Botsa Satyanarayana: విద్యాశాఖపై మాట్లాడారు.. డిబెట్కి రండి.. బాలకృష్ణకు మంత్రి సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ చీపురుపల్లి, విజయనగరంలో పర్యటనలో మాట్లాడే తీరు చూశానని.. పేపర్లు ఇటుతిప్పి అటుతిప్పి మాట్లాడారని ఎద్దేవా చేశారు. అసలు భౌగోళిక పరిస్థితులపై అసలు అవగాహన ఉందా అని విమర్శించారు. బాలకృష్ణ విద్యాశాఖపై మాట్లాడారు.. డిబెట్ కి రండి అని మంత్రి బొత్స సవాల్ విసిరారు. కళ్లులేని కబోదికి ఏం తెలుస్తుంది ఆ విధంగా ఉంది ప్రసంగమని అన్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్ పరీక్షలకు తరఫీదు ఇస్తున్నాం.. మండలానికి పది ప్లస్ అప్ గ్రేడ్ చేశాం.. ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ ఇప్పించి.. డిజిటల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని తెలిపారు. ఎనిమిది తొమ్మిది తరగతులకు బైజూస్ ఇచ్చిన పాఠ్యాంశాలు ఇస్తున్నామన్నారు.
Thotapalli Madhu: దెబ్బకు దిగివచ్చిన నటుడు.. క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్
Also Read
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
దేశంలో మరెక్కడా లేని విధంగా విద్యను అందిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మూడో తరగతి నుంచి పన్నెండు సంవత్సరాలు ఐబీ కొలాబ్రేషన్ తో ఎలిజబుల్ సర్టిఫికెట్ లు ఇస్తున్నామన్నారు. వెయ్యి హైస్కూల్ సీబీఎస్ కనవర్ట్ చేసి… ఏపీలో జోన్ ఆఫీస్ ఏర్పాటు చేసి మానటరింగ్ చేస్తున్నామని చెప్పారు. సినిమాలలో గెంతుకున్న మీకు పేదవారి పరిస్థితి ఏం తెలుసని విమర్శించారు. మీ నాన్న, మీ బావా ఇద్దరూ ఏనాడైనా ఇలా చేశారా అని ప్రశ్నిచారు. రాబోయే ఏ కాంపిటేటివ్ పరీక్షలు వచ్చిన యాభై శాతం ఏపీ విద్యార్థులు ఉంటారని పేర్కొన్నారు. గతంలో డిగ్రీ పూర్తి చేస్తే.. తరువాత ఏం చెయ్యాలో తెలియని పరిస్థితులు ఉండేవన్నారు. విదేశీ విద్య కోసం అయిదో పదో లక్షలు ఇచ్చి పంపేవారని తెలిపారు. మెయింటనెన్స్ కోసం మళ్లీ అక్కడ ఏదో రెస్టారెంట్ లో పని చేసి బతుకీడ్చేవారని పేర్కొన్నారు.
Cartier: లక్షల విలువైన బంగారు ఆభరణాలను కేవలం రూ. 2 వేలకే కొన్న కస్టమర్.. మ్యాటరేంటంటే..
కానీ.. కోటి ఇరవై లక్షలు ప్రతి విద్యార్థిపై తమ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి చెప్పారు. ఎడెక్ష సంస్థతో హైయర్ ఎడ్యుకేషన్ ఒప్పందం కుదుర్చుకొని పన్నెండు వందల కోర్సులను అందిస్తున్నామన్నారు. చంద్రబాబుకు ఇలాంటి ఆలోచనలు రావు… వాడి మీదా వీడి మీదా ఆడిపోసుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాం.. దీంతో చాలా సీట్లు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. తండ్రి పేరు చెప్పుకు బ్రతికేవాడివి నువ్వు అని ఆరోపించారు. ప్రధాన మంత్రి మానిటరింగ్ కమిటీ, నీతీ ఆయోగ్ అందరూ ఈ విద్యా విధానాన్ని మెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఈ జిల్లాకి ఏ ప్రాజెక్టు అయినా తాము తీసుకొచ్చామని అన్నారు. టీడీపీ ఎన్నిక కమీషన్కు పెట్టిన పిటిషన్ వలన పింఛన్దారుల ఉసురు పోసుకుంటున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!