Ms Dhoni: ధోనీ క్రికెట్ అకాడమీలో స్కూల్ ప్రీమియర్ లీగ్.. రిజిస్ట్రేషన్స్ షూరు..!
ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 టీ20 టోర్నీ జరుగుతుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని సిద్ధమయ్యాయి. ఎంఎస్డీసీఏ, బ్రైనియాక్స్ బీ, పల్లవి ఫౌండేషన్ సహకారంతో స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1ను నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ టీ20 ప్రీమియర్ లీగ్ బాయ్స్ అండర్-14, గర్ల్స్ అండర్-16 కేటగిరీల్లో జరుగనుంది. ఈ మేరకు హైదరాబాద్ వేదికగా నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోని ఎంఎస్డీసీఏ హైపెర్ఫామెన్స్ సెంటర్లోని 7H స్పోర్ట్స్ సంస్థ డైరెక్టర్ ప్రకటించారు.
Read Also: Amit Shah: ఏపీజే అబ్దుల్ కలాం ఇంటికి అమిత్ షా.. పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ప్రతిభావంతులైన క్రికెటర్లకు చేయూత అందించేందుకు ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ స్కూల్ లెవల్లో లీగ్ను నిర్వహిస్తున్నట్లు పల్లవి, డీపీఎస్ విద్యాసంస్థల సీఓఓ పేర్కొన్నారు. ప్రతిభవంతులైన క్రీడాకారులు సెలక్షన్ ట్రయల్స్ లో పాల్గొని, లీగ్లో ఆడే ఛాన్స్ అందిపుచ్చుకోవాలని తెలిపారు. లీగ్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన టాప్ ఐదుగురు ఆటగాళ్లకు పల్లవి ఫౌండేషన్ ద్వారా రూ.5 లక్షల విలువ గల స్కాలర్షిప్ ఇస్తామని చెప్పారు. మారుమూల ప్రాంతాలకు చెందిన టాలెంటెడ్ క్రికెటర్లను వెతికి వారిని ప్రోత్సహించేలనే లక్ష్యంతో ఈ లీగ్ ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఎంఎస్డీసీఏ అధీకృత భాగస్వామైన బ్రైనియాక్స్ బీ డైరెక్టర్ వెల్లడించారు.
Read Also: Viral News: ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే.. బాస్ అలా అన్నాడు..!
బాయ్స్ అండర్-14, గర్ల్స్ అండర్-16 కేటగిరీల్లో ఈ టీ20 స్కూల్ లీగ్ను జరుపుతున్నట్లు చెప్పారు. లీగ్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఐదుగురు క్రికెటర్లకు ఆరు నెలల పాటు హైదరాబాద్ లోని ధోని క్రికెట్ సెంటర్లలో ఉచిత శిక్షణ ఇస్తామని చెప్పుకొచ్చారు. ఈ లీగ్లో మొత్తం ఎనిమిది జట్లు తలపడనున్నాయి. ఫ్రాంచైజీ టీమ్ మోడల్లో లీగ్ జరుగనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ లీగ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి.. రిజిస్ట్రేషన్కు ఆఖరి తేదీ ఆగస్టు 17వ తేదీ కాగా.. ఆగస్టు 20న హైదరాబాద్లోని ఎంఎస్డీసీలో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 25న టీమ్ పేర్లు ప్రకటన, ట్రోఫీ, జెర్సీ ఆవిష్కరణ చేయనున్నారు. అయితే, ఆగస్టు 27 నుంచి లీగ్ స్టార్ట్ అవుతుందని నిర్వహకులు వెల్లడించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో