Gottipati Ravi Kumar: మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించం.. తప్పుడు ప్రచారం తగదు!
- వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించం
- పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు
- రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో కూడా రైతులకు స్మార్ట్ బిగించటం లేదని చాలాసార్లు చెప్పామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల నుంచి తగ్గిస్తున్నామని ప్రచారం పెట్టారని, ఇందులో నిజం లేదన్నారు. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబును చూసి ఏపీలో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.
‘కూటమి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను తీసుకువస్తోంది. సీఎం చంద్రబాబును చూసి ఏపీలో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. పెండింగ్లో ఉన్న ఉద్యోగుల పీఆర్సీ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తాం. సీఎం నుంచి ఉద్యోగుల పీఆర్సీపై ఓ మంచి వార్తను వింటామని ఆశిస్తున్నాం. గతంలో పలుసార్లు ఉద్యోగుల సమస్యలపై సీఎం స్పందించారు. విద్యుత్ ఉద్యోగులు ప్రాణాలను ఎదురొడ్డి ఉద్యోగం చేస్తారు. విద్యుత్ ఉద్యోగులు విపత్కర సమయాల్లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ప్రతీ యేటా ఆరు నుంచి ఏడు శాతం విద్యుత్ వినియోగదారులు పెరుగుతున్నారు’ అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
Also Read
- IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
Also Read: Davos Tour: దావోస్లో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన.. 15కు పైగా సమావేశాలతో బిజీబిజీ!
‘రైతులకు వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించటం లేదు. అసెంబ్లీలో కూడా రైతులకు స్మార్ట్ మీటర్లు బిగించటం లేదని చాలాసార్లు చెప్పాం. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల నుంచి తగ్గిస్తున్నామని ప్రచారం పెట్టారు, ఇందులో నిజం లేదు. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయ అవసరాల కోసం ఇలాంటి ప్రచారాలు రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు. ఏపీకి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. పవర్ రిఫార్మ్స్ లో కొత్త పెట్టుబడులు వస్తున్నాయి. చంద్రబాబు నాయకత్వంలో పరిశ్రమలు పెట్టేందుకు దావోస్ పర్యటనలో పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు’ అని మంత్రి గొట్టిపాటి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!