Amit Shah: ఏపీజే అబ్దుల్ కలాం ఇంటికి అమిత్ షా.. పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవితంపై రాసిన ‘మెమోరీస్ నెవర్ డై’ పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రామేశ్వరంలో ఆవిష్కరించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన అమిత్ షా రామనాథస్వామి ఆలయాన్ని కూడా సందర్శించారు. ఈ పుస్తకాన్ని ఏపీజేఎం నసీమా మరైక్యార్, శాస్త్రవేత్త వైఎస్ రాజన్లు రచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎల్.మురుగన్, తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై పాల్గొన్నారు. “ప్రధాని మోడీ నాయకత్వంలో మన విద్యార్థులకు, వారి స్టార్టప్లకు అంతరిక్ష శాస్త్రంలో అవకాశాలు తెరుచుకున్నాయి. అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించి అబ్దుల్ కలాం కల ప్రధాని కొత్త ఆవిష్కరణల వల్ల నెరవేరుతుందని నమ్ముతున్నాను.’ అని పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా అన్నారు.
Also Read: Manipur: మణిపూర్కు ప్రతిపక్ష ఎంపీలు.. రాజకీయాలు చేసేందుకు కాదంటూ వ్యాఖ్య
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
అబ్దుల్ కలాం రాసిన పుస్తకం ‘ఇండియా 2020: విజన్ ఫర్ ది న్యూ మిలీనియం’లో హైలైట్ చేసిన దేశాభివృద్ధికి సంబంధించిన రోడ్మ్యాప్ను ఆయన గుర్తు చేసుకున్నారు. “కలాం మూడు విషయాలు చెప్పారు – భారతదేశం తన సామర్థ్యాన్ని గుర్తించాలి, సాంకేతికత ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలి, వ్యవసాయం పరిశ్రమలు, నగరాలు, గ్రామాల మధ్య సమతుల్య వృద్ధిని నిర్ధారించాలి” అని అబ్దుల్ కలాం చెప్పినట్లు అమిత్ షా అన్నారు.
Also Read: Madhyapradesh: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుల ఇళ్లపై బుల్డోజర్ చర్యలు
రామేశ్వరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ఇంటికి కూడా హోంమంత్రి అమిత్ షా వెళ్లారు. అంతకుముందు రోజు రామేశ్వరం ఆలయాన్ని సందర్శించిన అమిత్ షా ట్విట్టర్లో ఇలా అన్నారు. “రామేశ్వరం ఆలయంలో హారతి, అభిషేకం నిర్వహించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. 12 జ్యోతిర్లింగాలలో, రాముడు శివుడిని పూజించిన ప్రదేశం ఇది. దేవాలయం సనాతన ధర్మం యొక్క ప్రాచీనతకు నిదర్శనం.” అని అమిత్ షా పేర్కొన్నారు. ప్రజలు, దేశ శ్రేయస్సు కోసం తాను ప్రార్థించానన్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి అమిత్ షా తమిళనాడుకు చేరుకున్నారు. శుక్రవారం ఆయన తమిళనాడు బీజేపీ చేపట్టిన ‘ఎన్ మన్, ఎన్ మక్కల్’ (నా భూమి నా ప్రజలు) పాదయాత్రను ప్రారంభించి, రామేశ్వరంలో ర్యాలీలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..