Jupally Krishna Rao: కేసీఆర్ మళ్ళీ రావాలని కొందరు అంటున్నారు.. వస్తే అప్పులు చేయడానికా..?
- మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపాటు
- తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ఉంది.. వందల మంది ప్రాణాల త్యాగం లేదా..?
- రాజకీయంగా దెబ్బతింటాం అని తెలిసి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ
- తెలంగాణ ఏర్పాటులో ఎవరి పాత్ర వాళ్లకు ఉంది- మంత్రి
- కేసీఆర్ మళ్ళీ రావాలని కొందరు కోరుకుంటున్నారు- జూపల్లి కృష్ణారావు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది.. వందల మంది ప్రాణాల త్యాగం లేదా..? అని ప్రశ్నించారు. రాజకీయంగా దెబ్బతింటాం అని తెలిసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.. తెలంగాణ ఏర్పాటులో ఎవరి పాత్ర వాళ్లకు ఉందని అన్నారు. కేసీఆర్ మళ్ళీ రావాలని కొందరు కోరుకుంటున్నారు.. 10 ఏళ్ల తర్వాత కూడా నిరుద్యోగ సమస్య ఎందుకు ఉందని దుయ్యబట్టారు. ధనిక రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పు ఎలా అయ్యింది..? నెలకు రూ.6500 కోట్లు ఈఎంఐలు కడుతున్నామని తెలిపారు. ఇదేనా గొప్ప పాలన.. కేసీఆర్ మళ్ళీ వస్తే.. రూ.20 వేల కోట్ల అప్పులు చేసి పెడతారని విమర్శించారు.
Read Also: Council Chairman: కేటీఆర్ రైతు దీక్షపై గుత్తా సుఖేందర్ కౌంటర్..
Also Read
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Veggie Frittata Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. లంచ్ బాక్స్లోకి కమ్మని 'వెజ్జీ ఫ్రిటాటా'.. తింటే పిల్లలు అస్సలు వదలరు!
- West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
కేసీఆర్ శాసన సభకి రావడం లేదు.. కన్న తల్లితండ్రులను చంపి.. జడ్జి ముందు తల్లితండ్రులు లేని అనాధని అన్నట్టు కేటీఆర్ మాట్లాడుతున్నాడని మంత్రి జూపల్లి విమర్శించారు. కేటీఆర్కి సిగ్గుండాలి.. సర్పంచుల బిల్లులు ఇవ్వట్లేదు అని అనడానికి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. బకాయి పెట్టింది ఎవరు..? మీరు చేసిన అప్పులు కట్టడానికి.. అప్పు తేవాల్సి వస్తుందని అన్నారు. ప్రజలు తెలివైన వాళ్ళు.. అమాయకులు కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
Read Also: Realme: పిచ్చెక్కించే ఫీచర్లతో మార్కెట్ లోకి రియల్మి P3 సిరీస్ విడుదల.. ధర ఎంతంటే?
కృష్ణా వాటర్ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కి లేదని మంత్రి ఆరోపించారు. 511 టీఎంసీ ఏ లెక్క ప్రకారం ఆంధ్రాకు ఇచ్చారు.. ఆంధ్రాకు 511 టీఎంసీలు ఇచ్చి.. వాళ్లకు న్యాయబద్ధత కల్పించారని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే దానిపై పోరాటం చేస్తే కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చిందని తెలిపారు. కేసీఆర్ హయంలో నాలుగు స్తంభాల ఆట నడిచింది.. కుటుంబ పాలనే అని ఆరోపించారు. మీటింగులకు కేసీఆర్ వచ్చే వరకు మైక్ పట్టుకునే ధైర్యం కూడా చేయలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఆర్పుకోవడమే కాకుండా.. ఢిల్లీలో కూడా ఆర్పేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
తాజావార్తలు
-
Shruti Haasan : హీరోయిన్గా కంటే ఐటంగర్ల్గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి
-
AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
-
Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్పై స్పందించిన హోల్డర్!
-
Veggie Frittata Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. లంచ్ బాక్స్లోకి కమ్మని ‘వెజ్జీ ఫ్రిటాటా’.. తింటే పిల్లలు అస్సలు వదలరు!
-
May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!