IND PAK War: భారత్ ముందు మనం నిలబడలేం.. పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ ఆవేదన!
- భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత
- పీసీబీ మాజీ ఛైర్మన్ సంచలన వ్యా్ఖ్యలు
- భారత్ ముందు మనదేశం నిలబడలేదని వ్యాఖ్యలు
- పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా ఉందన్న నజామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం.. పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మే 9 (శుక్రవారం) రాత్రి కూడా పాకిస్థాన్ భారతదేశంలోని అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్థాన్ సైన్యానికి చెందిన అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.
READ MORE: Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తోంది.. భారత్ వెనక్కి తగ్గదు!
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ ఛైర్మన్ నజామ్ సేథి ప్రకటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ చాలా దిగజారిందని, అంతర్జాతీయంగా భారత్ ముందు నిలబడలేమని నజామ్ సేథి అభిప్రాయపడ్డారు. అరబ్ దేశాలు కూడా భారతదేశానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాయని ఆందోళన చెందారు. ఓ పాకిస్థాన్ టీవీ లైవ్ షోలో నజామ్ మాట్లాడుతూ.. “మన దేశం బలహీనంగా మారింది. ప్రస్తుతం ప్రమాదకరమైన దశలో ప్రయాణిస్తున్నాం. మన అంతర్గత పరిస్థితి కూడా దిగజారింది. అమెరికా మనకు చేయూతనందించేందుకు నిరాకరిస్తోంది. ఆర్థిక వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లతో సంబంధాలు బాగా లేవు.” అని నజామ్ సేథి వ్యాఖ్యానించారు.
READ MORE: Pollution Report: భారత్కు స్వల్ప ఊరట.. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో అత్యంత దారుణం..!
భారతదేశం అంతర్గత పరిస్థితి కూడా బాగా లేదని, బంగ్లాదేశ్తో సంబంధాలు క్షీణించాయని యాంకర్ అడిగింది. నజామ్ సేథి యాంకర్ ప్రకటనను పూర్తిగా తిరస్కరించారు. “అంతర్జాతీయంగా భారత్ ఇప్పటికీ ఉనికిని కలిగి ఉంది. దురదృష్టవశాత్తు మనకు గుర్తింపులేదు. ప్రస్తుతం, విదేశీ పెట్టుబడులన్నీ భారతదేశానికే వెళ్తున్నాయి. అరబ్ ప్రపంచం భారత్కు మద్దతు ఇస్తుంది. సౌదీ అరేబియా, యూఏఈ బిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారతదేశం ఏ మాత్రం ఒంటరి కాదు. కానీ.. పాకిస్థాన్ ఒంటరిగా మారింది. భారత్ ముందు బంగ్లాదేశ్ చాలా చిన్నది.” అని పీసీబీ మాజీ ఛైర్మన్ నజామ్ సేథి ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!