MLA KP Nagarjuna Reddy: అపర భగీరథుడు సీఎం జగన్.. ఆయనకు పాదాభివందనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA KP Nagarjuna Reddy: అపర భగీరథుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆయనకు రైతుల తరుపున పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.. మార్కాపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 15 లక్షల మంది ప్రజలకు తాగునీరు, 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే 50 సంవత్సరాల పశ్చిమ ప్రకాశం ప్రజలకల నెరవేరుస్తూ.. వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసిన అపర భగీరథుడు సీఎం వైఎస్ జగన్కి ప్రజలందరూ, రైతుల తరుపున పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి చాలా వరకూ పూర్తిచేయగా.. 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును ఏటీఎం లాగా వాడుకుని వదిలేస్తే.. అధికారంలోనికి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని.. వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తి చేసిన అపర భగీరథుడు అని అన్నారు. కరోనా రెండు సంవత్సరాల కాలాన్ని మిగిలిన రెండున్నరేళ్లలోనే వెలుగొండ ప్రాజెక్టు మొదటి, రెండవ టన్నెల్స్ పూర్తి చేశారని ప్రశంసలు కురిపించారు.
Read Also: YSRCP Rebel MLAs Letter: నోటీసులపై స్పందించిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. స్పీకర్కు లేఖలు
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
కాగా, ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వెలిగొండ కల సాకారం చేస్తూ.. రెండో టన్నెల్ పూర్తి చేసిన విషయం తెలిసిందే.. రెండో సొరంగం తవ్వకం పనులు మంగళవారంతో ముగిసాయి.. 2019, మే 30 నాటికి మిగిలిపోయిన 7.698 కిలోమీటర్ల తవ్వకం పనులు 23వ తేదీన పూర్తి చేసినట్టు ఇంజీనీర్లు ప్రకటించారు.. ఇక, మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేసింది ప్రభుత్వం.. రెండో టన్నెల్ పనులు ఈ రోజు పూర్తి కావడంతో.. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ఘనత సొంతం చేసుకుంది.. శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా నల్లమల సాగర్కు నీటిని తరలించడానికి ఫీడర్ ఛానల్ ఇప్పటికే పూర్తి చేశారు.. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్ రిజర్వాయర్.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే పూర్తి చేశారు.. శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరగానే నల్లమల సాగర్కు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు.. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు.. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని దాదాపు 4.47 లక్షల ఎకరాలు సాగునీటి సరఫరాకు మార్గం సుగమం అయినట్టు అవుతుది.. మూడు జిల్లాల పరిధిలోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది..
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!