Mehbooba Mufti: అణ్వాయుధాలతో కాదు, శాంతికి తొలి అడుగు వేయాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehbooba Mufti: భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఒక బాధ్యతాయుత నాయకుడిగా ముందడుగు వేసి, యుద్ధం ఆపేందుకు ప్రయత్నించాలని ఆమె కోరారు. తాజాగా ముఫ్తీ ఎక్స్ ద్వారా చేసిన పోస్ట్లో.. ప్రస్తుత సమయంలో భారత్ తన నిజమైన శక్తిని అణ్వాయుధాల్లో కాకుండా, శాంతి సిపి అడుగుయవలిసిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Read Also: IND PAK War: భారత్ ముందు మనం నిలబడలేం.. పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ ఆవేదన!
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
అలాగే భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, జనాభా పరంగా అగ్ర దేశం, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న దేశం కాబట్టి తన మార్గాన్ని ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయించాలని ముఫ్తీ అన్నారు. అంతర్జాతీయ మద్దతు క్రమం తప్పక మారే స్వభావం ఉన్న నేపథ్యంలో భారత్ తన వైఖిరి ద్వారా శాంతిని నెలకొల్పడంలో ముందుండాలన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Read Also: Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తోంది.. భారత్ వెనక్కి తగ్గదు!
ఇంతకుముందు కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్-పాక్ ఘర్షణలో పరిమితమైన పాత్ర మాత్రమే వహిస్తామని పేర్కొనగా, తాజా పరిణామాల దృష్ట్యా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాకిస్తాన్ సైన్యాధిపతి అసిం మునీర్ను సంప్రదించి ఉద్రిక్తతలు తగ్గించాలంటూ విజ్ఞప్తి చేశారు. అలాగే, భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్తో కూడా రూబియో శనివారం మాట్లాడారు. ఇందుకు సంబంధించి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ప్రకటనలో భారత్, పాకిస్తాన్ ప్రత్యక్ష సంభాషణకు మార్గం వేసుకుని.. అపోహలకు తావు లేకుండా శాంతిని స్థాపించాల్సిన అవసరం ఉందని రూబియో పేర్కొన్నారు. అవసరమైతే అమెరికా మధ్యవర్తిత్వం కూడా అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!