Botsa Satyanarayana: విద్యాశాఖపై మాట్లాడారు.. డిబెట్కి రండి.. బాలకృష్ణకు మంత్రి సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ చీపురుపల్లి, విజయనగరంలో పర్యటనలో మాట్లాడే తీరు చూశానని.. పేపర్లు ఇటుతిప్పి అటుతిప్పి మాట్లాడారని ఎద్దేవా చేశారు. అసలు భౌగోళిక పరిస్థితులపై అసలు అవగాహన ఉందా అని విమర్శించారు. బాలకృష్ణ విద్యాశాఖపై మాట్లాడారు.. డిబెట్ కి రండి అని మంత్రి బొత్స సవాల్ విసిరారు. కళ్లులేని కబోదికి ఏం తెలుస్తుంది ఆ విధంగా ఉంది ప్రసంగమని అన్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్ పరీక్షలకు తరఫీదు ఇస్తున్నాం.. మండలానికి పది ప్లస్ అప్ గ్రేడ్ చేశాం.. ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ ఇప్పించి.. డిజిటల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని తెలిపారు. ఎనిమిది తొమ్మిది తరగతులకు బైజూస్ ఇచ్చిన పాఠ్యాంశాలు ఇస్తున్నామన్నారు.
Thotapalli Madhu: దెబ్బకు దిగివచ్చిన నటుడు.. క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్
Also Read
- 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
- Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
దేశంలో మరెక్కడా లేని విధంగా విద్యను అందిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మూడో తరగతి నుంచి పన్నెండు సంవత్సరాలు ఐబీ కొలాబ్రేషన్ తో ఎలిజబుల్ సర్టిఫికెట్ లు ఇస్తున్నామన్నారు. వెయ్యి హైస్కూల్ సీబీఎస్ కనవర్ట్ చేసి… ఏపీలో జోన్ ఆఫీస్ ఏర్పాటు చేసి మానటరింగ్ చేస్తున్నామని చెప్పారు. సినిమాలలో గెంతుకున్న మీకు పేదవారి పరిస్థితి ఏం తెలుసని విమర్శించారు. మీ నాన్న, మీ బావా ఇద్దరూ ఏనాడైనా ఇలా చేశారా అని ప్రశ్నిచారు. రాబోయే ఏ కాంపిటేటివ్ పరీక్షలు వచ్చిన యాభై శాతం ఏపీ విద్యార్థులు ఉంటారని పేర్కొన్నారు. గతంలో డిగ్రీ పూర్తి చేస్తే.. తరువాత ఏం చెయ్యాలో తెలియని పరిస్థితులు ఉండేవన్నారు. విదేశీ విద్య కోసం అయిదో పదో లక్షలు ఇచ్చి పంపేవారని తెలిపారు. మెయింటనెన్స్ కోసం మళ్లీ అక్కడ ఏదో రెస్టారెంట్ లో పని చేసి బతుకీడ్చేవారని పేర్కొన్నారు.
Cartier: లక్షల విలువైన బంగారు ఆభరణాలను కేవలం రూ. 2 వేలకే కొన్న కస్టమర్.. మ్యాటరేంటంటే..
కానీ.. కోటి ఇరవై లక్షలు ప్రతి విద్యార్థిపై తమ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి చెప్పారు. ఎడెక్ష సంస్థతో హైయర్ ఎడ్యుకేషన్ ఒప్పందం కుదుర్చుకొని పన్నెండు వందల కోర్సులను అందిస్తున్నామన్నారు. చంద్రబాబుకు ఇలాంటి ఆలోచనలు రావు… వాడి మీదా వీడి మీదా ఆడిపోసుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాం.. దీంతో చాలా సీట్లు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. తండ్రి పేరు చెప్పుకు బ్రతికేవాడివి నువ్వు అని ఆరోపించారు. ప్రధాన మంత్రి మానిటరింగ్ కమిటీ, నీతీ ఆయోగ్ అందరూ ఈ విద్యా విధానాన్ని మెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఈ జిల్లాకి ఏ ప్రాజెక్టు అయినా తాము తీసుకొచ్చామని అన్నారు. టీడీపీ ఎన్నిక కమీషన్కు పెట్టిన పిటిషన్ వలన పింఛన్దారుల ఉసురు పోసుకుంటున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..