Israel: భారతీయుడి మృతి వెనుక అంతులేని విషాదం
ఇజ్రాయెల్పై (Israel) జరిగిన క్షిపణి దాడిలో భారతీయుడి మృతి.. ఆ కుటంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. మృతుడు కేరళకు చెందిన మ్యాక్స్వెల్గా గుర్తించారు. మ్యాక్స్వెల్కు ఇప్పటికే ఐదేళ్ల కుమార్తె (Daughter) ఉండగా.. భార్య ఏడు నెలల గర్భవతిగా (Pregnant wife) ఉంది. రెండు నెలల క్రితమే మ్యాక్స్వెల్ పనుల నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లాడు. క్షిపణి దాడిలో ఇలా ప్రాణాలు కోల్పోవడంతో కుటంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టబోయే బిడ్డను చూడకుండానే ఇలా అర్థాంతరంగా ప్రాణాలు పోవడంతో బంధువులు కున్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మ్యాక్స్వెల్ స్వస్థలం కొల్హాంలోని కైకులంగారా. వ్యవసాయం క్షేత్రంలో పని చేసేందుకు రెండు నెలల క్రితమే ఇజ్రాయెల్ వెళ్లారు. ఆయన భార్య రెండోసారి ఏడు నెలల గర్భిణి. ఆ జంటకు ఇప్పటికే ఐదేళ్ల కుమార్తె కూడా ఉంది. మ్యాక్స్వెల్కు ప్రమాదం జరిగిందని.. సోమవారం సాయంత్రం తమ కోడలు ఫోన్ చేసి చెప్పిందని… అర్ధరాత్రికి కుమారుడి మరణవార్త తెలిసిందని మ్యాక్స్వెల్ తండ్రి విలపించారు. మ్యాక్స్వెల్ మృతదేహం నాలుగు రోజుల్లో భారత్కు రానున్నట్లు తెలుస్తోంది. ఇదే దాడిలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read
ఈ దాడి హెజ్బొల్లా పనేనని అనుమానిస్తున్నారు. హమాస్కు మద్దతుగా ఈ గ్రూప్ అక్టోబర్ 8 నుంచి ఉత్తర ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీనికి ప్రతీకారంగా హెజ్బొల్లా స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది.
ఇదిలా ఉంటే కేరళ వాసి మృతితో భారత్ అప్రమత్తమైంది. భారతీయులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతమున్న భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే, పర్యటించే భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది.
తాజావార్తలు
-
Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
-
Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
-
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!