Vijay Hazare Trophy: ఐపీఎల్లో అన్సోల్డ్ ప్లేయర్.. కట్ చేస్తే..! చితక్కొట్టుడే
- విజయ్ హజారే ట్రోపీలో చితక్కొడుతున్న మయాంక్ అగర్వాల్
- ఈ టోర్నీలో 7 మ్యాచ్ల్లో 4 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ సాధించిన మయాంక్
- ఐపీఎల్ మెగా వేలంలో అన్సోల్డ్ ప్లేయర్గా నిలిచిన మయాంక్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025కి ముందు జరిగిన మెగా వేలంలో టీమిండియా మాజీ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ను అమ్ముడుపోలేదు. అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అంతకుముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడాడు. పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. అయితే తాజాగా.. మెగా వేలంలో అమ్ముడుపోలేదు. కానీ.. విజయ్ హజారే ట్రోపీలో మయాంక్ అగర్వాల్ చితక్కొడుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్ల్లో 4 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ సాధించాడు.
Read Also: MK Stalin: “సింధూ నాగరికత”ను డీకోడ్ చేసిన వారికి రూ. 8.5 కోట్ల ప్రైజ్మనీ.. స్టాలిన్ ప్రకటన..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఆదివారం నాగాలాండ్తో జరిగిన మ్యాచ్లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సెంచరీ సాధించాడు. మయాంక్ అగర్వాల్ 97.48 స్ట్రైక్ రేట్తో 119 బంతుల్లో 116 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. మయాంక్ దూకుడు ఇన్నింగ్స్తో కర్ణాటక 9 వికెట్ల తేడాతో నాగాలాండ్ను ఓడించింది. ఈ టోర్నీలో మయాంక్ అగర్వాల్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ, అతను ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా ఉన్నాడు. 7 మ్యాచ్లలో 7 ఇన్నింగ్స్లలో 153.25 సగటుతో.. 111.66 స్ట్రైక్ రేట్తో 613 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో ఇప్పటివరకు 66 ఫోర్లు, 18 సిక్సర్లు కొట్టాడు.
Read Also: CM Revanth Reddy : రేపు ఆరాంఘర్-జూ పార్క్ ఫ్లైఓవర్ను ప్రారంభిచనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఈ టోర్నీలో ముంబైతో జరిగిన మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ 47 పరుగులు చేశాడు. ఆ తర్వాత పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. డిసెంబర్ 26న పంజాబ్తో జరిగిన మ్యాచ్లో మయాంక్ 139 పరుగులు చేశాడు. అరుణాచల్తో జరిగిన మరుసటి మ్యాచ్లో 100 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. డిసెంబర్ 31న హైదరాబాద్తో కర్ణాటక తలపడింది. ఈ మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ 124 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను 15 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. సౌరాష్ట్రతో జరిగిన చివరి మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ సాధించాడు. అతను 65 బంతుల్లో 106.15 స్ట్రైక్ రేట్తో 69 పరుగులు చేశాడు. ఇలా.. విజయ్ హజారే ట్రోఫీలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..