Balineni Srinivas : ప్రజలకు మంచి జరగాలనే విశాఖలో క్యాపిటల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ మొదటి నుంచి విజన్ ముందుకు వెళ్లే నాయకుడని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విశాఖ సమ్మిట్తో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని చెప్పారు. ఏపీలో పెట్టుబడి పెట్టేవాళ్లు లేరంటూ ప్రచారం చేసేవారికి చెంపపెట్టులా విశాఖ సమ్మిట్ నిర్వహించి చూపించారని తెలిపారు. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను క్యాపిటల్గా ఎంచుకున్నారని వివరించారు. సీఎం జగన్ ఓ విజన్తో ముందుకు వెళ్లే నాయకుడన్నారు మంత్రి బాలినేని. ఆంధ్రప్రదేశ్లో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ముకేష్ అంబానీ లాంటి బడా వ్యాపారవేత్తలు.. ముందుండి విశాఖ సమ్మిట్ను విజయవంతం చేశారన్నారు మంత్రి బాలినేని.
Also Read : Inter Student Heart Attack: అసలు ఏమవుతుందిరా.. గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ పెట్టుబడుల వల్ల రాష్ట్రం లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. విశాఖ ఇన్వెస్టర్స్ సదస్సుపై అవాక్కులు పేలుతున్న వారు.. గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని అన్నారు మంత్రి బాలినేని. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే విశాఖపట్నంను రాజధానిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాన్ని మరింత వేగంగా డెవలప్ చేయవచ్చన్నారు. అమరావతి లాంటి ప్రాంతం అభివృద్ధి చేయాలంటే.. లక్షల కోట్ల రూపాయిలు కావాలన్నారు మంత్రి బాలినేని. రాజధాని విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ప్రజలకు అర్థమైందని చెప్పారు మంత్రి బాలినేని.
Also Read : Aadi Srinivas : చేతకాని చెన్నమనేని తీరుతో వేములవాడ వెనుకబడింది
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!