Jagadish Reddy : ఈ రోజు ధర్మమే గెలిచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండు నెలలుగా ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చ జరిగింది. అయితే.. ఎట్టకేలకు ఈ నెల 3న మునుగోడు మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ జరుగగా.. నేడు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. ఇప్పటికే 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగగా.. 2,3,4 రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యం కనబరిచారు. అయితే.. ప్రస్తుతం 15వ రౌండ్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. దాదాపు తమ అభ్యర్థి కూసుకుంట్ల గెలుపు ఖాయమైందని టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే.. దీంతో.. కౌంటింగ్ కేంద్రం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్లను టీఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురిచేశారన్నారు. అంతేకాకుండ.. కేసీఆర్ అక్రమ సంపాదనకు సీపీఎం, సీపీఐ నేతలు అమ్ముడుపోయారని వారి ఓట్లతోనే గెలిచారన్నారు.
Also Read : Harish Rao : కేసీఆర్ వెంటే తెలంగాణ ప్రజలు
అయితే.. తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఇకనైనా శిఖండి రాజకీయాలు మానుకోవాలన్నారు. మునుగోడుకు సంబంధంలేని వాళ్లను తీసుకువచ్చి ఓటర్లకు మద్యం, డబ్బు సరఫరా చేశారని.. అయినప్పటికీ మునుగోడు ప్రజలు చైతన్యవంతంగా టీఆర్ఎస్ను గెలిపించారన్నారు. మునుగోడు నుంచే బీజేపీ పతనం మొదలుకావాలని వామపక్షాలు కలిసివచ్చాయని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రజలు ఓటేసి టీఆర్ఎస్ను గెలిపించారని, ఈ రోజు ధర్మమే గెలిచిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం మరోసారి రుజువైందని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.
Also Read
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
తాజావార్తలు
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..