IND PAK War: భారత్ ముందు మనం నిలబడలేం.. పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ ఆవేదన!
- భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత
- పీసీబీ మాజీ ఛైర్మన్ సంచలన వ్యా్ఖ్యలు
- భారత్ ముందు మనదేశం నిలబడలేదని వ్యాఖ్యలు
- పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా ఉందన్న నజామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం.. పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మే 9 (శుక్రవారం) రాత్రి కూడా పాకిస్థాన్ భారతదేశంలోని అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్థాన్ సైన్యానికి చెందిన అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.
READ MORE: Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తోంది.. భారత్ వెనక్కి తగ్గదు!
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ ఛైర్మన్ నజామ్ సేథి ప్రకటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ చాలా దిగజారిందని, అంతర్జాతీయంగా భారత్ ముందు నిలబడలేమని నజామ్ సేథి అభిప్రాయపడ్డారు. అరబ్ దేశాలు కూడా భారతదేశానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాయని ఆందోళన చెందారు. ఓ పాకిస్థాన్ టీవీ లైవ్ షోలో నజామ్ మాట్లాడుతూ.. “మన దేశం బలహీనంగా మారింది. ప్రస్తుతం ప్రమాదకరమైన దశలో ప్రయాణిస్తున్నాం. మన అంతర్గత పరిస్థితి కూడా దిగజారింది. అమెరికా మనకు చేయూతనందించేందుకు నిరాకరిస్తోంది. ఆర్థిక వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లతో సంబంధాలు బాగా లేవు.” అని నజామ్ సేథి వ్యాఖ్యానించారు.
READ MORE: Pollution Report: భారత్కు స్వల్ప ఊరట.. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో అత్యంత దారుణం..!
భారతదేశం అంతర్గత పరిస్థితి కూడా బాగా లేదని, బంగ్లాదేశ్తో సంబంధాలు క్షీణించాయని యాంకర్ అడిగింది. నజామ్ సేథి యాంకర్ ప్రకటనను పూర్తిగా తిరస్కరించారు. “అంతర్జాతీయంగా భారత్ ఇప్పటికీ ఉనికిని కలిగి ఉంది. దురదృష్టవశాత్తు మనకు గుర్తింపులేదు. ప్రస్తుతం, విదేశీ పెట్టుబడులన్నీ భారతదేశానికే వెళ్తున్నాయి. అరబ్ ప్రపంచం భారత్కు మద్దతు ఇస్తుంది. సౌదీ అరేబియా, యూఏఈ బిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారతదేశం ఏ మాత్రం ఒంటరి కాదు. కానీ.. పాకిస్థాన్ ఒంటరిగా మారింది. భారత్ ముందు బంగ్లాదేశ్ చాలా చిన్నది.” అని పీసీబీ మాజీ ఛైర్మన్ నజామ్ సేథి ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..