MK Stalin: “సింధూ నాగరికత”ను డీకోడ్ చేసిన వారికి రూ. 8.5 కోట్ల ప్రైజ్మనీ.. స్టాలిన్ ప్రకటన..
- సింధు లోయ నాగరికతను డీకోడ్ చేసిన వారికి భారీ నజరానా..
- ద్రావిడ సంస్కృతికి, సింధు నాగరికతకు పోలిక..
- తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: సింధులోయ నాగరికత, ప్రపంచంలోని అతి పురాతన నాగరికతల్లో ఒకటి. హరప్పా, మొహంజదారో వంటి ప్రణాళిక బద్ధమైన పట్టణాలకు కేంద్రంగా ఉంది. అయితే, ఇలాంటి నాగరికతకు చెందిన లిపిని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే, సింధూ నాగరికత స్క్రిప్ట్ని విజయవంతంగా అర్థం చేసుకునే వారికి 1 మిలియన్ డాలర్లు(సుమారుగా రూ. 8.5 కోట్లు) నగదు బహుమతిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రకటించారు.
చెన్నైలో జరిగిన సింధు నాగరికత సదస్సు శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తూ ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. ఒకప్పుడు విలసిల్లిన సింధు నాగరికత లిపిని మనం ఇప్పటికీ స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతున్నామని, ఈ చిక్కుముడిని పరిష్కరించడానికి పండితులు నేటికీ కృషి చేస్తున్నారని, ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించడానికి, చిక్కులను ప్రయత్నించే వ్యక్తులకు లేదా సంస్థలకు రూ. 8.5 కోట్ల బహుమతి అందించబడుతుందని ఆయన చెప్పారు.
Also Read
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
- TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
Read Also: Kumbh Mela: “వక్ఫ్” భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారు..
సింధు లోయ నాగరికత అత్యంత పురాతన పట్టణ నాగరికతత్లో ఒకటి. దాని పట్టణ ప్రణాళికలకు, లిపికి ప్రసిద్ధి చెందింది. ఈ నాగరికత క్షీణతకు సంబంధించిన రహస్యాల ఇప్పటికీ చరిత్రకారుల్ని అబ్బురపరుస్తూనే ఉన్నాయి. 1924లో సర్ జాన్ మార్షల్ సింధు లోయ నాగరికతను కనుగొన్నారు. ఇది భారతదేశ చరిత్రకు మూలంగా ఉంది. ఆర్యన్, సంస్కృత ప్రభావాలను కలిగి ఉంది.
“ద్రావిడ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే ఎద్దుల చిహ్నాలు సింధు లోయ కళాఖండాలలో ప్రబలంగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి, అయితే గుర్రపు వర్ణనలు ప్రస్ఫుటంగా లేవు. ఇంకా, తమిళనాడులోని శివకలై, ఆదిచనల్లూర్, మైలదుంపరై వంటి ప్రదేశాలలో చిహ్నాలు, శాసనాలు కనుగొనబడ్డాయి. సింధూ లోయతో 60 శాతం పోలికలు ఉన్నాయి, శాసనాలు 90 శాతం సారూప్యతను చూపుతున్నాయి” అని ఎంకే స్టాలిన్ చెప్పారు. తమిళనాడులో కనుగొన్న వస్తువులు సైంటిఫిక్ డేటింగ్, సింధులోయ నాగరికతతో సరిపోలుతుందని నిర్ధారించిందని, రెండు ప్రాంతాల భాగస్వామ్య సాంస్కృతిక మరియు చారిత్రక మూలాలను నొక్కి చెబుతుందని అన్నారు.
తాజావార్తలు
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
-
S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
-
Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
-
CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!