MK Stalin: “సింధూ నాగరికత”ను డీకోడ్ చేసిన వారికి రూ. 8.5 కోట్ల ప్రైజ్మనీ.. స్టాలిన్ ప్రకటన..
- సింధు లోయ నాగరికతను డీకోడ్ చేసిన వారికి భారీ నజరానా..
- ద్రావిడ సంస్కృతికి, సింధు నాగరికతకు పోలిక..
- తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: సింధులోయ నాగరికత, ప్రపంచంలోని అతి పురాతన నాగరికతల్లో ఒకటి. హరప్పా, మొహంజదారో వంటి ప్రణాళిక బద్ధమైన పట్టణాలకు కేంద్రంగా ఉంది. అయితే, ఇలాంటి నాగరికతకు చెందిన లిపిని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే, సింధూ నాగరికత స్క్రిప్ట్ని విజయవంతంగా అర్థం చేసుకునే వారికి 1 మిలియన్ డాలర్లు(సుమారుగా రూ. 8.5 కోట్లు) నగదు బహుమతిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రకటించారు.
చెన్నైలో జరిగిన సింధు నాగరికత సదస్సు శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తూ ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. ఒకప్పుడు విలసిల్లిన సింధు నాగరికత లిపిని మనం ఇప్పటికీ స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతున్నామని, ఈ చిక్కుముడిని పరిష్కరించడానికి పండితులు నేటికీ కృషి చేస్తున్నారని, ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించడానికి, చిక్కులను ప్రయత్నించే వ్యక్తులకు లేదా సంస్థలకు రూ. 8.5 కోట్ల బహుమతి అందించబడుతుందని ఆయన చెప్పారు.
Also Read
- PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
- Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
- Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
Read Also: Kumbh Mela: “వక్ఫ్” భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారు..
సింధు లోయ నాగరికత అత్యంత పురాతన పట్టణ నాగరికతత్లో ఒకటి. దాని పట్టణ ప్రణాళికలకు, లిపికి ప్రసిద్ధి చెందింది. ఈ నాగరికత క్షీణతకు సంబంధించిన రహస్యాల ఇప్పటికీ చరిత్రకారుల్ని అబ్బురపరుస్తూనే ఉన్నాయి. 1924లో సర్ జాన్ మార్షల్ సింధు లోయ నాగరికతను కనుగొన్నారు. ఇది భారతదేశ చరిత్రకు మూలంగా ఉంది. ఆర్యన్, సంస్కృత ప్రభావాలను కలిగి ఉంది.
“ద్రావిడ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే ఎద్దుల చిహ్నాలు సింధు లోయ కళాఖండాలలో ప్రబలంగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి, అయితే గుర్రపు వర్ణనలు ప్రస్ఫుటంగా లేవు. ఇంకా, తమిళనాడులోని శివకలై, ఆదిచనల్లూర్, మైలదుంపరై వంటి ప్రదేశాలలో చిహ్నాలు, శాసనాలు కనుగొనబడ్డాయి. సింధూ లోయతో 60 శాతం పోలికలు ఉన్నాయి, శాసనాలు 90 శాతం సారూప్యతను చూపుతున్నాయి” అని ఎంకే స్టాలిన్ చెప్పారు. తమిళనాడులో కనుగొన్న వస్తువులు సైంటిఫిక్ డేటింగ్, సింధులోయ నాగరికతతో సరిపోలుతుందని నిర్ధారించిందని, రెండు ప్రాంతాల భాగస్వామ్య సాంస్కృతిక మరియు చారిత్రక మూలాలను నొక్కి చెబుతుందని అన్నారు.
తాజావార్తలు
-
PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
-
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్న్యూస్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!