Jupally Krishna Rao: కేసీఆర్ మళ్ళీ రావాలని కొందరు అంటున్నారు.. వస్తే అప్పులు చేయడానికా..?
- మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపాటు
- తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ఉంది.. వందల మంది ప్రాణాల త్యాగం లేదా..?
- రాజకీయంగా దెబ్బతింటాం అని తెలిసి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ
- తెలంగాణ ఏర్పాటులో ఎవరి పాత్ర వాళ్లకు ఉంది- మంత్రి
- కేసీఆర్ మళ్ళీ రావాలని కొందరు కోరుకుంటున్నారు- జూపల్లి కృష్ణారావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది.. వందల మంది ప్రాణాల త్యాగం లేదా..? అని ప్రశ్నించారు. రాజకీయంగా దెబ్బతింటాం అని తెలిసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.. తెలంగాణ ఏర్పాటులో ఎవరి పాత్ర వాళ్లకు ఉందని అన్నారు. కేసీఆర్ మళ్ళీ రావాలని కొందరు కోరుకుంటున్నారు.. 10 ఏళ్ల తర్వాత కూడా నిరుద్యోగ సమస్య ఎందుకు ఉందని దుయ్యబట్టారు. ధనిక రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పు ఎలా అయ్యింది..? నెలకు రూ.6500 కోట్లు ఈఎంఐలు కడుతున్నామని తెలిపారు. ఇదేనా గొప్ప పాలన.. కేసీఆర్ మళ్ళీ వస్తే.. రూ.20 వేల కోట్ల అప్పులు చేసి పెడతారని విమర్శించారు.
Read Also: Council Chairman: కేటీఆర్ రైతు దీక్షపై గుత్తా సుఖేందర్ కౌంటర్..
Also Read
- Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
- Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
- PCB: కీలక నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్..
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
కేసీఆర్ శాసన సభకి రావడం లేదు.. కన్న తల్లితండ్రులను చంపి.. జడ్జి ముందు తల్లితండ్రులు లేని అనాధని అన్నట్టు కేటీఆర్ మాట్లాడుతున్నాడని మంత్రి జూపల్లి విమర్శించారు. కేటీఆర్కి సిగ్గుండాలి.. సర్పంచుల బిల్లులు ఇవ్వట్లేదు అని అనడానికి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. బకాయి పెట్టింది ఎవరు..? మీరు చేసిన అప్పులు కట్టడానికి.. అప్పు తేవాల్సి వస్తుందని అన్నారు. ప్రజలు తెలివైన వాళ్ళు.. అమాయకులు కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
Read Also: Realme: పిచ్చెక్కించే ఫీచర్లతో మార్కెట్ లోకి రియల్మి P3 సిరీస్ విడుదల.. ధర ఎంతంటే?
కృష్ణా వాటర్ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కి లేదని మంత్రి ఆరోపించారు. 511 టీఎంసీ ఏ లెక్క ప్రకారం ఆంధ్రాకు ఇచ్చారు.. ఆంధ్రాకు 511 టీఎంసీలు ఇచ్చి.. వాళ్లకు న్యాయబద్ధత కల్పించారని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే దానిపై పోరాటం చేస్తే కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చిందని తెలిపారు. కేసీఆర్ హయంలో నాలుగు స్తంభాల ఆట నడిచింది.. కుటుంబ పాలనే అని ఆరోపించారు. మీటింగులకు కేసీఆర్ వచ్చే వరకు మైక్ పట్టుకునే ధైర్యం కూడా చేయలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఆర్పుకోవడమే కాకుండా.. ఢిల్లీలో కూడా ఆర్పేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!