KBR Park: మెట్రో మార్నింగ్ ఆఫర్.. కేబీఆర్ పార్క్ లో వాకింగ్కు వెళ్లే వారికి రాయితీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KBR Park: హైదరాబాద్ వాసులకు మెట్రో రైలు అధికారులు శుభవార్త అందించారు. కేబీఆర్ పార్కులో వాకింగ్ కు వెళ్లే వారి కోసం ఎల్ అండ్ టీ మెట్రో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య, రాత్రి 8 నుంచి 11.59 గంటల మధ్య మెట్రోలో ప్రయాణించే వారికి స్మార్ట్ కార్డ్పై 10 శాతం తగ్గింపును ప్రకటించింది. నగరంలో ఎక్కడి నుంచైనా మెట్రోలో ప్రయాణించి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద దిగే వారికి సూపర్ ఆవర్స్లో ఈ రాయితీ ఇస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. కేబీఆర్లోని పార్కులో ఉదయం, రాత్రి వేళల్లో వాకింగ్ చేసే వారికి ఈ ఆఫర్ ప్రత్యేకంగా వర్తిస్తుంది. చాలా మంది వాకింగ్ కు కేబీఆర్ వస్తుంటారని దీంతో ఈ ఆఫర్ ఉపయోగించుకోవాలని సూచించారు మెట్రో అధికారులు. అంతే కాకుండా.. ట్రాఫిక్ నియంత్రణ తగ్గించేందుకు ఆఫర్ ప్రకటించామని తెలిపింది. వాకర్స్ చాలా మంది కార్లు వేసుకుని వస్తుంటారని దాని వల్ల ఎక్కడ పార్కింగ్ చేయాలో సతమతమౌతుంటారని తెలిపారు. కాబట్టి కార్లు ఉపయోగించుకోకుండా వాకర్స్ అందరూ మెట్రోను ఉపయోగించుకోవాలని సూచించారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఉండదని తెలిపారు. ఇక కేబీఆర్ పార్క్ కు వాకింక్ కోసం వెళ్లేవారు ఈ ప్రత్యేక బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.
Read also: Jyothi Rai : జ్యోతి రాయ్ వయసు ఎంతో తెలుసా?.. ఇంత చిన్నదా?
Also Read
- Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- Nandamuri Tejaswini: డాన్స్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేసిన బాలకృష్ణ చిన్న కుమార్తె.. వీడియో వైరల్
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
కాగా.. సాధారణంగా మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయి. కానీ.. నూతన సంవత్సర వేడుకలు హైదరాబాద్ వాసులకు మెట్రో రైలు అధికారులు శుభవార్త అందించిన విషయం తెలిసిందే.. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు రైళ్లను నడపాలని మెట్రో రైలు నిర్ణయించింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో సేవలు నడుస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ వెల్లడించారు. చివరి రైలు ఆయా స్టేషన్ల నుంచి 12.15 నిమిషాలకు బయలుదేరుతుందని తెలిపారు. రెడ్, బ్లూ, గ్రీన్ లైన్లలో మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు నడుస్తాయని మెట్రో రైల్ ఎండీ తెలిపారు. అయితే ఈ సమయంలో మెట్రో రైలు సమయం పెంచినందున భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ప్రయాణికులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి, అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే..
Budget 2024 LIVE: పార్లమెంట్ ముందు నిర్మలమ్మ బడ్జెట్ పద్దు.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లైవ్ అప్డేట్స్
తాజావార్తలు
-
13 ఏళ్లకే ఐపీఎల్ ఎంట్రీ.. 23 మ్యాచ్ల్లోనే ప్రపంచ క్రికెట్ను షేక్ చేసిన Vaibhav Sooryavanshi రికార్డుల లిస్ట్ ఇదే..
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
-
Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
-
Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..