Minister Sandhya Rani: దేశ విదేశాల్లో అరకు కాఫీ ప్రమోట్.. రాష్ట్ర వ్యాప్తంగా చైన్ షాపులు..!
- అరకు కాఫీపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు..
- జీసీసీ ద్వారా అరకు కాఫీ చైన్ షాపులు పెడతాం..
- అరకు కాఫీని దేశ విదేశాల్లో ప్రమోట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తాం..
Minister Sandhya Rani: అరకు కాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. అరకు కాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చైన్ షాపులు పెట్టబోతున్నాం.. జీసీసీ ద్వారా అరకు కాఫీ చైన్ షాపులు పెడతాం అన్నారు. అరకు కాఫీని గత టీడీపీ ప్రభుత్వం బ్రాండింగ్ చేసి.. ప్రమోట్ చేసింది. ఇప్పుడూ అదే తరహాలో అరకు కాఫీని మా ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది. అరకు కాఫీని దేశ విదేశాల్లో ప్రమోట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తాం అని వెల్లడించారు. ఇక, నెలకోసారి గిరిజన హాస్టళ్లల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. గత ప్రభుత్వం పెండింగ్ బిల్లులు పెట్టడం వల్ల పనులు చాలా వరకు జరగలేదు. 554 ట్రైబెల్ స్కూళ్లల్లో ఏఎన్ఎంలను డెప్యూటేషన్ మీద నియమిస్తున్నాం. ఫీడర్ అంబులెన్స్, తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్ వంటి సేవలను పునరుద్దరిస్తున్నాం. హాస్టళ్లల్లో స్టడీ అవర్స్ తిరిగి ప్రారంభిస్తాం అని పేర్కొన్నారు.
Read Also: Asaduddin Owaisi: ఓవైసీ ప్రమాణస్వీకారం.. లోక్సభలో దుమారం..
Also Read
- SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
మెగా డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయ్యే పోస్టుల్లో 2 వేలకు పైగా పోస్టులు గిరిజన స్కూళ్లల్లోనే ఉన్నాయని తెలిపారు మంత్రి సంధ్యారాణి.. గిరిజన ప్రాంతాల్లో గత ప్రభుత్వం రేషన్ డిపోలను రద్దు చేసింది. గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలను తిరిగి ప్రారంభించే అంశంపై కసరత్తు చేస్తున్నాం. జీసీసీ ద్వారా నిర్వహించే సంస్ధలను.. ఉత్పత్తులను మరింత ప్రోత్సహిస్తాం అన్నారు. ఇకపై గిరిజన విద్యార్థుల మరణాలు ఉండకూడదని అధికారులను ఆదేశించాం.. పౌష్టికాహారం అందక గిరిజన పిల్లలు చనిపోకూడదు. గిరిజన బాలికల హాస్టళ్లల్లో మహిళ వార్డెన్లనే నియమిస్తాం. గిరిజన హాస్టళ్లల్లో కంప్లైంట్ బాక్సులు పెడతామన్నారు.
Read Also: Fire Accident: జూబ్లీహిల్స్లో భారీ అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన ఉద్యోగులు
ఇక, గంజాయి వల్ల ఎక్కువగా పిల్లలు, ఆడపిల్లలే బాధితులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు సంధ్యారాణి.. గంజాయి మత్తులో ఏం చేస్తున్నామో తెలియని విధంగా దారుణాలు చేస్తున్నారు. దీంతో.. గిరిజన ప్రాంతాల్లో గంజాయి కట్టడికి చెక్ పోస్టులు పెట్టాలని ఆదేశించాం. గిరిజన ప్రాంతాల్లో తాగు నీటి సౌకర్యం కల్పించాలని ఐటీడీఏలకు ఆదేశాలిచ్చాం. మరోవైపు.. మైదాన ప్రాంతాల్లోని గిరిజనులకు ఇళ్ల నిర్మాణం చేపడతాం అన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.
తాజావార్తలు
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
-
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!