Mehbooba Mufti: అణ్వాయుధాలతో కాదు, శాంతికి తొలి అడుగు వేయాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehbooba Mufti: భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఒక బాధ్యతాయుత నాయకుడిగా ముందడుగు వేసి, యుద్ధం ఆపేందుకు ప్రయత్నించాలని ఆమె కోరారు. తాజాగా ముఫ్తీ ఎక్స్ ద్వారా చేసిన పోస్ట్లో.. ప్రస్తుత సమయంలో భారత్ తన నిజమైన శక్తిని అణ్వాయుధాల్లో కాకుండా, శాంతి సిపి అడుగుయవలిసిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Read Also: IND PAK War: భారత్ ముందు మనం నిలబడలేం.. పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ ఆవేదన!
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
అలాగే భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, జనాభా పరంగా అగ్ర దేశం, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న దేశం కాబట్టి తన మార్గాన్ని ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయించాలని ముఫ్తీ అన్నారు. అంతర్జాతీయ మద్దతు క్రమం తప్పక మారే స్వభావం ఉన్న నేపథ్యంలో భారత్ తన వైఖిరి ద్వారా శాంతిని నెలకొల్పడంలో ముందుండాలన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Read Also: Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తోంది.. భారత్ వెనక్కి తగ్గదు!
ఇంతకుముందు కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్-పాక్ ఘర్షణలో పరిమితమైన పాత్ర మాత్రమే వహిస్తామని పేర్కొనగా, తాజా పరిణామాల దృష్ట్యా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాకిస్తాన్ సైన్యాధిపతి అసిం మునీర్ను సంప్రదించి ఉద్రిక్తతలు తగ్గించాలంటూ విజ్ఞప్తి చేశారు. అలాగే, భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్తో కూడా రూబియో శనివారం మాట్లాడారు. ఇందుకు సంబంధించి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ప్రకటనలో భారత్, పాకిస్తాన్ ప్రత్యక్ష సంభాషణకు మార్గం వేసుకుని.. అపోహలకు తావు లేకుండా శాంతిని స్థాపించాల్సిన అవసరం ఉందని రూబియో పేర్కొన్నారు. అవసరమైతే అమెరికా మధ్యవర్తిత్వం కూడా అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!