Sumalatha: ప్రధాని మోదీకే నా ఫుల్ సపోర్ట్.. బీజేపీకి సినీనటి, ఎంపీ సుమలత మద్దతు
Mandya MP Sumalatha extends ‘full support’ to BJP: ప్రముఖ సినీనటి, ఎంపీ సుమలత అంబరీష్ బీజేపీ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఆమె మాండ్యా లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోదీ కర్ణాకటక పర్యటనకు వెళ్లనున్నారు. మైసూరు-బెంగళూర్ 10 వరసల ఎక్స్ప్రెస్వేను ప్రారంభించేందుకు మాండ్యా వెళ్లనున్నారు. ఆయన పర్యటనకు ముందు సుమలత కీలక ప్రకటన చేశారు. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఓ సగటు భారతీయుడు తల ఎత్తుకునేలా మోదీ పరిపాలన సాగిస్తోన్నారని అన్నారు.
Read Also: Kiran Abbavaram: హీరోయిన్ తో ప్రేమాయణం.. కిరణ్ అన్నా అడ్డంగా దొరికిపోయావ్
Also Read
- Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
- IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
- Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
- 2 States Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం బీజేపీకే మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తాను కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అని తన కుమారుడు అభిషేక్ ఎప్పటికీ రాజకీయాల్లోకి రారని ఆమె చెప్పారు. నా మద్దతుదారులు, శ్రేయోభిలాషులను సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించినట్లు వెల్లడించారు. స్వతంత్ర ఎంపీగా నాలుగేళ్లు అనేక సవాళ్లను ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని ఆమె వెల్లడించారు. మోదీ ప్రపంచవ్యాప్తంగా ఆరాధించే వ్యక్తి అని కొనియాడారు.
మైసూర్-బెంగళూర్ ఎక్స్ప్రెస్వే ప్రారంభం, ప్రధాని మాండ్యాకు రావడం గొప్ప గౌరవం అని అన్నారు. ఇది జిల్లా ప్రాముఖ్యతను తెలియజేస్తోందని అన్నారు. మాండ్యాను కంచుకోటగా మార్చుకున్న జేడీఎస్ జిల్లాకు చేసిందేం లేదని దుయ్యబట్టారు. మాండ్యాలో మార్పు రావాలన్నారు. అంతకుముందు మాండ్యా నియోజకవర్గం దివంగత స్టార్ హీరో అంబరీష్ స్వస్థలం. ఆయన మరణం తర్వాత ఈ స్థానం నుంచి సుమలత పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కన్నడ ఇండస్ట్రీతో పాటు బీజేపీ కూడా సుమలతకు మద్దతు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడపై సుమలత విజయం సాధించారు.
తాజావార్తలు
-
Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
-
Mohsin Khan: “మెయిడెన్ ఓవర్.. ఆపై వికెట్”.. వైభవ్ జోరుకు బ్రేక్ వేసిన లక్నో పేసర్.. మునుపెన్నడూ జరగలే!
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
-
CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?