Sumalatha: ప్రధాని మోదీకే నా ఫుల్ సపోర్ట్.. బీజేపీకి సినీనటి, ఎంపీ సుమలత మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mandya MP Sumalatha extends ‘full support’ to BJP: ప్రముఖ సినీనటి, ఎంపీ సుమలత అంబరీష్ బీజేపీ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఆమె మాండ్యా లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోదీ కర్ణాకటక పర్యటనకు వెళ్లనున్నారు. మైసూరు-బెంగళూర్ 10 వరసల ఎక్స్ప్రెస్వేను ప్రారంభించేందుకు మాండ్యా వెళ్లనున్నారు. ఆయన పర్యటనకు ముందు సుమలత కీలక ప్రకటన చేశారు. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఓ సగటు భారతీయుడు తల ఎత్తుకునేలా మోదీ పరిపాలన సాగిస్తోన్నారని అన్నారు.
Read Also: Kiran Abbavaram: హీరోయిన్ తో ప్రేమాయణం.. కిరణ్ అన్నా అడ్డంగా దొరికిపోయావ్
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం బీజేపీకే మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తాను కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అని తన కుమారుడు అభిషేక్ ఎప్పటికీ రాజకీయాల్లోకి రారని ఆమె చెప్పారు. నా మద్దతుదారులు, శ్రేయోభిలాషులను సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించినట్లు వెల్లడించారు. స్వతంత్ర ఎంపీగా నాలుగేళ్లు అనేక సవాళ్లను ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని ఆమె వెల్లడించారు. మోదీ ప్రపంచవ్యాప్తంగా ఆరాధించే వ్యక్తి అని కొనియాడారు.
మైసూర్-బెంగళూర్ ఎక్స్ప్రెస్వే ప్రారంభం, ప్రధాని మాండ్యాకు రావడం గొప్ప గౌరవం అని అన్నారు. ఇది జిల్లా ప్రాముఖ్యతను తెలియజేస్తోందని అన్నారు. మాండ్యాను కంచుకోటగా మార్చుకున్న జేడీఎస్ జిల్లాకు చేసిందేం లేదని దుయ్యబట్టారు. మాండ్యాలో మార్పు రావాలన్నారు. అంతకుముందు మాండ్యా నియోజకవర్గం దివంగత స్టార్ హీరో అంబరీష్ స్వస్థలం. ఆయన మరణం తర్వాత ఈ స్థానం నుంచి సుమలత పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కన్నడ ఇండస్ట్రీతో పాటు బీజేపీ కూడా సుమలతకు మద్దతు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడపై సుమలత విజయం సాధించారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!