Gottipati Ravi Kumar: మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించం.. తప్పుడు ప్రచారం తగదు!
- వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించం
- పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు
- రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో కూడా రైతులకు స్మార్ట్ బిగించటం లేదని చాలాసార్లు చెప్పామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల నుంచి తగ్గిస్తున్నామని ప్రచారం పెట్టారని, ఇందులో నిజం లేదన్నారు. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబును చూసి ఏపీలో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.
‘కూటమి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను తీసుకువస్తోంది. సీఎం చంద్రబాబును చూసి ఏపీలో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. పెండింగ్లో ఉన్న ఉద్యోగుల పీఆర్సీ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తాం. సీఎం నుంచి ఉద్యోగుల పీఆర్సీపై ఓ మంచి వార్తను వింటామని ఆశిస్తున్నాం. గతంలో పలుసార్లు ఉద్యోగుల సమస్యలపై సీఎం స్పందించారు. విద్యుత్ ఉద్యోగులు ప్రాణాలను ఎదురొడ్డి ఉద్యోగం చేస్తారు. విద్యుత్ ఉద్యోగులు విపత్కర సమయాల్లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ప్రతీ యేటా ఆరు నుంచి ఏడు శాతం విద్యుత్ వినియోగదారులు పెరుగుతున్నారు’ అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
Also Read
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
Also Read: Davos Tour: దావోస్లో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన.. 15కు పైగా సమావేశాలతో బిజీబిజీ!
‘రైతులకు వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించటం లేదు. అసెంబ్లీలో కూడా రైతులకు స్మార్ట్ మీటర్లు బిగించటం లేదని చాలాసార్లు చెప్పాం. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల నుంచి తగ్గిస్తున్నామని ప్రచారం పెట్టారు, ఇందులో నిజం లేదు. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయ అవసరాల కోసం ఇలాంటి ప్రచారాలు రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు. ఏపీకి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. పవర్ రిఫార్మ్స్ లో కొత్త పెట్టుబడులు వస్తున్నాయి. చంద్రబాబు నాయకత్వంలో పరిశ్రమలు పెట్టేందుకు దావోస్ పర్యటనలో పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు’ అని మంత్రి గొట్టిపాటి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!