Dangerous Virus: భారత్లో ఇన్ఫ్లూయెంజా పంజా.. H3N2 వైరస్తో ఇద్దరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two Died With H3N2 Influenza In India: కరోనా మహమ్మారి భయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో హెచ్ 3ఎన్ 3 వైరల్ ఇన్ ప్లుయోంజా మరోసారి గుబులు పుట్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ వైరస్ తో చాలా మంది ఆస్పత్రుల్లో చేరుతుండటం కొంత కలవరానికి గురి చేస్తోంది. ప్రాణాంతకం కాదనే నిపుణుల మాటలే ధైర్యాన్ని నింపుతున్న సందర్భంలో ఈ వైరస్ తో మరణాలు సంభవించాయన్న పిడుగు లాంటి వార్త ఇప్పుడు బయటకు వస్తుంది. కొన్ని ఉన్నత అధికారవర్గాల సమచారాం ప్రకారం.. హెచ్ 3ఎన్2 వైరస్ ఇన్ ప్లుయోంజాతో మన దేశంలో రెండు మరణాలు సంభవించాయి. కర్ణాటకలో, హర్యానాలో ఒక్కో మరణం సంభవించినట్లు ఆ వర్గాలు తెలిపారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో మార్చి 1వ తేదీన 82 ఏళ్ల హీరే గౌడ్ ఇన్ ప్లుయెంజాతో మరణించినట్లు తెలిపారు.
Summer : మార్చిలోనే 54డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత.. ఇక మే నెల వస్తే
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
దేశవ్యాప్తంగా సుమారు 90 హెచ్3ఎన్2 వైరస్ కేసులు రిపోర్ట్ అయినట్లు ఆ వర్గాలు వివరించాయి. ఎనిమిది హెచ్ 1ఎన్ 1 వైరస్ కేసులను గుర్తించినట్లు తెలిపాయి. కర్ణాటకలో తొలి ఇన్ ప్లుయెంజా మరణం చోటు చేసుకుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. కొవిడ్ తరహా లక్షణాలనే పోలిన ఈ ఇన్ ప్లుయెంజా కేసులు దేశవ్యాప్తంగా పెరిగాయి. ఒక వేవ్ తరహాలో చాలా ప్రాంతాలకు ఈ ఇన్ ప్లుయెంగా పాకింది. ఇందులో చాలా వరకు హెచ్3ఎన్2 వైరస్ కేసులే ఉన్నాయి. ఈ వైరస్ ను హాంగ్ కాంగ్ వైరస్ అని కూడా పిలుస్తున్నారు. ఇతర ఇన్ ప్లుయెంజా సబ్ టైపుల్లో ఈ హెచ్ 3ఎన్2 వైరస్ ఎక్కువ మందికి సోకుతు.. హస్పిటళ్ల పాలు చేస్తుంది.
Kim Jong Warning: యుద్ధానికి సిద్ధంకండి.. సైనిక డ్రిల్లో కిమ్ హాట్ కామెంట్స్
దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, ఊపిరి ఇబ్బందిగా తీసుకోవడం, జలుబు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, డయేరియా వంటి లక్షణాలు ఈ ఇన్ ప్లుయెంజా బారిన పడిన వారిలో కనపిస్తున్నాయి. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపించే సామర్థ్యం కలిగి ఉన్నదని నిపుణులు తెలిపారు. దగ్గు, స్నీజింగ్, సన్నిహితంగా మెలగడం ద్వారా ఈ వైరస్ సులభంగా వ్యాపించే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. హెచ్3ఎన్2 వైరస్ ఇతర సబ్ టైప్ ల కంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటుందని.. అందుకే ఈ వైరస్ సోకడంతో చాలా మంది హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడైంది. గత రెండు.. మూడు నెలలుగా భారత్ లో వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్ ప్లుయెంజా సోకిన వారిలో దగ్గు, జ్వరం దీర్ఘకాలం కొనసాగుతున్నాయని వివరించారు. దీర్ఘకాలం ఈ లక్షణాలు ఉంటున్నాయని పేషెంట్లు చెబుతున్నారు.
Husband Escaped: ట్రాఫిక్లో భార్యని వదిలి భర్త పరార్.. తెరవెనుక ఇంత తతంగమా?
ఈ ఇన్ ప్లుయెంజా నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతున్నదని ఓ డాక్టర్ తెలిపారు. ఈ వైరస్ లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని.. అది దీర్ఘకాలం కొనసాగుతుందని అన్నారు. అంతేకాదు.. పేషెంట్ రికవరీ అయిన కొందరిలో ఈ లక్షణాలు ఉంటున్నాయని వెల్లడించారు. అయితే ఇది ప్రాణాంతకరమైనదేమీ కాదని క్లినికల్ ట్రయల్ స్పెషలిస్ట్ డాక్టర్లు పేర్కొంటున్నారు. కానీ, శ్వాసకోస సంబంధ సమస్యలతో పలువురు పేషెంట్లు ఆస్పత్రుల్లో చేరుతున్నారి వివరించారు. కొన్ని లక్షణాలు చాలా వరకు కొవిడ్ ను పోలి ఉంటున్నాయని క్లారిటీ ఇచ్చారు. ఈ వైరస్ బారిన పడి తమ వద్దకు వచ్చిన పేషెంట్లకు కరోనా నెగిటివ్ అని వచ్చిందని వైద్యులు వెల్లడించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!