Somu Veerraju: ధాన్యం కొనుగోళ్లల్లో అక్రమాలు..! శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: ధాన్యం కొనుగోళ్లల్లో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు… అకాల వర్షాల వలన కలిగిన నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వానికి అంచనాలు లేవని ఆరోపించారు. రైతులను దారుణమైన ఇబ్బందులు పాలు చేశారని మండిపడ్డారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని విమర్శించారు.. దానిపై పోరాటం చేస్తామని వెల్లడించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అనేక అవకతవకులు జరుగుతున్నాయి, టెక్నాలజీ వచ్చింది.. కానీ, మార్చి, ఏప్రిల్, మే నెలలోనెలలో జరిగే విపత్తుల గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు.. ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.
Read Also: RCB vs DC : ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. మరో రికార్డ్ పై కన్నేసిన విరాట్ కోహ్లీ
Also Read
- Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. రైతును ఈ ప్రభుత్వం రోడ్డున నిలబెట్టిందని విమర్శించారు సోము వీర్రాజు. మిల్లరు, సివిల్ సప్లై అధికారులు కుమ్మక్కయ్యారు.. ధర నిర్ణయించి ఆర్బికేలో అప్డేట్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి 3500 కోట్లు అక్రమాలు సివిల్ సప్లైస్, మిల్లర్లు చేస్తుంటే ప్రభుత్వాలు నిద్రపోతున్నాయి. ఈ కుంభకోణం ఎప్పటినుంచో జరుగుతుందని అన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల అక్రమాలకు సంబంధించి కార్యాచరణ రూపొందించామని అన్నారు. ప్రతి సోమవారం కరెక్టేట్ వద్ద ధర్నాలు, జిల్లా స్థాయిలో జరుగుతున్న అవినీతిపై చార్జిషీట్ రూపొందిస్తాం.. జిల్లా ఎస్పీకే అందజేస్తామని వివరించారు. నాలుగు రకాలుగా ఆందోళన చేస్తామని అన్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి ఏ సహాయం చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల్లా మరిపోతున్నారని ఆరోపించారు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
-
Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
-
Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!