Jogi Ramesh: పవన్ కల్యాణ్కు కనీసం ఏపీలో ఓటు ఉందా?.. మేం కూడా లెటర్ రాయబోతున్నాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గృహ నిర్మాణల భూ సేకరణలో అవినీతి జరిగినట్లు ప్రధానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాయడంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు కొట్టేసిన స్కిల్ స్కాంలో పవన్ కల్యాణ్కు ఎంత ముట్టిందో విచారణ చేయమని తాము కూడా లెటర్ రాయబోతున్నామన్నారు. మనీ లాండరింగ్ ఎలా జరిగిందో విచారణ జరిపించాలని కోరతామని, ఆ ప్రభుత్వంలో పవన్ కూడా భాగస్వామే అని జోగి రమేష్ తెలిపారు.
తాడేపల్లిలో మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ… ‘గృహ నిర్మాణల భూ సేకరణలో అవినీతి జరిగినట్లు ప్రధానికి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. సీబీఐ, ఈడీ విచారణ కోరారు. 30 లక్షల మహిళలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి.. ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన 13 అంశాలకు సమాధానాలను మీడియా ద్వారా అందజేస్తున్నాం. పవన్ కల్యాణ్కు ఆంధ్రప్రదేశ్ డోర్ నెంబర్ ఉందా?, కనీసం ఏపీలో ఓటు ఉందా? లేదా ఆధార్ కార్డ్ ఉందా?. చంద్రబాబు ఇచ్చే డబ్బుల కోసం ఏ గడ్డి అయినా కరవటానికి సిద్ధంగా ఉన్నారు’ అని అన్నారు.
Also Read
- NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
‘మేం కూడా లెటర్ రాయబోతున్నాం. చంద్రబాబు కొట్టేసిన స్కిల్ స్కాంలో పవన్ కల్యాణ్కు ఎంత ముట్టిందో విచారణ చేయమని లేఖ రాస్తాం. మనీ లాండరింగ్ ఎలా జరిగిందో విచారణ జరిపించాలని కోరతాం. చంద్రబాబు స్కిల్ స్కాంపై విచారణ చేయమని ఎందుకు లేఖ రాయలేదు?. పేదలకు మూడు సెంట్ల స్థలం ఇస్తామని హామి ఇచ్చాం.. ఎందుకు నెరవేర్చ లేదు అని చంద్రబాబును ప్రశ్నించావా?. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వంలో పవన్ కూడా భాగస్వామి కదా. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లులు ఇస్తుంటే ఎందుకు మీకు అంత కడుపుమంట?. ప్రతి గ్రామాన్ని జగన్ అభివృద్ధి చేస్తుంటే.. ప్రధానికి లేఖ రాస్తాడట. చంద్రబాబు, లోకేష్ దోచుకున్న డబ్బుల మీద లేఖ రాయి’ అని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు.
Also Read: Leopard in Srisailam: శ్రీశైలంలో చిరుతపులి సంచారం.. భయాందోళనలో స్థానికులు, భక్తులు!
‘ఆ పాపంలో పవన్ కల్యాణ్కు భాగస్వామ్యం ఉంది. వీరి పాపం పండింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు?, ఫ్రీ బస్సు ప్రయాణం ఎందుకు ఇవ్వలేదు. ప్రజలు ఆ గ్యాస్ సిలెండర్ పట్టుకునే కొడతారు. ఎంత మంది ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ ఆపలేరు’ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు.
- Tags
- ap
- janasena
- Jogi Ramesh
- pawan kalyan
- tdp
తాజావార్తలు
-
NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
-
Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
-
Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..