Jagadish Reddy : ఈ రోజు ధర్మమే గెలిచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండు నెలలుగా ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చ జరిగింది. అయితే.. ఎట్టకేలకు ఈ నెల 3న మునుగోడు మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ జరుగగా.. నేడు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. ఇప్పటికే 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగగా.. 2,3,4 రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యం కనబరిచారు. అయితే.. ప్రస్తుతం 15వ రౌండ్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. దాదాపు తమ అభ్యర్థి కూసుకుంట్ల గెలుపు ఖాయమైందని టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే.. దీంతో.. కౌంటింగ్ కేంద్రం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్లను టీఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురిచేశారన్నారు. అంతేకాకుండ.. కేసీఆర్ అక్రమ సంపాదనకు సీపీఎం, సీపీఐ నేతలు అమ్ముడుపోయారని వారి ఓట్లతోనే గెలిచారన్నారు.
Also Read : Harish Rao : కేసీఆర్ వెంటే తెలంగాణ ప్రజలు
అయితే.. తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఇకనైనా శిఖండి రాజకీయాలు మానుకోవాలన్నారు. మునుగోడుకు సంబంధంలేని వాళ్లను తీసుకువచ్చి ఓటర్లకు మద్యం, డబ్బు సరఫరా చేశారని.. అయినప్పటికీ మునుగోడు ప్రజలు చైతన్యవంతంగా టీఆర్ఎస్ను గెలిపించారన్నారు. మునుగోడు నుంచే బీజేపీ పతనం మొదలుకావాలని వామపక్షాలు కలిసివచ్చాయని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రజలు ఓటేసి టీఆర్ఎస్ను గెలిపించారని, ఈ రోజు ధర్మమే గెలిచిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం మరోసారి రుజువైందని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.
Also Read
- AP High Court: విశాఖ డేటా సెంటర్పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
- Off The Record: కొండా సురేఖ వివాదంపై మంత్రి సీతక్క మౌనం..!!
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
-
OTR: దువ్వాడ శ్రీనివాస్ అడుగులు మళ్లీ వైసీపీ వైపు పడుతున్నాయా..?
-
AP High Court: విశాఖ డేటా సెంటర్పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
-
Off The Record: కొండా సురేఖ వివాదంపై మంత్రి సీతక్క మౌనం..!!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!