Mohammad Kaif: టీ20 వరల్డ్ కప్లో టీమిండియా పరిస్థితి గందరగోళంలో పడింది. సేమీస్కు చేరుకోలదా? అనే సదేహం అందరిలో మొదలైంది. నేడు వెస్టిండీస్తో భారత జట్టు తలపడనుంది. సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి, తర్వాత వెస్టిండీస్ జింబాబ్వేపై భారీ విజయం సాధించడం టీమిండియా చాలా అవసరం. ఈ రెండు మ్యాచ్లు గెలిచినా భారత జట్టు సేమీస్కు చేరుకుంటుందని పూర్తిగా చెప్పలేం. అయితే.. జట్టు పరిస్థితులు కెప్టెన్సీల అంశం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. తాజాగా భారత్ మాజీ ఆటగాడు మొహమ్మద్ కైఫ్ జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు చేశాడు. సూపర్ 8లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్కు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ను తప్పించడం జట్టు ప్రణాళికలో లోపాలను చూపిస్తోందని అన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ లాంటి కెప్టెన్లు ఎప్పుడూ అన్ని విభాగాలను కవర్ చేసే ఒక స్థిరమైన ప్లేయింగ్ ఎలెవన్ను తయారు చేసేవారని గుర్తుచేశాడు. ప్రత్యర్థి జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఎక్కువగా ఉన్నారని చెబుతూ.. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ను బయటకు పెట్టడం సరైన నిర్ణయం కాదని వెల్లడించాడు.
READ MORE: Rakul: ఆ విషయంలో.. ఆడియన్స్ని మోసం చేయలేను..
2024 టీ20 వరల్డ్కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవుతూ జానీ బెయిర్స్టో, జోస్ బట్లర్, మొయిన్ అలీ వంటి కీలక వికెట్లు తీసిన విషయాన్ని కైఫ్ గుర్తుచేశాడు. మొయిన్ అలీ ఎడమచేతి బ్యాటరేనని, అయినప్పటికీ అక్షర్ అతన్ని ఔట్ చేశాడని వివరించాడు. ఒక ఆటగాడిని నమ్మకం పెట్టుకుని ఆడిస్తే ఏదైనా చేయగలడని వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికా తరఫున కేశవ్ మహారాజ్ వికెట్లు తీసిన ఉదాహరణను సైతం ప్రస్తావించాడు. ఐసీసీ టోర్నీల్లో అక్షర్ పటేల్ మ్యాచ్ విన్నర్ అని, 2024 ఫైనల్లో కీలక క్యామియో వల్లే భారత్ గెలిచిందని కైఫ్ వివరించాడు. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ స్ట్రైక్రేట్ 128 ఉండగా అక్షర్ స్ట్రైక్రేట్ 150తో నాలుగు సిక్సర్లు కొట్టాడని గుర్తుచేశాడు. సెమీఫైనల్, ఫైనల్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాడిని పక్కన పెట్టడం ఆశ్చర్యంగా ఉందని అన్నాడు. చివరి నిమిషంలో మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్లే జట్టు ఒత్తిడిలో పడిందని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
READ MORE: Maoist Party: నక్సలిజం ఉద్యమ చరిత్రలో బిగ్ ట్విస్ట్! నేటితో మావోయిస్టు పార్టీకి ఎండ్ కార్డ్..?