TTD: సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం: మంత్రి ఆనం
- శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఆనం
- భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు
- ప్రసాదాల నాణ్యత బాగా పెరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీవారికి సమర్పించే ప్రసాదాల నాణ్యత బాగా పెరిగిందన్నారు. 5400 ఆలయాలకు ధూప దీప నైవేద్యాలకు అందజేసే రూ.5 వేల రూపాయలను రూ.10 వేలకు పెంచామన్నారు. ప్రతి నెల తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులును పరిశిలిస్తాను అని మంత్రి ఆనం చెప్పుకొచ్చారు.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో మంత్రి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం అన్నవితరణ కేంద్రం వద్ద ఫిర్యాదుల పుస్తకాలను తనిఖీ చేశారు. సౌకర్యాలు బాగున్నాయని ఫిర్యాదుల పుస్తకంలో భక్తులు రాశారని చెప్పారు. తిరుమలను ప్రక్షాళన చేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు ఇంకా అభివృద్ధి చేయాలని మంత్రి ఆనం పేర్కొన్నారు.
Also Read
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
- IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
- Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
Also Read: Ram Gopal Varma: ఏపీ హైకోర్టులో రామ్గోపాల్ వర్మ మరో పిటిషన్!
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ…’అన్నవితరణ కేంద్రం వద్ద ఫిర్యాదుల పుస్తకాలను తనిఖీ చేశా. తిరుమలలో సౌకర్యాలు బాగున్నాయని ఫిర్యాదుల పుస్తకంలో భక్తులు రాశారు. చాలా సంతోషంగా అనిపించింది. తిరుమలను ప్రక్షాళన చేయాలన్న సీఎం చంద్రబాబు ఆకాంక్ష మేరకు ఇంకా అభివృద్ధి చేయాలి. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీవారికి సమర్పించే ప్రసాదాల నాణ్యత బాగా పెరిగింది. 5400 ఆలయాలకు ధూప దీప నైవేద్యాలకు అందజేసే 5 వేల రూపాయలను 10 వేలకు పెంచాం. నూతన ఆలయాలకు కూడా ధూప దీప నైవేద్యాలు క్రింద 10 వేలు అందజేసే ప్రకియ ప్రారంభించాం. మఠాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలి. అక్కడ వ్యాపార కేంద్రాల మారితే చర్యలు తప్పవు. ప్రతి నెల తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులును పరిశిలిస్తా’ అని చెప్పారు.
తాజావార్తలు
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
-
Mark Zuckerberg: జుకర్బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..