Botsa Satyanarayana: విద్యాశాఖపై మాట్లాడారు.. డిబెట్కి రండి.. బాలకృష్ణకు మంత్రి సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ చీపురుపల్లి, విజయనగరంలో పర్యటనలో మాట్లాడే తీరు చూశానని.. పేపర్లు ఇటుతిప్పి అటుతిప్పి మాట్లాడారని ఎద్దేవా చేశారు. అసలు భౌగోళిక పరిస్థితులపై అసలు అవగాహన ఉందా అని విమర్శించారు. బాలకృష్ణ విద్యాశాఖపై మాట్లాడారు.. డిబెట్ కి రండి అని మంత్రి బొత్స సవాల్ విసిరారు. కళ్లులేని కబోదికి ఏం తెలుస్తుంది ఆ విధంగా ఉంది ప్రసంగమని అన్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్ పరీక్షలకు తరఫీదు ఇస్తున్నాం.. మండలానికి పది ప్లస్ అప్ గ్రేడ్ చేశాం.. ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ ఇప్పించి.. డిజిటల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని తెలిపారు. ఎనిమిది తొమ్మిది తరగతులకు బైజూస్ ఇచ్చిన పాఠ్యాంశాలు ఇస్తున్నామన్నారు.
Thotapalli Madhu: దెబ్బకు దిగివచ్చిన నటుడు.. క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
దేశంలో మరెక్కడా లేని విధంగా విద్యను అందిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మూడో తరగతి నుంచి పన్నెండు సంవత్సరాలు ఐబీ కొలాబ్రేషన్ తో ఎలిజబుల్ సర్టిఫికెట్ లు ఇస్తున్నామన్నారు. వెయ్యి హైస్కూల్ సీబీఎస్ కనవర్ట్ చేసి… ఏపీలో జోన్ ఆఫీస్ ఏర్పాటు చేసి మానటరింగ్ చేస్తున్నామని చెప్పారు. సినిమాలలో గెంతుకున్న మీకు పేదవారి పరిస్థితి ఏం తెలుసని విమర్శించారు. మీ నాన్న, మీ బావా ఇద్దరూ ఏనాడైనా ఇలా చేశారా అని ప్రశ్నిచారు. రాబోయే ఏ కాంపిటేటివ్ పరీక్షలు వచ్చిన యాభై శాతం ఏపీ విద్యార్థులు ఉంటారని పేర్కొన్నారు. గతంలో డిగ్రీ పూర్తి చేస్తే.. తరువాత ఏం చెయ్యాలో తెలియని పరిస్థితులు ఉండేవన్నారు. విదేశీ విద్య కోసం అయిదో పదో లక్షలు ఇచ్చి పంపేవారని తెలిపారు. మెయింటనెన్స్ కోసం మళ్లీ అక్కడ ఏదో రెస్టారెంట్ లో పని చేసి బతుకీడ్చేవారని పేర్కొన్నారు.
Cartier: లక్షల విలువైన బంగారు ఆభరణాలను కేవలం రూ. 2 వేలకే కొన్న కస్టమర్.. మ్యాటరేంటంటే..
కానీ.. కోటి ఇరవై లక్షలు ప్రతి విద్యార్థిపై తమ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి చెప్పారు. ఎడెక్ష సంస్థతో హైయర్ ఎడ్యుకేషన్ ఒప్పందం కుదుర్చుకొని పన్నెండు వందల కోర్సులను అందిస్తున్నామన్నారు. చంద్రబాబుకు ఇలాంటి ఆలోచనలు రావు… వాడి మీదా వీడి మీదా ఆడిపోసుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాం.. దీంతో చాలా సీట్లు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. తండ్రి పేరు చెప్పుకు బ్రతికేవాడివి నువ్వు అని ఆరోపించారు. ప్రధాన మంత్రి మానిటరింగ్ కమిటీ, నీతీ ఆయోగ్ అందరూ ఈ విద్యా విధానాన్ని మెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఈ జిల్లాకి ఏ ప్రాజెక్టు అయినా తాము తీసుకొచ్చామని అన్నారు. టీడీపీ ఎన్నిక కమీషన్కు పెట్టిన పిటిషన్ వలన పింఛన్దారుల ఉసురు పోసుకుంటున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!