MK Stalin: “సింధూ నాగరికత”ను డీకోడ్ చేసిన వారికి రూ. 8.5 కోట్ల ప్రైజ్మనీ.. స్టాలిన్ ప్రకటన..
- సింధు లోయ నాగరికతను డీకోడ్ చేసిన వారికి భారీ నజరానా..
- ద్రావిడ సంస్కృతికి, సింధు నాగరికతకు పోలిక..
- తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: సింధులోయ నాగరికత, ప్రపంచంలోని అతి పురాతన నాగరికతల్లో ఒకటి. హరప్పా, మొహంజదారో వంటి ప్రణాళిక బద్ధమైన పట్టణాలకు కేంద్రంగా ఉంది. అయితే, ఇలాంటి నాగరికతకు చెందిన లిపిని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే, సింధూ నాగరికత స్క్రిప్ట్ని విజయవంతంగా అర్థం చేసుకునే వారికి 1 మిలియన్ డాలర్లు(సుమారుగా రూ. 8.5 కోట్లు) నగదు బహుమతిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రకటించారు.
చెన్నైలో జరిగిన సింధు నాగరికత సదస్సు శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తూ ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. ఒకప్పుడు విలసిల్లిన సింధు నాగరికత లిపిని మనం ఇప్పటికీ స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతున్నామని, ఈ చిక్కుముడిని పరిష్కరించడానికి పండితులు నేటికీ కృషి చేస్తున్నారని, ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించడానికి, చిక్కులను ప్రయత్నించే వ్యక్తులకు లేదా సంస్థలకు రూ. 8.5 కోట్ల బహుమతి అందించబడుతుందని ఆయన చెప్పారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: Kumbh Mela: “వక్ఫ్” భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారు..
సింధు లోయ నాగరికత అత్యంత పురాతన పట్టణ నాగరికతత్లో ఒకటి. దాని పట్టణ ప్రణాళికలకు, లిపికి ప్రసిద్ధి చెందింది. ఈ నాగరికత క్షీణతకు సంబంధించిన రహస్యాల ఇప్పటికీ చరిత్రకారుల్ని అబ్బురపరుస్తూనే ఉన్నాయి. 1924లో సర్ జాన్ మార్షల్ సింధు లోయ నాగరికతను కనుగొన్నారు. ఇది భారతదేశ చరిత్రకు మూలంగా ఉంది. ఆర్యన్, సంస్కృత ప్రభావాలను కలిగి ఉంది.
“ద్రావిడ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే ఎద్దుల చిహ్నాలు సింధు లోయ కళాఖండాలలో ప్రబలంగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి, అయితే గుర్రపు వర్ణనలు ప్రస్ఫుటంగా లేవు. ఇంకా, తమిళనాడులోని శివకలై, ఆదిచనల్లూర్, మైలదుంపరై వంటి ప్రదేశాలలో చిహ్నాలు, శాసనాలు కనుగొనబడ్డాయి. సింధూ లోయతో 60 శాతం పోలికలు ఉన్నాయి, శాసనాలు 90 శాతం సారూప్యతను చూపుతున్నాయి” అని ఎంకే స్టాలిన్ చెప్పారు. తమిళనాడులో కనుగొన్న వస్తువులు సైంటిఫిక్ డేటింగ్, సింధులోయ నాగరికతతో సరిపోలుతుందని నిర్ధారించిందని, రెండు ప్రాంతాల భాగస్వామ్య సాంస్కృతిక మరియు చారిత్రక మూలాలను నొక్కి చెబుతుందని అన్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!