Sumalatha: ప్రధాని మోదీకే నా ఫుల్ సపోర్ట్.. బీజేపీకి సినీనటి, ఎంపీ సుమలత మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mandya MP Sumalatha extends ‘full support’ to BJP: ప్రముఖ సినీనటి, ఎంపీ సుమలత అంబరీష్ బీజేపీ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఆమె మాండ్యా లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోదీ కర్ణాకటక పర్యటనకు వెళ్లనున్నారు. మైసూరు-బెంగళూర్ 10 వరసల ఎక్స్ప్రెస్వేను ప్రారంభించేందుకు మాండ్యా వెళ్లనున్నారు. ఆయన పర్యటనకు ముందు సుమలత కీలక ప్రకటన చేశారు. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఓ సగటు భారతీయుడు తల ఎత్తుకునేలా మోదీ పరిపాలన సాగిస్తోన్నారని అన్నారు.
Read Also: Kiran Abbavaram: హీరోయిన్ తో ప్రేమాయణం.. కిరణ్ అన్నా అడ్డంగా దొరికిపోయావ్
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం బీజేపీకే మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తాను కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అని తన కుమారుడు అభిషేక్ ఎప్పటికీ రాజకీయాల్లోకి రారని ఆమె చెప్పారు. నా మద్దతుదారులు, శ్రేయోభిలాషులను సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించినట్లు వెల్లడించారు. స్వతంత్ర ఎంపీగా నాలుగేళ్లు అనేక సవాళ్లను ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని ఆమె వెల్లడించారు. మోదీ ప్రపంచవ్యాప్తంగా ఆరాధించే వ్యక్తి అని కొనియాడారు.
మైసూర్-బెంగళూర్ ఎక్స్ప్రెస్వే ప్రారంభం, ప్రధాని మాండ్యాకు రావడం గొప్ప గౌరవం అని అన్నారు. ఇది జిల్లా ప్రాముఖ్యతను తెలియజేస్తోందని అన్నారు. మాండ్యాను కంచుకోటగా మార్చుకున్న జేడీఎస్ జిల్లాకు చేసిందేం లేదని దుయ్యబట్టారు. మాండ్యాలో మార్పు రావాలన్నారు. అంతకుముందు మాండ్యా నియోజకవర్గం దివంగత స్టార్ హీరో అంబరీష్ స్వస్థలం. ఆయన మరణం తర్వాత ఈ స్థానం నుంచి సుమలత పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కన్నడ ఇండస్ట్రీతో పాటు బీజేపీ కూడా సుమలతకు మద్దతు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడపై సుమలత విజయం సాధించారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!