Amit Shah: ఏపీజే అబ్దుల్ కలాం ఇంటికి అమిత్ షా.. పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవితంపై రాసిన ‘మెమోరీస్ నెవర్ డై’ పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రామేశ్వరంలో ఆవిష్కరించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన అమిత్ షా రామనాథస్వామి ఆలయాన్ని కూడా సందర్శించారు. ఈ పుస్తకాన్ని ఏపీజేఎం నసీమా మరైక్యార్, శాస్త్రవేత్త వైఎస్ రాజన్లు రచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎల్.మురుగన్, తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై పాల్గొన్నారు. “ప్రధాని మోడీ నాయకత్వంలో మన విద్యార్థులకు, వారి స్టార్టప్లకు అంతరిక్ష శాస్త్రంలో అవకాశాలు తెరుచుకున్నాయి. అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించి అబ్దుల్ కలాం కల ప్రధాని కొత్త ఆవిష్కరణల వల్ల నెరవేరుతుందని నమ్ముతున్నాను.’ అని పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా అన్నారు.
Also Read: Manipur: మణిపూర్కు ప్రతిపక్ష ఎంపీలు.. రాజకీయాలు చేసేందుకు కాదంటూ వ్యాఖ్య
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
అబ్దుల్ కలాం రాసిన పుస్తకం ‘ఇండియా 2020: విజన్ ఫర్ ది న్యూ మిలీనియం’లో హైలైట్ చేసిన దేశాభివృద్ధికి సంబంధించిన రోడ్మ్యాప్ను ఆయన గుర్తు చేసుకున్నారు. “కలాం మూడు విషయాలు చెప్పారు – భారతదేశం తన సామర్థ్యాన్ని గుర్తించాలి, సాంకేతికత ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలి, వ్యవసాయం పరిశ్రమలు, నగరాలు, గ్రామాల మధ్య సమతుల్య వృద్ధిని నిర్ధారించాలి” అని అబ్దుల్ కలాం చెప్పినట్లు అమిత్ షా అన్నారు.
Also Read: Madhyapradesh: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుల ఇళ్లపై బుల్డోజర్ చర్యలు
రామేశ్వరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ఇంటికి కూడా హోంమంత్రి అమిత్ షా వెళ్లారు. అంతకుముందు రోజు రామేశ్వరం ఆలయాన్ని సందర్శించిన అమిత్ షా ట్విట్టర్లో ఇలా అన్నారు. “రామేశ్వరం ఆలయంలో హారతి, అభిషేకం నిర్వహించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. 12 జ్యోతిర్లింగాలలో, రాముడు శివుడిని పూజించిన ప్రదేశం ఇది. దేవాలయం సనాతన ధర్మం యొక్క ప్రాచీనతకు నిదర్శనం.” అని అమిత్ షా పేర్కొన్నారు. ప్రజలు, దేశ శ్రేయస్సు కోసం తాను ప్రార్థించానన్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి అమిత్ షా తమిళనాడుకు చేరుకున్నారు. శుక్రవారం ఆయన తమిళనాడు బీజేపీ చేపట్టిన ‘ఎన్ మన్, ఎన్ మక్కల్’ (నా భూమి నా ప్రజలు) పాదయాత్రను ప్రారంభించి, రామేశ్వరంలో ర్యాలీలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!