Ms Dhoni: ధోనీ క్రికెట్ అకాడమీలో స్కూల్ ప్రీమియర్ లీగ్.. రిజిస్ట్రేషన్స్ షూరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 టీ20 టోర్నీ జరుగుతుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని సిద్ధమయ్యాయి. ఎంఎస్డీసీఏ, బ్రైనియాక్స్ బీ, పల్లవి ఫౌండేషన్ సహకారంతో స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1ను నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ టీ20 ప్రీమియర్ లీగ్ బాయ్స్ అండర్-14, గర్ల్స్ అండర్-16 కేటగిరీల్లో జరుగనుంది. ఈ మేరకు హైదరాబాద్ వేదికగా నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోని ఎంఎస్డీసీఏ హైపెర్ఫామెన్స్ సెంటర్లోని 7H స్పోర్ట్స్ సంస్థ డైరెక్టర్ ప్రకటించారు.
Read Also: Amit Shah: ఏపీజే అబ్దుల్ కలాం ఇంటికి అమిత్ షా.. పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ప్రతిభావంతులైన క్రికెటర్లకు చేయూత అందించేందుకు ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ స్కూల్ లెవల్లో లీగ్ను నిర్వహిస్తున్నట్లు పల్లవి, డీపీఎస్ విద్యాసంస్థల సీఓఓ పేర్కొన్నారు. ప్రతిభవంతులైన క్రీడాకారులు సెలక్షన్ ట్రయల్స్ లో పాల్గొని, లీగ్లో ఆడే ఛాన్స్ అందిపుచ్చుకోవాలని తెలిపారు. లీగ్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన టాప్ ఐదుగురు ఆటగాళ్లకు పల్లవి ఫౌండేషన్ ద్వారా రూ.5 లక్షల విలువ గల స్కాలర్షిప్ ఇస్తామని చెప్పారు. మారుమూల ప్రాంతాలకు చెందిన టాలెంటెడ్ క్రికెటర్లను వెతికి వారిని ప్రోత్సహించేలనే లక్ష్యంతో ఈ లీగ్ ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఎంఎస్డీసీఏ అధీకృత భాగస్వామైన బ్రైనియాక్స్ బీ డైరెక్టర్ వెల్లడించారు.
Read Also: Viral News: ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే.. బాస్ అలా అన్నాడు..!
బాయ్స్ అండర్-14, గర్ల్స్ అండర్-16 కేటగిరీల్లో ఈ టీ20 స్కూల్ లీగ్ను జరుపుతున్నట్లు చెప్పారు. లీగ్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఐదుగురు క్రికెటర్లకు ఆరు నెలల పాటు హైదరాబాద్ లోని ధోని క్రికెట్ సెంటర్లలో ఉచిత శిక్షణ ఇస్తామని చెప్పుకొచ్చారు. ఈ లీగ్లో మొత్తం ఎనిమిది జట్లు తలపడనున్నాయి. ఫ్రాంచైజీ టీమ్ మోడల్లో లీగ్ జరుగనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ లీగ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి.. రిజిస్ట్రేషన్కు ఆఖరి తేదీ ఆగస్టు 17వ తేదీ కాగా.. ఆగస్టు 20న హైదరాబాద్లోని ఎంఎస్డీసీలో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 25న టీమ్ పేర్లు ప్రకటన, ట్రోఫీ, జెర్సీ ఆవిష్కరణ చేయనున్నారు. అయితే, ఆగస్టు 27 నుంచి లీగ్ స్టార్ట్ అవుతుందని నిర్వహకులు వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!