథిగా పనిచేయడానికి లైన్ క్లియర్ అయ్యింది.
తాజావార్తలు
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!